NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
రైతు భీమా దరఖాస్తు !!
రైతులకు జూన్ 28 వరకు కొత్తగా పట్టా బుక్ వచ్చిన వారికి మరియు ఇంత వరకు కూడా రైతు భీమా నమోదు చేసుకొని వారు రైతు భీమా నమోదు చేసుకోవాడానికి చివరి తేది - ఆగస్టు 4 గతంలో భీమా చేసుకున్నా రైతులు భీమాలో మార్పులు చేర్పులు లేదా నామిని మార్పు కోసం చివరి తేది - జూలై 30 కావలసిన పత్రాలు : 1 దరఖాస్తు ఫారం 2.రైతు పట్టా దారు పాస్ బుక్ (జిరాక్స్) 3.రైతు ఆధార్ కార్డు (జిరాక్స్) 4.నామిని ఆధార్ కార్డు(జిరాక్స్) గమనిక : 18 నుండి 59 సంవత్సరాలు వయస్సు ఉన్న రైతులు మాత్రమే భీమా నమోదు చేసుకోవాలి ఇంకా ఏమైనా మీకు సందేహాలు ఉంటే వ్యవసాయ అధికారులను సంప్రదించగలరు...
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
వ్యవసాయరంగానికి బడ్జెట్ లో ఎంత ??
2024-25 ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి ఉత్పాదకతకు మరియు స్థితిస్థాపకతకు మొత్తం 1.52 లక్షల కోట్లు రూపాయిల నిధులు కేటాయించారు. రానున్న రెండేళ్లలో కోటిమంది రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేసేలా ఇన్ పుట్ రిసోర్స్ కేంద్రాలు ప్రోత్సాహం. మారుతున్న వాతావరణ పరిస్థితులను తట్టుకొని నిలబడి, అధిక అధిక దిగుబడినిచ్చే, 109 హై-యీల్డింగ్ రకాలను విడుదల చేసారని నిర్మల సీతారామన్ తెలిపారు. పప్పుదినుసులు మరియు నూనే గింజలలో సమృద్ది మరియు కూరగాయల ఉత్పత్తి కోసం పెద్ద ఎత్తున క్లస్టర్లు అభివృద్ధి సహకార సంఘాలు, స్టార్టప్ లకు మరియు రొయ్యల పెంపకం మరియు ఎగుమతి ప్రభుత్వం ప్రోత్సాహం చేయబోతున్నామని తదితర వ్యవసాయ విషయాలను ఆర్థిక మంత్రి చెప్పారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
ఏపి రైతులందరికీ పంటల బీమా!!
నోటిఫై చేసిన పంటలు, సాగు చేసే రైతులందరికీ పంటల బీమా వర్తింపజేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రులు ఆధికారులను ఆదేశించారు. విపత్తుల వేళ నష్టపోయే ప్రతి రైతుకు న్యాయం జరిగేలా బీమా అమలు చేయాలని సూచించారు. మెరుగైన పంటల బీమా అమలు, దిగుబడి ఆధారంగా, వాతావరణ పరిస్థితులను బట్టి బీమా అమలు, క్లెయిమ్ల చెల్లింపులు తదితర అంశాలపై చర్చించామని, ఇందుకు సంబంధించి నివేదికను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి ఆమోదం కోసం పంపుతామని మంత్రులు తెలిపారు. గతంలో బీమా లేక నష్టపోయిన మామిడి రైతులకు కూడా పంటల బీమా వర్తింపజేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
ఆంధ్రప్రదేశ్ రైతులకు ఖరీఫ్ సీజన్ ఎరువులు సిద్దం !!
ఖరీఫ్ సీజన్ కోసం పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని, రైతుల కోసం విక్రయించేందుకు 1321 సహకార సంఘాల్లో ఎరువులను సిద్ధం చేయాలని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి ఆదేశించారు . ఖరిఫ్ సీజన్ కోసం 17.50లక్షల టన్నుల ఎరువులను సిద్ధం చేయాలని వ్యవసాయ మంత్రి ఆదేశించారు. ఈ సీజన్ కోసం రాష్ట్రంలో ప్రస్తుతం 14 లక్షల టన్నుల ఎరువులు ఉన్నాయని, మిగిలిన వాటిని కూడా సకాలంలో రాష్ట్రానికి చేరుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి తెలిపారు .
