NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
జాతీయ గోపాల రత్న- 2023 అవార్డుల దరఖాస్తులు
జాతీయ పశుసంవర్ధక, పాడి, మత్స్య పరి శ్రమ శాఖ ఆన్లైన్ నామినేషన్లను ఆహ్వానిస్తోంది. వెబ్సైట్ ద్వారా ఈ నెల15 నుంచి వచ్చే నెల 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దేశీ పశుజాతుల పెంపకదారులకు, పాడి రైతులకు స్థిరమైన జీవనోపాధిని అందించేందుకు ప్రభుత్వం 3 విభాగాల్లో ఈ పురస్కారాలను అందిస్తోంది. ప్రతి విభాగంలో మూడు అవార్డులతో పాటు రూ.5, రూ.3, రూ.2 లక్షల నగదు బహుమతులు ఇస్తారు. నవంబర్ 26న జాతీయ పాల దినోత్సవం రోజు ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. గుర్తింపు పొందిన దేశీ గోజాతులు (ఏపీ- ఒంగోలు, పుంగనూరు, మోటు, తెలంగాణ- పొడతూర్పు), గేదెలను శ్రద్ధగా పెంచి పోషించే రైతులు. ఉత్తమ సేవలందిస్తున్న డెయిరీ సహకార సంఘం లేదా పాల ఉత్పత్తిదారులు కంపెనీ లేదా పాడి రైతు ఉత్పత్తిదారుల సంస్థలు. ఉత్తమ సాంకేతిక నిపు సేవలందిస్తున్న కృత్రిమ గర్భధారణలు ఈ పురస్కారాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత ప్రమాణాలు, నామినేషన్ ఆన్లైన్ ప్రక్రియ గురించి మరిన్ని వివ రాల కోసం https://awards.gov.in లేదా https://dahd.nic.in వెబ్సైట్లను చూడొచ్చు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
రోజుకు 240 గ్రాముల కూరగాయలు తినాలి.
ICRISAT లోని వరల్డ్ వెజిటబుల్ సెంటర్ 50వ వార్షికోత్సవంలో అంతర్జాతీయ కూరగాయల పరిశోధన కేంద్రం డైరెక్టర్ జనరల్ డాక్టర్ మార్కోవో పేరీస్ పాల్గొన్నారు. ఆయన రైతులకు కూరగాయలు పండించే విధానాన్ని వివరించారు. కూరగాయలు ఎంత తీసుకోవాలి, నిత్యం కూరగాయలను ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యకరంగా ఉంటారని, ఒక మనిషి నిత్యం 240 గ్రాముల కూరగాయలను ఆహారంగా తీసుకోవా లి. భారత్లో కేవలం 145 గ్రాములే తీసుకుంటున్నారని అన్నారు. కూరగాయల సాగులో రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడటం వల్ల అవి తిన్నవారికి అనారోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్పారు. కూరగాయలు, పండ్లపై మరింత పరిశోధన జరగాలన్నారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
ఉద్యాన పంట సాగులో అనంతపురం టాప్ తక్కువ ధరకే పండ్లు ,కూరగాయలు!!
అత్యల్ప వర్షపాతం తో నమోదయ్యే ప్రాంతంగా నిలిచింది అనంతపురం .ఈ ప్రాంతం లో బత్తాయి, డ్రాగన్ పండ్లు,అంజూర్,దానిమ్మ పండ్లు గ్రాండ్9 అరటి గెలలు మరియు ఖర్జూర పండ్లను పండిస్తున్నారు.తక్కువ నీటి తో అధిక దిగుబడినిచ్చే పంటలు రైతులకు మంచి ఆదాయ వనరుగా మారాయి.ఈ జిల్లా లో పండించే కూరగాయలు రుచికి నాణ్యతకు కూడా పేర్కొన్నవి.టమాట,పచ్చి మిరప,బెండకాయలు,ఎండు మిర్చి మొదలగు పంటలు సరసమైన ధరలకు లభిస్తుండటం తో కొనుగోలుదారులకు ,రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నాయి. ఈ ఉద్యాన పంట ఉత్పత్తులను విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు.రాష్ట్రం లో అన్ని పండ్లను పండించే జిల్లాల్లో మొదటిస్థానం లో నిలిచింది .ఈ తరహా పంటలు రైతులకు లాభదాయకంగా ఉంటుంది.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
ఈ నెల 25 నుంచి 27 వరకు ఇండియాలో అతిపెద్ద అగ్రిటెక్ ఎక్స్ పో !!
