NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
రైతులకు గుడ్ న్యూస్ !!
ఇటివల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రైతులకు పెట్టుబడి రాయితీ కింద రూ. 36 కోట్ల నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో విత్తన, పురుగు మందుల పిచికారీకి డ్రోన్ల వినియోగం పెంచాలని సూచించారు. ఉద్యాన పంటల సాగు, ఉత్పత్తిలో ఏపి అగ్రస్థానంలో ఉండేలా కార్యాచరణ సిద్ధం చేయాలని సాగులో కొరత లేకుంగా చూడాలని, , 2014-19 మధ్య కాలంలో ఈ రంగానికి ఉన్న పథకాలన్నీ మళ్లీ అమల్లోకి తీసుకురావాలని అధికారులకు ప్రత్యేక వ్యవసాయ పథకాలపై సమాచారం ఇచ్చారు
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
రైతుబడి మెగా అగ్రి షో !!
నల్గొండలోని నాగార్జున గవర్నమెంట్ కాలేజిలో ఆగస్టు 17, 18 తేదిల్లో రైతుబడి మెగా అగ్రి షో తెలుగు రైతుబడి రాజేందర్ రెడ్డి ఆద్వర్యంలో జరగబోతుంది. ఇందులో భాగంగా 150 పైగా దేశవిదేశాల నుండి వివిధ కంపనిలతో పాటు రైతులు తయారు చేసినటువంటి అనేక వినూత్న పరికరాలు ప్రదర్శిస్తున్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలైనటువంటి డైరీ, పౌల్ట్రీ, సెరికల్చర్, హార్టికల్చర్ మరియు వ్యవసాయ యంత్రాలు ఇలా అనేక కొత్త వ్యవసాయ సమాచారాలను తెలుసుకోవచ్చు. రైతులందరూ పాల్గొని ఈ అవకాశాన్ని ఉపయోగించుచుకోగలరు. పూర్తి వివరాల కొరకు https://rbagrishow.com/
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
శ్రీశైలం మూడు గేట్లు ఎత్తివేత !!
భారీ వర్షాలకు కృష్ణానదికి వరద పోటెత్తుతున్నది. భారీ వరదలకు ఇప్పటికే ఆలమట్టి, జూరాల డ్యామ్లు నిండుకున్నాయి. దీంతో శ్రీశైలానికి వరద నీరుపోటెత్తింది. ఈ క్రమంలో శ్రీశైలం జలాశయం అధికారులు సోమవారం మధ్యాహ్నం ప్రాజెక్టు మూడుగేట్లను ఎత్తివేశారు. ప్రాజెక్టుకు సంబంధించిన 6, 7, 8 గేట్లను పది అడుగుల మేర ఎత్తగా.. 81వేల క్యూసెక్కుల వరద స్పిల్వే మీదుగా నాగార్జున సాగర్ వైపు పరుగులు తీస్తున్నది. ప్రస్తుతం ఒక్కో గేట్ నుంచి 27వేల క్యూసెక్కుల నీరు దిగుకు వెళ్తున్నది.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
రేపు రెండో విడత రుణమాఫీ ప్రారంభం!!
తొలి విడుత రుణమాఫీలో లక్షలోపు ఉన్న రుణాలను మాఫీ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ లక్ష లోపు రుణాలు ఉన్న చాలా మంది రైతులకు మాఫీ కాలేదు. ఈ నెల 30న రెండో విడుత రుణమాఫీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో అసెంబ్లీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. రెండో విడతలో భాగంగా రూ. లక్ష నుంచి రూ. 1.50 లక్షల వరకు రైతుల రుణాలు మాఫీ కానున్నాయి.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి ఎన్ని కోట్లు !!
మొత్తం బడ్జెట్ వాల్యూ 2,91,159 లక్షల కోట్లు కాగా అందులో వ్యవసాయ రంగానికి అత్యధికంగా ప్రభుత్వం 72,659 కోట్ల రూపాయలు రైతాంగానికి కేటాయించింది. గతేడాదితో పోలిస్తే ఇది రూ.22,572 కోట్లు ఎక్కువ. రుణమాఫీ, రైతుభరోసా, పంటల బీమా పథకాలకు ఈ నిధులను వినియోగించనుంది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యాన పంటలు, ఆధునిక వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ ఏడాది నుంచి కొత్తగా భూమిలేని రైతు కూలీలకు కూడా ఏటా రూ.12 వేల సాయం అందించనున్నట్లు బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించింది.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
రైతు భీమా దరఖాస్తు !!
