09 Jun , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

TS అగ్రికల్చర్ డిప్లొమా కోర్సులకు నోటిఫికేషన్

ఆచార్య జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ 2023-24 సంవత్సరానికి వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. కోర్సు: డిప్లొమా ఇన్‌ అగ్రికల్చర్‌ (రెండేండ్లు), డిప్లొమా ఇన్‌ ఆర్గానిక్‌ అగ్రికల్చర్‌ (రెండేండ్లు), డిప్లొమా ఇన్‌ అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌ (మూడేండ్లు) ఎంపిక: పాలీసెట్‌-2022 అగ్రికల్చర్‌ స్ట్రీమ్‌లో వచ్చిన ర్యాంక్‌ ఆధారంగా దరఖాస్తు: ఆన్‌లైన్‌లో అర్హతలు: పదోతరగతి ఉత్తీర్ణతతో పాటు అగ్రికల్చరల్‌ స్ట్రీమ్‌లో పాలీసెట్‌-2022 పరీక్ష రాసి ఉండాలి. చివరితేదీ: 24-06-2023 వెబ్‌సైట్‌: https://diploma.pjtsau.ac.in

08 Jun , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

రైతులకు శుభవార్త

ఇప్పటికే ఆలస్యమైన నైరుతి ఋతుపవనాలు ఎట్టకేలకు కేరళ తీరాన్ని తాకాయి. వాతావరణం అనుకూలిస్తే, రెండు వారాల లోపే నైరుతి వర్షాలు తెలుగు రాష్ట్రాలలో ప్రవేశించే అవకాశం ఉంది కావున రైతులు తొందరపడకుండా, నేలలో తగినంత తడి శాతం మరియు విత్తనం మొలకెత్తడానికి అనుకులంగా ఉన్నప్పుడు మాత్రమే విత్తనాలు నాటమనీ సూచన. Courtesy : ASP

07 Jun , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

ఖరీఫ్ సాగుకు పెరిగిన మద్ధతు ధరలు

2023-24 సంవత్సరానికి సంబంధించి ఖరీఫ్‌ పంటలకు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరలను ఈరోజు పెంచింది. సాధారణ వరి క్వింటాల్‌కు 143 రూపాయల మేర పెంచిన ధరతో కలిపి 2,183 రూపాయలుగా, పెసలు కనీస మద్దతు ధరను 10.4 శాతం మేర పెంచి 8,558 రూపాయలుగా నిర్ణయించింది. ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరల పెంపు అన్నదాతలకు లాభయదాయకంగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.

07 Jun , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

ముందస్తు వరి సూచనలు

యాసంగిలో వరి ఈదురుగాలులు, వడగళ్ళ వానకు తీవ్ర నష్టానికి వాటిల్లింది. కావున వానాకాలంలో ముందస్తుగా సాగు చేయడం వలన అకాల వర్షాలను తప్పించుకోవడంతో పాటు చీడ పీడల సమస్య తక్కువగా ఉంటుందని తెలిపారు శాస్రవేత్తలు తెలిపారు. దీర్ఘకాలిక వరి రకాలను - మే నుండి జూన్ 5 లోపు, మధ్య కాలిక రకాలు జూన్ 15 లోపు మరియు స్వల్ప కాలిక రకాలు జూన్ 25 లోపు నారుపోసుకున్నట్లైతే అక్టోబర్ 20 తరువాత నుండి వరి కోతలు చేసుకోని ప్రకృతి వైపరిత్యానికి కాలాన్ని ముందుకు జరిపి అధిక దిగుబడులు సాదించే అవకాశం ఉందని శాస్త్రజ్ఞులు తెలుపుతున్నారు.


06 Jun , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

ఏపీ మత్స్య విశ్వవిద్యాలయం డిప్లొమాలో ప్రవేశాలు

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్శిటీ, క్యాంప్ ఆఫీస్.. 2023-24 విద్యా సంవత్సరా నికి సంబంధించి డిప్లొమా(ఫిషరీస్ సైన్స్) లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోగలరు. » కోర్సు వ్యవధి: రెండేళ్లు. » బోధనా మాధ్యమం : ఇంగ్లీష్. » సీట్ల సంఖ్య: ప్రభుత్వ కళాశాలల్లో 55, అనుబంధ కళాశాలల్లో 440. » అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. » వయసు: 15 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. » ఎంపిక విధానం: పదో తరగతిలో సాధించిన మార్కులు, స్థానికత, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు. » ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 12.06.2023. » ఆలస్య రుసుముతో దరఖాస్తులకు చివరితేది: 15.06.2023. » వెబ్ ఆప్షన్ తేది: 19.06.2023, » వెబ్సైట్: www.apfu.ap.gov.in.

05 Jun , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

జూలై నెలలో రైతు బంధు

మరో వారం పది రోజుల్లో వానాకాలం ప్రారంభం కానుంది. ఇప్పటికే పలుచోట్ల రైతులు సాగుపనులు ముమ్మరం చేశారు. ముఖ్యంగా ఎరువులు చల్లుకొవడం, దుక్కులు దున్నుకొవడం, విత్తనాల సేకరణ వంటి పనుల్లో ఉన్నారు. అయితే పెట్టుబడి సాయంగా అందించే రైతు బంధు ఖాతాల్లో పడటానికి ఇంకా మాసం రోజులు పట్టొచ్చని, కొత్త పాసుపుస్తకాలు ఎంట్రీ వల్లే ఈ ఆలస్యం జరుగుతుందని సమాచారం. పెట్టుబడుల కొసం వడ్డి వ్యాపారులను ఆశ్రయించకుండా ఉండాలంటే పెట్టుబడి సాయం త్పరితగతినా అందించాలని రైతుల కొరుకుంటున్నారు.