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
సైబర్ నేరగాల్లతో రైతులు జాగ్రత్త !!
తెలంగాణ రాష్ట్రంలో పెద్ద మొత్తంలో రుణమాఫీ నిధులు ఇవాల్టి నుండి రైతుల ఖాతాల్లో పడుతుండగా సైబర్ నేరగాళ్ళు లింకులు పంపి మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. బాంకు పేర్లు వివరాలను చూసి మోసపోవద్దు అని సైబర్ క్రైమ్ అధికారులు సూచిస్తున్నారు. రైతులు ఇలాంటి అనవసర మెసేజ్ లను, ముఖ్యంగా APK రూపంలో వచ్చేవి అస్సలు క్లిక్ చేయవద్దు. దాని వలన మీ అకౌంట్ లో ఉండే డబ్బులను కోల్పోవడం జరుగుతుంది కావున అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటివి మీరు ఎదుర్కున్నట్లితే వెంటనే 1930 సైబర్ క్రైమ్ పోలీసులకు సంప్రదించాలని తెలిపారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
నేడే రుణమాఫీ.......!!
తెలంగాణ రైతులు ఎంతగానో ఆసక్తితో ఎదురుచూస్తున్న రుణమాఫీ డబ్బులు నేడు జమ కానున్నాయి. లక్షలోపు రుణాలు తీసుకున్న రైతుల రుణాలను ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం మాఫీ చేస్తుంది. ఆగస్ట్ 15 లోపు లక్షన్నర నుండి రెండు లక్షల వరకు తీసుకున్న రుణాలను మాఫీ చేయనుంది.12 డిసెంబర్2018 నుండి 9 డిసెంబర్ 2023 లోపు స్వల్ప కాలిక పంటలకు తీసుకున్న రుణాలకు ఈ పధకం అమలు అవుతుంది. ఇందులో రుణాలు, వడ్డీతో కలిపి 2 లక్షల వరకు ప్రభుత్వం మాఫీ చేయనుంది.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
23 నుంచి పొలం పిలుస్తోంది.... కార్యక్రమం !!
ఈ నెల 23 నుంచి పొలం పిలుస్తోంది అనే కార్యక్రమానికి క్షేత్ర స్థాయి పర్యటనలకు శ్రీకారం చుడుతున్నారు. ఇందులో వ్యవసాయ మరియు అనుబంధ శాఖల అధికారులతో పాటు కేవీకేల శాస్త్రవేత్తలు పాల్గొంటారు. ఇందులో భాగంగా ఉదయం రైతు క్షేత్రాల్లో పర్యటించి పంటల స్థితిగతులను పరిశీలిస్తారు. మధ్యాహ్నం ఆర్బీకేలో రైతులతో సమావేశమవుతారు. ఈ కార్యక్రమాలఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరవేయడంతో పాటు వ్యవసాయ. అనుబంధ శాఖల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై అవ గాహన కల్పించడం, సాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారానికి తగిన సూచనలు, సలహాలు అందించడం చేస్తారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
గ్రామం భాగుండాలంటే తినే తిండి బాగుండాలి !!
