NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
రైతులకు అందుబాటులో యూరియా నిల్వలు !!
రాష్ట్రంలో 2.18 లక్షల టన్నుల యూరియా అందుబాటులో ఉందని, రైతులు అధిక ధరలు చెల్లించి వ్యాపారుల వద్ద కొనుగోలు చేయవద్దని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. ప్రైవేటు డీలర్ల వద్ద 90 వేల టన్నులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద 41 వేల టన్నులు, మార్క్ ఫెడ్ వద్ద 81 వేల టన్నులు, కంపెనీ గోదాముల్లో 6 వేలటన్నుల వరకు నిల్వలు ఉన్నాయన్నారు. అలాగే రాబోయే నాలుగు రోజులలో మరో 18వేల టన్నుల యూరియా అందుబాటులోకి వస్తుందని వ్యవసాయశాఖ మంత్రి వివరించారు. ఎవరైనా కృత్రిమ కొరత సృష్టిస్తే ప్రభుత్వం తీవ్రమైన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
కోరాపుట్ కలజీర బియ్యానికి GI గుర్తింపు !!
సువాసన మరియు పోషక విలువలకు ప్రసిద్ది చెందిన ఒడిశా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లాలోని పత్రపుట్, పూజారిపుట్ మరియు మొహులి ప్రాంతల్లో సాగుచేసే ‘కోరాపుట్ కళజిర రైస్’ కి ఇటివల GI గుర్తింపు లభించింది. ఈ బియ్యంలోని ఔషద నాణ్యత జ్జాపకశక్తిని పెంపొందిస్తుందని, అలాగే మధుమేహాన్ని తగ్గిస్తుందని, హిమోగ్లోబిన్ స్థాయిలను మరియు శరీరం యొక్క జీవక్రియను పెంచుతుంది. ఈ బియ్యం గింజలు నల్ల జిలకర గింజలవలే కనిపిస్తాయి.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
వర్షాలకు పత్తిలో చేపట్టాల్సిన చర్యలు !!
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సాగు అయ్యే పత్తి వర్షాభావ పరిస్థితుల వలన పంట బెట్టకు వచ్చింది. పత్తి పంట ప్రస్తుతం పూత దశ నుంచి కాయ పక్వానికి వచ్చే దశలో ఉంది. 1. బెట్ట పరిస్థితుల నుంచి పంటను కాపాడుకోవడానికి చేపట్టాల్సిన చర్యలు 10 గ్రాముల పొటాషియం నైట్రేట్ (13.0.45) లేదా 20 గ్రాముల యూరియాను లీటరు నీటిలో కలుపుకొని - వారం వ్యవధిలో రెండుసార్లు పంటపై పైపాటుగా పిచికారీ చేసుకోవాలి. 2. తెగులు (ఆకులు) ఎర్రబడటం కనిపిస్తే 10 గ్రాముల పొటాషియం నైట్రేట్ (13, 0, 45) తోపాటు 10 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ను లీటరు నీటిలో కలిపి వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. మొదటి పిచికారీ చేసిన నాలుగు రోజుల తర్వాత ఐదు గ్రాముల సూక్ష్మపోషకాల మిశ్రమం (ఫార్ములా 4) ను లీటరు నీటికి కలుపుకొని పైపాటుగా పిచికారి చేసుకోవాలి. 3. బెట్టితో పూత ఎండిపోయి రాలినట్లు గమనిస్తే లీటరు నీటికి 1.5 గ్రాముల బోరాక్స్ ను కలుపుకొని వారం వ్యవధిలో పైపాటుగా రెండుసార్లు పిచికారీ చేసుకోవాలి. ఇది కాయ వృద్ధికి తోడ్పడుతుంది.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
మట్టి అరటికి జియో ట్యాగ్ !!
