NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
పెరిగినా యాసంగి విస్తీర్ణం
రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది వరిసాగు విస్తీర్ణం పెరిగింది. గత తోమ్మిది సంవత్సరాల్లో ఎప్పుడు లేనంతగా ఈ యాసంగీలో 68.53 లక్షల ఎకరాల్లో సాగైందని వ్యవసాయశాఖ నివేదిక విడుదల చేసింది. 24 వ్యవసాయ కరెంటు, మద్దతు ధర, గ్రామాస్థాయిలో ధాన్యం కొనుగోలు, కోతకు యంత్రాలు వంటి కారణాలతో సాగు విస్తీర్ణం పెరిగందని వ్యవసాయ నిపుణుల చెబుతున్నారు. పెరిగినా సాగుకు తగ్గట్టుగా రైతులకు ఇబ్బందులు కాకుండా కొనుగోలుకేంద్రాల వద్ద పడిగాపులు లేకుండా చూడాలంటున్నారు సాగురైతులు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
సాగురంగంపై భారత్ చిలీ దేశాల మధ్య ఒప్పందం
వ్యవసాయం మరియు అనుబంధ రంగాలలో రెండు దేశాల మధ్య అవగాహన ఒప్పందానని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రి వర్గం ఆమోదించింది. ముఖ్యంగా a.ఆధునిక వ్యవసాయ అబివృద్ది సాగు విధానాలు b.సేంద్రియ ఉత్పత్తుల వినియోగం c.వ్యవసాయంలోనూతన అవిష్కరణలకు ప్రోత్సహిచండం d.భారత్ చిలీ దేశాల మధ్య అగ్రికల్చర్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
పంటలకు కనుపాపగా రేషామండీ డివైస్
ఐటీఓ డివైజ్ లేటేస్ట్ వెర్షన్ ను రేషామండీ కంపనీ లాంచ్ చేసింది. రేషా అభివృద్ది చేసినా ప్యాకేజీలో రైతుకు బీమా సౌకర్యం కూడా కల్పిస్తుంది. అధిక దిగుబడులకు ష్యూరిటిలా నిలబడునుందని ఈ కంపనీ తెలిపింది. ఎప్పటికప్పుడు రైతులకు అవసరమైనా పంటల సమాచారాన్ని రైతు ఫోన్ కు అందిస్తూ దాదాపు 15 శాతం పంట దిగుబడులు పెరిగే అవకాశం ఉందంటున్నారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
పప్పుశనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభo
అలంపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో పీఏసీఎస్ ద్వారా మంగళవారం నుండి పప్పుశనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. క్వింటాల్ కు రూ. 5,545 ల మధ్దతు ధర ఉందని, రైతులందరు నాణ్యమైన , తేమలేనీ శనగలు తీసుకొచ్చి మధ్దతు ధర పోందాలని మార్కెట్ అధికారులు, వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
నకిలీ విత్తనాలు జాగ్రత్త రైతన్న...
నకిలీ విత్తనాలు కొంపలు ముంచుతున్నాయి .సీజన్ ప్రారంభంలో పోలిసుల ,అధికారుల నిఘా ఉంటుందని గ్రామాలకు తెలివిగా ముందే చేరవేస్తున్నారు . గ్లైసిల్ విత్తనాల అమ్మకంతో వ్యాపారస్తులు క్కోట్లు సంపాదిస్తున్నారు . రెండు రోజుల ముందు తాండూరు పోలీసులు ఐదు క్వింటల్ల పత్తి విత్తనాలను పట్టుకోవడం జరిగింది అయితే వ్యాపారస్తులు తెలివిగా కౌలుకి తీసుకోని ,కొందరు వారి ఊరిలోనే ఉండి నమ్మించి మోసం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం నకిలీ విత్తనాలు ఫెబ్రవరి ,మార్చ్ నెలలలో డంప్ చేస్తున్నారు .గత ఏడాది 60 శాతం ఇలా నకిలీ విత్తనాలు సాగు చేసి పూర్తిగా నష్టపోయారు అంటే అర్ధం చేసుకోండి. గడ్డి మోలవదు ,అధిక దిగుబడికి ఆశపడి రైతుల అమాయకానన్ని ఆసరా చేసుక్కొని ఈ విత్తనాలను అంటగడుతున్నారు.గ్లైసిల్ విత్తనాలతో పర్యావరణానికి ముప్పుతో పాటు నెల నిస్సరమవుతుందన్న విషయం గుర్తుంచుకోవాలి.దీంతో నాలుగేళ్లగా ఇలాగె నకిలీ విత్తనా సమస్య పెరిగిపోతుంది. రైతన్న తస్మాత్ జాగ్రత్తా .....
