NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
సాగుభూములకే రైతు భరోసా అందాలి !!
గుట్టలు, రహదారులు, పడవ భూములు ఇతర పంటలు సాగు చేయని భూములకు ఇకనుండి రైతుబందు కట్టు. రాష్ట్రంలో 69 లక్షల మంది రైతులు ఉంటే కోటి 52 లక్షల ఎకరాలకు రైతుబందు పడుతుంది. నిజమైన సాగుదారుల కన్నా వ్యవసాయ వేత్తలకు, వ్యాపారులకు, ఎక్కువ ఎకరాలు ఉన్న వారికి వెల్తుంది. ఇక నుండి అలా జరగకుండా వాస్తవంగా సాగు చేసే రైతుకే రైతుబందు అందాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే రైతుబందు ఐదు ఎకరాలకే పరిమితం చేస్తారా లేకా పది ఎకరాల లోపు వారికి అమలు చేస్తారా అనేది త్వరలో తెలియనుంది.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
ఆగస్టు 15లోగా రుణమాఫీ చేయాల్సిందే......
రైతు రుణమాఫీ అమలు చేసేందుకు బ్యాంకుల నుంచే కాకుండా, పీఏసీఎస్ నుంచి పంట రుణాలు తీసుకున్న రైతుల వివరాల ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. రూ.2లక్షల రైతు రుణమాఫీ చేసేందుకు పూర్తి స్థాయి వివరాలతో పాటు అవసరమైన అంచనా వ్యయాన్ని రూపొందించాలని అధికారులకు సూచించారు. కటాఫ్ డేట్ విషయంలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
పత్తి విత్తనాలను విత్తుకోవడానికి సరైన సమయం ?
తొందరపడి ముందుగానే వేసుకుంటే పత్తి తీసే సమయానికి భారీ వర్షాల వలన నష్టం జరుగుతుంది.ఆలస్యంగా నాటుకుంటే పత్తిలో గులాభి రంగు పురుగుల సమస్య పెరిగి దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుంది. కావున సరైన సమయానికి విత్తుకోవడం చాలా ముఖ్యం. వానలు పడుతున్నాయని తొందరపడి విత్తుకోకుండా ఒక పెద్ద వాన (60 mm నుండి 70 mm వర్షపాతం) నమోదైన తరువాత విత్తుకోవడం వలన మొలకశాతం పెరిగి మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి. దీనికి అనువైన సమయం జూన్ 15 నుండి జూలై 15 వరకు అని వ్యవసాయ శాస్రవేత్తలు తెలిపారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
తెలంగాణ ప్రజాలకు వాతావరణ హెచ్చరిక !!!
తెలంగాణలో పలు జిల్లాలకు మూడు రోజుల పాటు మోస్తారు నుండి భారీ వర్ష సూచన ఉందని, గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.నిన్న ఉత్తర అరేబియా సముద్రం, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలతో పాటు తెలంగాణాలోని నిజామాబాద్ లోకి ఋతుపవనాలు ప్రవేశించినట్లు రానున్న రోజుల్లో వివిధ జిల్లాల్లో ఋతుపవనాల ప్రభావంతో వర్షాలు పాడనున్నాయని వాతావరణ అధికారులు తెలిపారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
వర్షాలు వచ్చేసాయి......!!
నైరుతీ రుతుపవనాలు కేరళ అంతా విస్తరించాయి రానున్న రెండు రోజుల్లో మిగతా దక్షిణ భారతదేశం అంతా విస్తరించనున్నాయి. కావున తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని IMD తెలిపింది. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో మధ్యాహ్నం నుంచి మేఘాలు బాగా విస్తరిస్తాయని , ఉదయం 9 తర్వాత ఉత్తరాంధ్రకు వర్ష సూచన ఉందని IMD తెలిపింది. మధ్యాహ్నం 1 గంట నుంచి కోస్తాంధ్ర, తూర్పు రాయలసీమలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే నల్గొండ, వరంగల్, మహబూబ్నగర్ జిల్లాల్లో కూడా మోస్తరు వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. .(Image credit - IMD)
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
విత్తనాలు కొనేముందు రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు !!