బెంగళూరులోని BIECలో మూడు రోజులపాటు 14వ ఎడిషన్ అగ్రిటెక్ ఇండియా 2023 అతిపెద్ద అగ్రి ఎక్స్ పో జరుగనుందని, ఇందులో వ్యవసాయ యంత్రాలు, పరికరాలు, వ్యవసాయ డ్రోన్లు, విత్తనాలు, వ్యవసాయ రసాయనం, గ్రీన్ హౌస్, హైడ్రోపోనిక్స్, పరికరాల సరఫరాదారులు ఒకే వేదికపై చూడవచ్చని. 20కి పైగా దేశాల నుండి వందలాది మంది ఎగ్జిబిటర్లు పాల్గొనున్నారని సంస్థ నిర్వాహకులు తెలిపారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
మిల్లెట్స్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ !!
ఆంధ్రప్రదేశ్ చిరుధాన్యాల దిగుబడిలో మొదటిగా మరియు ఎగుమతుల్లో ఏడవ స్థానంలో నిలిచిందని నాబార్డు నివేదికలు విడుదల చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో ప్రోత్సాహం ధాన్యాలను డిమాండ్ ఆధారంగా దేశీయ, అంతర్జా తీయ మార్కెట్కు ఎగుమతి చేయటంతో పాటు రాష్ట్ర స్థాయిలో పాఠశాలలు, హాస్టళ్లలో పోషకాహారం కింద వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ప్రపంచ మార్కెట్లలో భారతీయ మిల్లెట్లను ప్రోత్సహించడానికి స్టార్టప్లు, అకడమిక్ రీసెర్చ్ సంస్థలు, భారతీయ మిషన్లు, ప్రాసెసర్లు, రిటైలర్లు, ఎగుమతిదారులతో భాగస్వామ్యాన్ని పెంచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కృషిచేస్తోందని, ప్రత్యేకంగా ఎగుమతి ప్రమోషన్ ఫోరమ్ (ఈపీఎఫ్) ను ఏర్పాటు చేసినట్లు కూడా తెలిపింది. ఐక్యరాజ్యసమితి 2023 ను చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో ఈ ఏడాది పొడుగునా వీటి ఉత్పత్తితో పాటు వినియోగం పెంచేందుకు వివిధ కార్యక్రమాల నిర్వహణ పై దృష్టి కొనసాగించాలని, చిరుధాన్యాల సాగులో జొన్నలు, సజ్జలను అధికంగా పండిస్తుండ గా సామలు, అరిక, రాగులు, కొర్రలు, వరిగ, ఊద ధాన్యాల సాగు విస్తీర్ణాన్ని కూడా పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
భారతదేశంలో ADeX మరియు ADMF ని తెలంగాణ ప్రారంభించింది !!
