NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
చిరుధాన్యాలు మరియు ప్రకృతి వ్యవసాయంపై ఒకరోజు సదస్సు !!
రైతుకోసం తానా మరియు రైతునేస్తం ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో 2023 డిసెంబర్ 31వ తేదీ (ఆదివారం) ఉ. 10:00 గంటల నుండి సా. 4:00 గం.ల వరకు రైతునేస్తం ఫౌండేషన్ ఆవరణ, కొర్నెపాడు, పుల్లడిగుంట దగ్గర, గుంటూరు నందు చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం, చిరుధాన్యాల సాగు, ఔషధ మొక్కల సాగు, ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడును. ఆధునిక ఆహారపు అలవాట్లు అనేక అనారోగ్య సమస్యలకు, వ్యాధులకు కారణమౌతున్నందున ఈ సమస్యకు పరిష్కారంగా సేంద్రియ వ్యవసాయ విధానంలో పండించిన చిరుధాన్యాలైన కొర్రలు, సామలు, ఊదలు, అరికలు, అండుకొర్రలు వంటి దేశీయ ఆహారమైన చిరుధాన్యాల వాడకంతో ఆధునిక రోగాల నియంత్రణ మరియు నిర్మూలనపై పద్మశ్రీ పురస్కార గ్రహీత, కృషిరత్న, స్వతంత్ర శాస్త్రవేత్త, ఆహార ఆరోగ్య నిపుణులు డా. ఖాదర్ వలి గారు అవగాహన కల్పిస్తారు. అలాగే చిరుధాన్యాల సాగు, ప్రకృతి వ్యవసాయంపై కూడా అవగాహన కల్పించబడును. ఔషధ మొక్కల సాగు, వాడకంపై రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి, చత్తీస్ఘడ్ రాష్ట్రంలోని రాయపూర్లోగల మెడిసినల్ ప్లాంట్స్ బోర్డ్ CEO శ్రీ జె.ఎ. చంద్రశేఖర రావు పాల్గొని అవగాహన కల్పిస్తారు. ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొనేందుకు అందరూ ఆహ్వానితులే. ప్రవేశం ఉచితం. యంత్రపరికరాల ప్రదర్శనతోపాటు దేశీయ విత్తనాల స్టాల్స్ ఏర్పాటు చేయబడును. ఒక్కో రైతుకు ఒక కిలో కొర్ర విత్తనాలు ఉచితంగా అందజేయబడును. ఔషధ మొక్కలు ఉచితంగా పంపిణీ చేయబడును. మధ్యాహ్నం millets ఉచిత భోజనం కలదు. మరిన్ని వివరాలకు 97053 83666; 70939 73999 ఫోన్ నెంబర్లలో సంప్రదించగలరు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
భారత దేశంలో నిషేదించబడిన సస్యరక్షణ మందులు !!
పంటల దిగుబడులను పెంచడానికి పంటలకు ఆశించే చీడపీడల నుంచి రక్షించడం తప్పనిసరి. అనేక పంటలలో సుమారుగా 15–20% వరకు పంట నష్టం కేవలం చీడపీడల వలన కలుగుతుంది. రైతులు చీడపీడల నుండి పంటలను కాపాడుకోవడానికి ఎక్కువగా సస్యరక్షణ రసాయన మందులను వాడుతున్నారు. సుమారుగా 60-65% కీటకనాశినుల వాడకంగా నమోదు చేయబడినది. అయితే, మానవాళి మరియు జీవరాశులకు హాని కలిగించే అత్యంత ప్రమాదకరమైన నాలుగు సస్యరక్షణ మందుల వాడకంపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడం జరిగింది. కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ నెం. యస్.ఓ. 4294(ఇ) ప్రకారం 4 మందుల వాడకం విషేదించడమైనది. 1.డైకోఫాల్, 2.డైనోకాప్, 3.మిథోమిల్, 4.మోనోక్రోటోఫాస్ మందుల వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తూ అక్టోబర్ 6, 2023 పురుగుమందుల (నిషేధం) ఆర్డర్ను కేంద్ర ప్రభుత్వం ప్రచురించడం జరిగింది. మోనోక్రోటోఫాస్ 36% ఎస్ ఎల్ మందును ప్రస్తుతం ఉన్న స్టాక్ క్లియర్ చేసుకొనేందుకు నిల్వల గడువు కాలం ముగిసే వరకు మాత్రమే అమ్మకాలు పంపిణీ, వినియోగానికి అనుమతి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
స్కూల్ లో పండించిన కూరగాయలతో మద్యాహ్న భోజనం