కన్యాకుమారి జిల్లాకు చెందిన మట్టి అరటి రకానికి ఇటీవల భైగోళిక సూచిక ట్యాగ్ లభించింది. మట్టి అరటిలో ఆరు రకాలుగా ఉన్నాయని ఇవి కన్యాకుమారికి చెందినవని వీటిని బేబి అరటి అని కూడా పిలుస్తారు ముఖ్యంగా కల్కులం మరియు విలవం కోడ్ తాలూకాలో ఇవి ఎక్కువగా పెరుగుతాయి. దీనిని శిశువు ఆహారంగా పిలుస్తారు. ఇందులో తక్కువ మొత్తంలో కలిగే ఘన పదార్థాల కంటెంట్ (TSSC) ఉంటుంది. ఈజిఐ ట్యాగ్ 10 సంవత్సరాల వరకు చెల్లుబాటులో ఉంటుంది.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
రాబోయే రోజుల్లో ఉభయ తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు!!
ప్రస్తుతం దక్షిణ మధ్య అరేబియా సముద్రంలో ఒక బలమైన అల్పపీడనం ఏర్పడింది. ఇది అరేబియాలోని తేమను కర్ణాటక, కేరళ మీదుగా మన వైపుగా నెడుతుండం వలన, అదే సమయంలో పశ్చిమ వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఒక ఆవర్తనం ఏర్పడింది. ఈ ఆవర్తనం ఈ నెల 4/5 తారీఖు కల్లా బలమైన అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఈ రెండిటి వలన ఉభయ తెలుగు రాష్ట్రాల రేపటి నుంచి అంటే సెప్టెంబర్ 2,3,4,5,6,7,8,9 తారీఖులలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. కొన్ని చోట్ల అతి భారీ వర్షాల కు అవకాశం వుంది.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
నేల సాగు కన్నా బ్యాగు సేద్యం మిన్న!
సేంద్రియ కూరగాయ పంటలను పొలంలో సాధారణ పద్ధతి లో నేల లో కన్నా బ్యాగు ల్లో సాగు చేయటం ద్వారా ఎక్కువగా దిగుబడి తీయవచ్చని కృషి విజ్ఞాన కేంద్రం లో ప్రయోగాత్మక సాగు లో రుజువైంది.పట్టణాలకు దగ్గరల్లోని భూముల్లో భూసారం అంతగా లేకపోవడం, చౌడు సమస్యాత్మక భూముల్లో బ్యాగు సేద్యం ద్వారా కూరగాయల ఉత్పత్తి పొందడానికి తద్వారా అన్సీజన్ లో రైతులు అధికాదాయం పొందడానికి అవకాశం ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అడుగున్నర ఎత్తు, అడుగు వెడల్పు ఉండే పాలిథిన్ బ్యాగు లో 15కిలోల పశువుల ఎరువు,15కిలోల ఎర్రమట్టి,100గ్రా వేపపిండి కలిపిన మిశ్రమాన్ని నింపారు. ప్రతి 15రోజులకోసారి జీవామృతం పోయాలి. పంచగవ్య, రాజ్మాగింజల ద్రావణం, కొబ్బరినీరు నాలుగైదు సార్లు పిచికారీ చేయాలి.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
ఉపాధితో ‘ఉద్యానా’నికి ఊతం
చిన్న, సన్నకారు రైతులను లాభాల బాటలో నడిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన పంటల దిశగా వారిని ప్రోత్సహిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది 50 వేల ఎకరాల్లో పండ్ల తోటలు సాగు చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకుని జూలైమాసంలో ఉపాధి హామి ఫథకం ద్వారా దరఖాస్తులు కొరింది. ఇందులో భాగంగా 33,6998 ఎకరాల్లో పండ్ల తోటలు వేసేందుకు 18640 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. అత్యధికంగా నల్గొండ జిల్లా నుండి 2978 మంది రైతులు ధరఖాస్తు చేసుకున్నారు. అలాగే ఆదిలాబాద్ జిల్లాలో 1005 ఎకరాలు లక్ష్యంగా పెట్టుకుంటే 1472 (147%) ఎకరాల్లో సాగుచేసేందుకు ముందుకు వచ్చారు. ముఖ్యంగా మామిడి, జామ, నిమ్మ, కొబ్బరి, డ్రాగన్ ప్రూట్ వంటి పంటలు పెంచేందుకు ఆసక్తీ కనబర్చారు. ఈ పథకానికి ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం, చిన్న,సన్నకారు రైతులకు 90 శాతం సబ్సీడితో అందించనున్నారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
డ్రాగన్ ఫ్రూట్- తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం !!