• విత్తనాలను లైసన్స్ ఉన్న డీలర్ల దగ్గర మాత్రమె కొనుగోలు చేయాలి. • మీరు కొనుగోలు చేసే విత్తనాల రశీదును తీసుకోవడం మర్చిపోకండి. • విత్తన ప్యాకేజ్ పైన విత్తనం తయారైన మరియు ముగిసే కాలం తేదిలను చూసుకోవాలి. • తీసుకున్న బిల్లు మీద విత్తన రకం, విత్తన కంపని పేరు, లాబ్ నంబర్,బ్యాచ్ నంబర్, రేటును గమనించాలి. • పంట కాలం ముగిసే వరకు బిల్ ను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. • తొందరపడి తక్కువ ధరకు మరియు లూస్ విత్తనాలను లైసన్స్ లేని డీలర్ల వద్ద కొని మోసపోకండి. వ్యవసాయ అధికారులు జారి చేయబడినది.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
ఈ వానాకాలం 2024 కి పత్తి విత్తనాలు కొనేముందు తెలుసుకోవాల్సిన విషయాలు
• బోల్ గార్డ్ II ప్యాకెట్ 864 /- రూపాయలు మాత్రమే. • మీరు కొనే విత్తనాలకి సంబంధించి బిల్ ( రశీదు ) తీసుకోవాలి. • లైసెన్స్ కలిగిన విత్తన డీలర్ దగ్గర మాత్రమే తీసుకోవాలి. • పత్తి దిగుబడి వచ్చేవరకు బిల్ రైతు దగ్గరనే భద్రపరుచుకోవాలి. • తీసుకున్న రశీదు మీద విత్తన కంపెనీ పేరు, విత్తన రకం, బ్యాచ్ నెంబర్ , లాట్ నెంబర్, రేటు ఉండాలి. • విత్తన ప్యాకెట్ మీద తయారైన తేదీ, కాలం ముగిసిన తేదీ చూసుకోవాలి ప్రతి విత్తన ప్యాకెట్ మీద GEAC నెంబర్ ఉందా లేదా చూసుకోవలెను. • మీ గ్రామాలలో తక్కువ ధరకు, ఎక్కువ ధరకు అమ్మే వారి వివరాలు మీ మండల వ్యవసాయ అధికారికి చెప్పండి. • పక్క జిల్లా నుండి పక్క రాష్ట్రాల నుండి తీసుకొచ్చి ఎవరైనా నకిలీ విత్తనలు, లూస్ విత్తనాలు అమ్మినచో వ్యవసాయ అధికారులను సంప్రదించండి. • దయచేసి తొందరపడి లైసెన్స్ లేని వారి దగ్గర విత్తనాలు తీసుకొని ఇబ్బంది పడకూడదు విత్తనాల కొనుగోలులో అప్రమత్తంగా ఉండాలి. వ్యవసాయ అధికారులు జారి చేయబడినది.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
రాష్ట్ర వ్యాప్తంగా మే 24న విత్తన మేళా !!
నాణ్యమైన విత్తనాలను రైతులకు అందించాలనే ఉద్దేశంతో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం మే 24న రాష్ట్రవ్యాప్తంగా విత్తన మేళా నిర్వహించనున్నారు. అదే రోజున విశ్వవిద్యాలయ పరిధిలోని జగిత్యాల, పాలెం, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానాల్లో, అన్ని కృషి విజ్ఞాన కేంద్రాల్లో విత్తన మేళాలు నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఈ మేళాల్లో 16 పంటల్లో 67 రకాలకు చెందిన దాదాపు 12 వేల క్వింటాళ్ల విత్తనాలను రైతులకు అమ్మకానికి అందుబాటులో ఉంచనున్నట్టు పేర్కొన్నారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
వ్యవసాయ సర్టిఫికెట్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం....
ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జులైలో నిర్వహించనున్న వ్యవసాయ సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్ తెలిపారు. మిద్దె తోటలు, పట్టుపురుగుల పెంపకం, జీవ ఎరువుల తయారీ కోర్సుల ప్రవేశాలకు జూన్ 20 లోపు రూ.1500 చొప్పున ఫీజు చెల్లించి పేర్లు నమోదు చేసు కోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు విశ్వవిద్యా లయం వెబ్సైట్ www.angrau.ac.in ని సందర్శిం చాలని పేర్కొన్నారు..
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
ఈ నెల 31న కేరళకు నైరుతి ఋతుపవనాలు !!
బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో ఈ నెల 22వ తేదీ వరకు అల్పపీడనం ఏర్పడి అది 24 నాటికి వాయుగుండంగా మారనున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. నైరుతి ఋతుపవనాలు ఆదివారం దక్షిణ బంగాళాఖాతం మీదుగా అండమాన్ నికోబార్ దీవులను తాకాయని, చురుగ్గా కదులుతున్నట్లు హైదరాబాద్ ఐంఎండీ తెలిపింది. ఈ నెల 31న కేరళను తాకుతాయని, తర్వాత దేశవ్యాప్తంగా విస్తరిస్తా యని అంచనా వేసింది. ఈ సీజన్లో సాధారణం కంటే ఎక్కువగానే వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.