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం ఖోడద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయుల బృందం కలిసి సాగుబడి గా మార్చారు. ఓ వైపు పాఠాలు బోధిస్తూనే.. మరోవైపు కూరగాయల సాగుపై దృష్టి పెట్టారు. ఇక్కడ 19 రకాల కూరగాయలను ఎలాంటి క్రిమిసంహారక మందులు ఉపయోగించకుండా సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. గ్రామంలో తడి, పొడి చెత్తను సేకరించి తయారు చేసిన వర్మి కంపోస్టును సాగుకు వినియోగిస్తున్నారు. దీనితో విద్యార్దులకు వ్యవసాయంపై అవగాహాన కల్పిస్తున్నారు. పండిన తాజా ఆకు కూరలు, కూరగాయలను మధ్యాహ్న భోజనానికి వాడుతున్నారు. విద్యార్థులకు రోజుకో రకమైన వంటకాన్ని అందిస్తున్నారు. కొద్దిపాటి పెట్టుబడితో పిల్లలకు పౌష్టికాహారం అందిస్తుండగా, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
నేటి నుండి రైతు బందు నిధులు విడుదల
రైతుల ఖాతాల్లో నేటి నుండి రైతు బంధు డబ్బులు జమ కాబోతున్నాయి. ఎన్నికలకు ముందు నిలిచిపోయిన రైతు బంధు నిధులను వెంటనే విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలోని రైతులందరికీ రైతు బంధు నిధులను వారి ఖాతాల్లో జమచేసే ప్రక్రియను నేటి నుంచి ప్రారంభించాలన్నారు. ప్రస్తుతం ఎకరానికి 5000/- ఇవ్వనున్నారు. అదేవిధంగా రుణ మాఫీపై కార్యాచరణ రూపొందించాలన్నారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని రైతులకు రూ.2 లక్షల మేరకు రుణ మాఫీ చేసేందుకై కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఉన్నతాధికారులకు సూచించారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
🚨తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ అలర్ట్ !!
తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ అలర్ట్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో వర్షాల ముప్పు పొంచి ఉంది. ఈ తుఫాన్ ప్రభావంతో తెలంగాణ ఈశాన్య జిల్లాల్లోని అనేక ప్రాంతాలకు ఇప్పటికే రెడ్, ఆరెంజ్ ఎల్లో అలర్ట్లు జారీ అయ్యాయి. ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, ములుగు రెడ్. మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట,హనుమకొండ, వరంగల్కు ఆరెంజ్ మరియు జనగామ, భూపాలపల్లి, భువనగిరి, పెద్దపల్లి జిల్లాల్లో వివిధ ప్రాంతాల్లో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
తుఫాన్ అలెర్ట్ ! వాతావరణ హెచ్చరిక !!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి శక్తివంతమైన తుఫాన్గా మారే ప్రమాదం ఉంది. పసిఫిక్ సముద్రం మీదుగా వచ్చే తూర్పుగాలుల ప్రభావంతో తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మంచి వర్షపాతం నమోదవుతోంది. రానున్న రోజుల్లో సముద్రతీరంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో దీని ప్రభావం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కావున ఈ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులు వెంటనే ఒడ్డుకు చేరుకోవాలని, వరి కోతలు ముమ్మరంగా జరుగుతున్నందున కోతలలో కొనుగోళ్ల సమయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. త్వరగా కోతకు వచ్చే శనగ, మినుము, మొక్క జొన్న పంటలను త్వరగా కోతలు ముగించుకొగలరు. వచ్చే 3, 4 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు కురిసే ఈ వర్షాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
పరిమళ పంటతో – సిరుల వర్షం !!