డ్రాగన్ ఫ్రూట్ పంటపై ఈమధ్య చాలా మంది రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇందుకు ఈ డ్రాగన్ ఫ్రూట్ పంటకు మార్కెట్లో అధిక డిమాండ్ ఉండటమే కాక అధిక హెల్త్ బెనిఫిట్స్ ఉండటం వల్ల ఈ డ్రాగన్ ఫ్రూట్స్ ను ప్రజలు తినడానికి ఇష్టపడుతున్నారు. తినేవారితో పాటు పండించే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇక ఈ పంటను పండించడానికి ఎక్కువ నీరు అవసరం లేదు. పంట నిర్వహణ- ఫ్రూట్ ప్యాకింగ్, మార్కెటింగ్, ఎగుమతి కూడా చాలా సులభం. ఇలా సాగు ఖర్చు తక్కువ ఉండడంతో చాలా మంది రైతులు పండించడానికి ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
విద్యుత్ ట్రాక్టర్ @ ఒకసారి ఛార్జ్ చేస్తే 4 గంటలు
సాగురంగంలో ఖర్చులు రోజురోజుకు పెరగటం, కూలీల లేమి సమస్యలతో రైతులు అవస్థలు పడుతున్నారు. అయితే పెద్దపల్లి జిల్లాకు చెందినా శసిరథ్ రెడ్డి డిజిల్ తో పనిచేసే ట్రాక్టర్ కి బదులు విద్యుత్ తో పనిచేసేలా పరిశోధనలు మొదలుపెట్టి నాలుగైదు లక్షల ఖర్చుతో 26 హెచ్ పి మోటారును బిగించి ట్రాక్టర్ ను తయారుచేశాడు. అయితే ఇందులో 32 లిథియం ఫాస్పేట్ బ్యాటరీలను అమర్చి, స్మార్ట్ కంట్రోలర్ ని బిగించాడు . ఈ బ్యాటరి పుల్ చార్జీ చేస్తే దాదాపు 4 గంటల పాటు పనిచేస్తుందని,డిజిల్ తో పోలిస్తే 10 రేట్లు ఖర్చును ఆధాన చేస్తుందంటున్నారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
🌱🌾 అన్నదాతలను కలవరపెడుతున్న తెగుళ్ళు !!
మునుపెన్నడూ లేనివిధంగా ఈ సారి తెగుళ్లు వ్యాపించాయి అనుకూలంగా లేని వర్షాల వల్ల ఇప్పటికే పెట్టుబడులు రెట్టింపు కాగా పురుగుల మందుకోసం ఖర్చు భారీగా పెరుగుతుంది.జూన్ లో వర్షభావం వలన సాగు ఆలస్యం కాగా ఆగస్టు లో మళ్ళీ వర్షాలు తగ్గాయి. ఈ మార్పుల తో పంటలకు చీడపీడలు పెరుగుతున్నాయి. *వరి లో కాండం తోలుచు పురుగు వ్యాపిస్తున్నట్లు వ్యవసాయ శాఖ వారు పేర్కొన్నారు ఇలా కొనసాగితే సరైన పోషకాలు అందక తెల్లకంకిగా మారి తాలు గింజలు ఏర్పడతాయి అన్నారు. *ప్రత్తి లో లేత కొమ్మల భాగల నుంచి రసాన్ని పీల్చు తున్నాయి మరియు కాండం పై బూజు ఏర్పడుతుంది. *మొక్కజొన్నకు కత్తెరపురుగు ఆకుల చివరి నుంచి కత్తిరిస్తూ తింటూ ఉంటుంది. *కంది పంటకు ఎండు తెగులు వ్యాపించి పూత రావడం లేదు. *మిర్చి లో లేత మొలకలు ఎండిపోగా ఇతర మొక్కలకు మొదళ్ల లో మచ్చలు ఏర్పడి వేర్లు కుళ్లిపోతున్నాయి.