తెలంగాణ ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు భారతదేశపు మొట్టమొదటి వ్యవసాయ డేటా ఎక్స్ఛేంజ్ (ADeX) మరియు అగ్రికల్చర్ డేటా మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్ (ADMF)ని ఆగస్టు 2023లో హైదరాబాద్ లోప్రారంభించారు. ADeX వ్యవసాయ రంగానికి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (DPI) గా అభివృద్ధి చేయబడింది. ADeX యొక్క ముఖ్య ఉద్దేశ్యం పరిశ్రమలు మరియు స్టార్టప్ల ద్వారా వ్యవసాయ డేటా యొక్క న్యాయమైన మరియు సమర్థవంతమైన వినియోగాన్ని నిర్ధారించడం మరియు ప్రత్యేకంగా వ్యవసాయ రంగంలో డేటా ఆర్థిక వ్యవస్థకు పెద్ద ప్రోత్సాహాన్ని అందించడం.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
ట్రాక్టర్ కొనాలి అనుకునే రైతులకు శుభవార్త
ట్రాక్టర్ కొనాలి అనుకునే రైతులకు శుభవార్త రైతులకు వ్యవసాయంలో ఆసరాగా నిలిచే యంత్రాల్లో ట్రాక్టర్ ప్రధానమైనది. కానీ దీనిని కొనుగోలు చేయడం మాత్రం రైతులకు ఇప్పటికీ భారంగానే ఉంది. అన్నదాతకు తక్కువ ధరకే వ్యవసాయ పనిముట్లు అందించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ట్రాక్టర్ యోజన స్కీమ్ అమలు చేస్తోంది. ఈ స్కీమ్లో భాగంగా రైతులు 50 శాతం తక్కువ ధరతో (సబ్సిడీతో) ట్రాక్టర్ కొనుగోలు చేయొచ్చు. రైతు వయస్సు మాత్రం 18 సంవత్సరాల నుంచి 60 ఏళ్ల లోపు ఉండాలి. గడిచిన 7 సంవత్సరాలుగా ట్రాక్టర్ కొనుగోలు చేయని వారికి ఈ పథకం కింద మళ్లీ దరఖాస్తు పెట్టుకోవచ్చు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
తగ్గిన టమాటా ధర, కేజీ ఎంతంటే...
గత పది రోజులుగా భారీగా పెరుగుతూ రైతు మార్కెట్ లోనే 150 రూపాయలకు చేరిన టమోటో ధరలు కాస్త ఇప్పడు తగ్గుముఖం పట్టాయి. ఏకంగా కేజీ టమోటోపై రైతు మార్కెట్ లోనే 70 రూపాయలు తగ్గి ప్రస్తుతం కేజీ టమోటో 80 రూపాయలుగా ఉంది. అంటే సగానికి సగం తగ్గినట్లే. ఇక వచ్చే వారం రోజుల్లో ఈ ధరలు మరింత తగ్గనున్నట్లు మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. ఈ విధంగా తగ్గితే ప్రజలకు టమాటా కష్టాలు తీరినట్లే.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
ఆసియాలోనే అతిపెద్ద ఫ్రూట్ మార్కెట్ గా కోహెడ !!
ఆసియాలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్ నిర్మించనున్నట్లు తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. పండ్ల రైతులను ప్రోత్సహించడంతోపాటు ఎగుమతులకు అవకాశం కల్పించేలా ఆధునాతన వసతులతో, సరికొత్తగా కోహెడలో 199 ఎకరాల్లో రూ.403 కోట్లతో దుకాణాలు, కోల్డ్ స్టోరేజీల నిర్మాణం, పండ్ల ఎగుమతులకై ఎక్స్పోర్టు జోన్, రహదారులు, పార్కింగ్ మార్కెట్ ప్రణాళికను చేసారని. కొహెడ మార్కెట్లో వ్యాపారులు, ట్రేడర్లు, రైతులకు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇది ఆసియాలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్గా నిలుస్తుందన్నారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
మొదలైన రైతుల రుణమాఫీ !!
ఈరోజు నుండి రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. 2014 నుండి 2018 లోపు రుణాలు తీసుకున్న రైతుల ఖాతాల్లో జమచేయనునున్నారు. రైతుల సంక్షేమం మరియు వ్యవసాయాభివృద్ది కొరకు తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీకి 19 వేల కోట్ల రుణమాఫీ పునః ప్రారంభం చేయనున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రైతుల్లో ఆనందం కనిపిస్తున్నప్పటికి రైతుల ఖాతాల్లో ఎప్పుడు పడుతుందో అని బ్యాంకుల వద్ద బారులు తీరుతున్నారు. ఈ పక్రియ నేటితో మొదలై సెప్టెంబర్ 2వ వారం లోపు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.