రైతులకు జూన్ 28 వరకు కొత్తగా పట్టా బుక్ వచ్చిన వారికి మరియు ఇంత వరకు కూడా రైతు భీమా నమోదు చేసుకొని వారు రైతు భీమా నమోదు చేసుకోవాడానికి చివరి తేది - ఆగస్టు 4 గతంలో భీమా చేసుకున్నా రైతులు భీమాలో మార్పులు చేర్పులు లేదా నామిని మార్పు కోసం చివరి తేది - జూలై 30 కావలసిన పత్రాలు : 1 దరఖాస్తు ఫారం 2.రైతు పట్టా దారు పాస్ బుక్ (జిరాక్స్) 3.రైతు ఆధార్ కార్డు (జిరాక్స్) 4.నామిని ఆధార్ కార్డు(జిరాక్స్) గమనిక : 18 నుండి 59 సంవత్సరాలు వయస్సు ఉన్న రైతులు మాత్రమే భీమా నమోదు చేసుకోవాలి ఇంకా ఏమైనా మీకు సందేహాలు ఉంటే వ్యవసాయ అధికారులను సంప్రదించగలరు...
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
వ్యవసాయరంగానికి బడ్జెట్ లో ఎంత ??
2024-25 ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి ఉత్పాదకతకు మరియు స్థితిస్థాపకతకు మొత్తం 1.52 లక్షల కోట్లు రూపాయిల నిధులు కేటాయించారు. రానున్న రెండేళ్లలో కోటిమంది రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేసేలా ఇన్ పుట్ రిసోర్స్ కేంద్రాలు ప్రోత్సాహం. మారుతున్న వాతావరణ పరిస్థితులను తట్టుకొని నిలబడి, అధిక అధిక దిగుబడినిచ్చే, 109 హై-యీల్డింగ్ రకాలను విడుదల చేసారని నిర్మల సీతారామన్ తెలిపారు. పప్పుదినుసులు మరియు నూనే గింజలలో సమృద్ది మరియు కూరగాయల ఉత్పత్తి కోసం పెద్ద ఎత్తున క్లస్టర్లు అభివృద్ధి సహకార సంఘాలు, స్టార్టప్ లకు మరియు రొయ్యల పెంపకం మరియు ఎగుమతి ప్రభుత్వం ప్రోత్సాహం చేయబోతున్నామని తదితర వ్యవసాయ విషయాలను ఆర్థిక మంత్రి చెప్పారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
ఏపి రైతులందరికీ పంటల బీమా!!
నోటిఫై చేసిన పంటలు, సాగు చేసే రైతులందరికీ పంటల బీమా వర్తింపజేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రులు ఆధికారులను ఆదేశించారు. విపత్తుల వేళ నష్టపోయే ప్రతి రైతుకు న్యాయం జరిగేలా బీమా అమలు చేయాలని సూచించారు. మెరుగైన పంటల బీమా అమలు, దిగుబడి ఆధారంగా, వాతావరణ పరిస్థితులను బట్టి బీమా అమలు, క్లెయిమ్ల చెల్లింపులు తదితర అంశాలపై చర్చించామని, ఇందుకు సంబంధించి నివేదికను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి ఆమోదం కోసం పంపుతామని మంత్రులు తెలిపారు. గతంలో బీమా లేక నష్టపోయిన మామిడి రైతులకు కూడా పంటల బీమా వర్తింపజేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
ఆంధ్రప్రదేశ్ రైతులకు ఖరీఫ్ సీజన్ ఎరువులు సిద్దం !!
ఖరీఫ్ సీజన్ కోసం పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని, రైతుల కోసం విక్రయించేందుకు 1321 సహకార సంఘాల్లో ఎరువులను సిద్ధం చేయాలని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి ఆదేశించారు . ఖరిఫ్ సీజన్ కోసం 17.50లక్షల టన్నుల ఎరువులను సిద్ధం చేయాలని వ్యవసాయ మంత్రి ఆదేశించారు. ఈ సీజన్ కోసం రాష్ట్రంలో ప్రస్తుతం 14 లక్షల టన్నుల ఎరువులు ఉన్నాయని, మిగిలిన వాటిని కూడా సకాలంలో రాష్ట్రానికి చేరుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి తెలిపారు .
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
సైబర్ నేరగాల్లతో రైతులు జాగ్రత్త !!
తెలంగాణ రాష్ట్రంలో పెద్ద మొత్తంలో రుణమాఫీ నిధులు ఇవాల్టి నుండి రైతుల ఖాతాల్లో పడుతుండగా సైబర్ నేరగాళ్ళు లింకులు పంపి మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. బాంకు పేర్లు వివరాలను చూసి మోసపోవద్దు అని సైబర్ క్రైమ్ అధికారులు సూచిస్తున్నారు. రైతులు ఇలాంటి అనవసర మెసేజ్ లను, ముఖ్యంగా APK రూపంలో వచ్చేవి అస్సలు క్లిక్ చేయవద్దు. దాని వలన మీ అకౌంట్ లో ఉండే డబ్బులను కోల్పోవడం జరుగుతుంది కావున అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటివి మీరు ఎదుర్కున్నట్లితే వెంటనే 1930 సైబర్ క్రైమ్ పోలీసులకు సంప్రదించాలని తెలిపారు.