రైతులు ఒకే రకం పంటలకన్న వినూత్నంగా డిమాండ్ ఉన్న పంటలవైపు మక్కువ చూపితే లాభాలు సాదించవచ్చు. అలాంటి పంటే - జెరీనియం ఇది ఒక సుగంధ మొక్క, ఈ చెట్టు నుంచి నూనెను ఉత్పత్తి చేస్తారు. దీన్ని మెడిసిన్, కాస్మోటిక్స్, ఫార్మాసూటికల్ రంగాల్లో సువాసనగల సబ్బులలో ఉపయోగిస్తారు. మార్కెట్లో జెరేనియం ఆయిల్ ధర లీటరుకు రూ. 10 వేల నుంచి రూ. 16 వేల వరకు పలుకుతోంది. పంట వేసిన నాలుగు నెలల నుంచి దిగుబడి వస్తుంది. ఎకరానికి 10-12 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కోతకోతకు దిగుబడి పెరిగే ప్రత్యేకత మరియు తెలుగు రాష్ట్రాలలో పంట సాగుకు అనుకూలం. చీడపిడల బెడద కుడా తక్కువే, సేంద్రియ ఎరువులతో సాగుచేసి సిరులను పండించవచ్చు. మొక్కల కొరకు కేంద్ర ప్రభుత్వ సంస్థలో CSIR-CIMAP ఆరోమా మిషన్లో భాగంగా ఈ మొక్కలను అందిస్తారు. రైతులకు ప్రోత్సాహంగా సాగు మరియు కోతవాటి కొరకు నర్సరీ తయారు చేయాడం శిక్షణ ఇస్తారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
రైతుల ఖాతాల్లోకి - 2023 రబీకి రైతు బంధు !!
తెలంగాణ ప్రభుత్వం ద్వారా 2023 రబీకి రైతు బంధు సహాయాన్ని పంపిణీ చేయడం ప్రారంభిస్తున్నట్లు తెలియజేస్తుంది. అక్టోబర్ 5, 2018 నాటి ECT దిశలో నిర్దేశించిన షరతులకు అనుగుణంగా 24 నవంబర్, 2023 నుండి తెలంగాణ రైతు బంధు సహాయాన్ని పంపిణీ చేయడానికి కమిషన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
సులభతరంగా RAWE ప్రోగ్రాం చేస్తున్న విద్యార్దులు !!
అగ్రికల్చర్ BSc చదివే విద్యార్థులకు RAWE ప్రోగ్రాం అత్యంత ముఖ్యమైనది. విద్యార్దులు ఈ ప్రోగ్రాం లో అనేక సవాళ్లు మరియు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే నాపంట స్మార్ట్ కిసాన్ అగ్రీ యాప్ ఈ RAWE ప్రోగ్రాంని సులభతరం చేసింది. మల్లారెడ్డి విశ్వవిద్యాలయం అగ్రికల్చర్ BSc చదివే 400 పైగా విద్యార్థులు నాపంట సహకారంతో గడ్డిపల్లి, రామగిరిఖిల్లా, మమ్నూర్, యాగంటిపల్లె, తునికి, జమ్మికుంట, వనపర్తి కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా చుట్టుపక్కల గ్రామాలలో వివిధ వ్యవసాయ పనులను దగ్గరుండి నేర్చుకుంటూ రైతులకు సలహాలు, సూచనలు, నూతన సాగు విధానాలను వివిధ ప్రదర్శనల ద్వారా తెలియజేస్తున్నారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
సి.సి.ఐ. ద్వారా పత్తి అమ్ముటకు ఆధార్ అనుసందానం తప్పనిసరి!!
సి.సి.ఐ. (C.C.I.) ద్వారా పత్తి అమ్ముటకు ఆధార్ అనుసందానం , OTP తప్పనిసరి చేసింది. కావునా పత్తి రైతులు మీ ఆదార్ తో అనుసందానం అయిన బ్యాంక్ ను ఈ కింది వెబ్ సైట్ లో లింక్ ద్వారా చెక్ చేసుకుని బ్యాంక్ యాక్టివ్ గా ఉన్నదా, లేదా చెక్ చేసుకోవచ్చు. తద్వారా మీ బ్యాంక్ ఖాతా Inactive గా ఉంటే Active చేసుకోవాలి లేదా మీ పేరు మీద వాడుకలో ఉన్న ఇతర బ్యాంక్ ఖాతాను ఆదార్ తో అనుసందానం చేసుకోవడం వలన C.C.I. వారు పత్తి కొనుగోలు చెల్లింపులు ఆ బ్యాంకు ఖాతాకు చెల్లిస్తారు. ఈ క్రింది లింక్ ద్వారా ఆధార్ అనుసందానం అయిన బ్యాంక్ వివరాలు తెలుసుకోండి (https://dbtbharat.gov.in/) లేదా (https://myaadhaar.uidai.gov.in/)