03 Jun , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

భుసారానికి - పశువుల ఎరువు

ప్రస్తుతం ఖరిఫ్ పంట వేయడానికి సన్నద్దమవుతున్న రైతులు భూసారాన్ని పెంచడానికి సేంద్రియ ఎరువు భూ భౌతిక స్టితి మెరుగుపరచడానికి సరైనది. ఎకరాకు 10 టన్నులు (3ట్రాక్టర్లు) పశువుల ఎరువు వేస్తే ఫలితంగా సేంద్రియ పదార్ధం భూమిలో చేరి ఆరోగ్యంగా ఉండడమే కాక భూముల్లో నీటి నిల్వ సామర్థ్యం మెరుగుపడుతుంది. నేలలో సారం పెరిగి పంట దిగుబడి అధికంగా లభిస్తుంది. చీడపీడల సమస్య తగ్గి రసాయనిక ఎరువుల వినియోగం తగ్గుతుంది. ఎరువును చిమ్మించి మెట్ట దుక్కులు దున్నితే మరింత ప్రయోజనం ఉంటుంది. మెట్ట, మాగాణి భూములకు వర్షాలు కురవక ఒక ముందే పశువుల ఎరువు వేయాల్సి ఉంతుంది.


02 Jun , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

పొలాల్లో మిగిలిన వరి గడ్డిని కాల్చొద్దు

వరి కోతల తరువాత రెక్క నాగలి లేదా మల్చర్ సహాయంతో వరి గడ్డి పొలంలోనే కలియదున్నలి. గడ్డి తక్కువగా ఉన్నప్పుడు రోటోవేటర్ కూడా నడిపించే వీలుంటుంది. వరికొయ్యలను కాల్చితే నష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదని, కాల్చడం ద్వారా విపరీతమైన వేడితో భూమి సారాన్ని కోల్పోతుంది. ముఖ్యంగా నత్రజని, ఫాస్ఫరస్‌ లాంటి పోషక పదార్థాల శాతం తగ్గుతుంది, దిగుబడీ పోతుంది, భూమికి పీచు పదార్థంగా ఉపయోగపడే అవశేషాలు కాలిపోయి, పంటలకు అవసరమైన ఖనిజ లవణాలు దెబ్బతింటాయి. పొలాల్లో తిరిగే అనేక జీవరాసులు చనిపోయే ప్రమాదం ఉంది. దీంతో ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది. పొలాల గట్లు, మొరం గడ్డలపై ఉన్న పచ్చని చెట్లు కాలిపోవడంతో పర్యావరణానికి హాని కలుగుతుంది. ఆలస్యంగా కోతకు వచ్చే పంటలు, కల్లాల దగ్గరే ఉన్న ధాన్యం కాలిపోయి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని వ్యవసాయాధికారులు తెలుపుతున్నారు.

01 Jun , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

హైడ్రోపోనిక్ గ్రాసాలకు మస్త్ డిమాండ్

పౌల్ట్రీ, పాడి రంగాల్లో హైడ్రోపోనిక్ గ్రాసాల పై యజమానులు ఆసక్తీర చూపుతున్నారు. హైడ్రోపోనిక్ పశుగ్రాసం అంటే గోధుమ, మొక్క, జొన్న, బార్లీ వంటి గింజలను నేల లేకుండా, అవసరమైన పోషకాలతో సమృద్ధిగా ఉన్న నీటి ఆధారిత ద్రావణాలను ఉపయోగించి ఆకుపచ్చ గ్రాసంగా పెంచే పద్ధతి. నియంత్రిత వాతావరణంలో ధాన్యాలను మొలకెత్తించి, వారం లేదా అంతకంటే ఎక్కువ రోజుల్లో చిన్న మొక్కలుగా మారుతాయి. ఇందులో విటమిన్లు, ఖనిజాలు మరియు ఎంజైమ్‌ల అధిక మోతాదులో ఉంటాయి. అలాగే వాతావరణం లేదా సీజన్‌తో సంబంధం లేకుండా ఏడాది పొడవునా తాజా పచ్చి మేతను ఉత్పత్తి చేయగలవు. దీంతో పాడి రంగంలో పాల ఉత్పత్తి, పౌల్ట్రీ రంగంలో మాంసం ఉత్పత్తి పెరుగుతుంది.

31 May , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

జూన్ రెండో వారంలో నైరుతి ఋతుపవనాలు

వాతావరణ శాఖ ఋతుపవనాలు గమనం పై బులిటెన్ ను విడుదల చేసింది. జూన్ 4 వ తేదీన కేరళలోకి నైరుతి ఋతుపవనాల ప్రవేశించనున్నట్లు వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలో విస్తరించానికి దాదాపు వారం నుంచి 15 రోజుల సమయం పడుతుందన్నారు. ఋతుపవనాలు ప్రవేశించడం ద్వారా ఎండలు తగ్గు ముఖం పట్టే అవకాశం ఉంది. చిరుజల్లులను చూసి తొందర పడి రైతులు విత్తనాలు విత్తుకుంటే భూమిలో మొలకలు ఉడికిపోయే అవకాశం ఉంది కావున విత్తనం విత్తే తేమ కనబడినప్పుడే విత్తనాలు విత్తుకొవాలని రైతులకు విజ్తప్తీ.