ప్రజలు కోవిడ్ సమయంలో ఆరోగ్యమే మహాభాగ్యం అని ఇంట్లోనే కూరగాయలను పండించుకొని తినేందుకు ఉత్సాహం చూపించారు. కోవిడ్ తగ్గిన తరువాత అంతా సాదారంగా మారిపోయింది. కేరళలోని మోప్పడం గ్రామానికి చెందిన అరుణ్ అనే రైతు గ్రామస్థుల ఆరోగ్యం గురించి అలోచించి “అందరం కలిసి పండించుకొని కావలసినవి తీసుకుందాం” అని ప్రారంబించారు. దీనికి అందరు సమ్మతించి 20 ఎకరాల్లో కావలసిన అన్ని పంటలకు ప్రణాళిక సిద్దం చేసి శ్రీకారం చుట్టారు. కావలసిన సేంద్రియ ఎరువులను సొంతంగా తయారు చేసుకొని పిల్లలు పెద్దలు స్వచ్చందంగా సహాయపడుతూ ఇతర గ్రామాలకు కుడా పంచుతూ ఆరోగ్యంగా ఉండి ఆదర్శంగా నిలిచారు కదా...! మీ అభిప్రాయం ఏంటి.....
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
రాష్ట్రంలో మొక్క జొన్న సాగు భారీగా పెరగనుంది..... !!
గత ఏడాది మక్కలకు భారీగా డిమాండ్ ఏర్పడింది. పౌల్ట్రీకి దాణాగా వినియోగం, బిస్కెట్లు, పాప్కార్న్లు, ఇతర ఉత్పత్తుల కోసం మొక్కజొన్న అవసరముంది. మరోవైపు ప్రభుత్వం మద్దతు ధరల భరోసా కోసం మార్క్ ఫెడ్ ద్వారా కేంద్రాలు తెరిచింది. జీవ ఇంధనమైన ఇథనాల్ తయారీ కోసం మొక్కజొన్నలను మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడుల నుంచి పరిశ్రమలు కొనుగోలు చేశాయి. దేశంలో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా 2025 నాటికి పెట్రోల్లో 20 శాతం ఇథ నాల్ కలిపి వాహనాలు వినియోగించేందుకు వీలుగా ఉత్పత్తిని నిర్దేశించింది. దీనికి అనుగుణంగా మొక్కజొన్న సాగు పెంపుపై హైదరాబాద్ వేదికగా జాతీయ సదస్సు ఇటీవల నిర్వహించారు. దేశంలో 2025 నాటికి పెట్రో వాహనాలకు ఇథనాల్ అవసరాల దృష్ట్యా మక్కల సాగు పెరగా లని శాస్త్రవేత్తలు పిలుపునిచ్చారు. దీనికి అనుగుణంగా కొత్త రకాల రూప కల్పన జరుగుతోంది. మరోవైపు నీటిలభ్యత కూడా మక్కల సాగు పెరు గుదలకు కారణమని వ్యవసాయశాఖ భావిస్తోంది.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
మార్కెట్లో నానో ట్రాక్టర్ ....!!
వ్యవసాయానికి ఉపయోగపడే ఇనుప నాగళ్లను తయారు చేసే బ్రహ్మచారి ఎడ్ల వాడకం పూర్తిగా తగ్గించారని కోణంలో ఓ మినీ ట్రక్టర్ ను రూపొందించారు. ఈ ట్రాక్టర్ ను నడపడానికి అనుభవం ఉన్న డ్రైవర్ అవసరం లేదు, పెద్ద ట్రాక్టర్ తో కూడా చేయలేని కొన్ని పనులు దీంతో చేయొచ్చని బ్రహ్మచారి నిరూపించారు. ట్రాక్టర్ బరువు 150కిలోలు నాలుగు అడుగుల పొడవు, 30 ఇంచుల వెడల్పు, రెండు అడుగుల ఎత్తు ఇంజిన్ కెపాసిటీ (హెచ్ పీ(హార్స్ పవర్), దీజిల్, పెట్రోల్తో నడుస్తుంది. ఈ ట్రాక్టర్ ఖర్చు లక్షా 40వేల రూపాయలు ఈ ట్రాక్టర్ నడవాలంటే గంటకు ఒక లీటర్ డీజిల్ అవసరం పడుతుంది. ఈ ట్రాక్టర్ వేగం గంటకు 10 నుండి 16 కిలోమీటర్ల స్పీడు. . దీనికి ఐదు గేర్లు ఉంటాయి. అంతర పంటల సాగుకు ఈ మినీ ట్రాక్టర్ ఎంతో ఉపయోగపడుతుంది.