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
అందుబాటులోకి రానున్న సిద్దిపేట సేంద్రియ ఎరువు
ఇట్టింటా జమ చేస్తున్న తడి, పోడి చెత్తనుండి సేంద్రియ ఎరువును తయారు చేసే ప్రయత్నం చేసింది సిద్దిపేట మున్సిపాలిటి. సేంద్రియ ఎరువులో కార్బన్ ఎక్కువగా ఉంటుందని, ఇది పండ్లతోటలకు, కూరగాయల మొక్కలకు శ్రేష్టకరం కావటంతో రైతులకు సిద్దిపేట బ్రాడ్ పేరుతో తయారు చేయించారు. భూమిత్ర పేరిట రేపటి నుండి రైతులకు దినిపై అవగాహన కల్పించారు. అందుబాటులో ఉంటుందని, మొదటగా నియోజకవర్గ రైతులకు ఆ తర్వాత మిగతా రైతులకు అందజేయనున్నారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
ఖైదీలతో పామాయిల్ నర్సరీ పెంపకం
తీరు మారుతుంది. నర్సరీ పెంపకంలో తోటమాలులే ఖైదీలు సైతం పాలుపంచుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సెంట్రల్ జైళ్లో ఉన్న ఖైదీలతో పామ్ ఆయిల్ మొక్కలు పెంచేలా కేఎన్బయోసైన్స, జైళ్ల శాఖ మధ్య ఎంవోయూ కుదిరింది. కవర్లో మట్టిని విత్తడం, మట్టిని నింపడం, అవసరం మేర నీటి తడులు ఇవ్వడం ఇలా ప్రతి అంశాన్ని ఖైదిలకు శిక్షణ ఇచ్చారు. 3లక్షల మొక్కలు పెంచే దిశగా...పనిచేసే ఖైదీలకు నిత్యం రూ.150 చెల్లిస్తారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
🔸 కుసుమ నూనెతో కలిగే ప్రయోజనాలు
పండించే కుసుమ పంటను ప్రస్తుతం ఔషధాల తయారీలో ఎక్కువగా వినియోగిస్తున్నారు. పూర్వం రోజుల్లో వంటలకు రంగు తీసుకురావడం కోసం ఈ విత్తనాలను ఉపయోగించేవారు. అయితే ఇప్పుడు వీటి నుంచి నూనె తీసి వంటలకు వాడుతున్నారు. కుసుమ నూనెలో పోషకాలు పుష్కలంగా ఉండి ఎన్నో ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలను చూపుతున్నదని పోషకాహార నిపుణులు చెప్తున్నారు. కుసుమ నూనెలో కొలెస్ట్రాల్ స్థాయి కూడా చాలా తక్కువగా ఉంటుంది. కుసుమ నూనెలో మెగ్నీషియం, భాస్వరం, మాంగనీస్, జింక్, ఇనుము, రాగి, ప్రొటీన్ ఖనిజాలు ఉంటాయి. 100 గ్రాముల కుసుమ నూనెలో కొవ్వులు 38 గ్రాములు, సోడియం 3 గ్రాములు, పొటాషియం 687మిల్లి గ్రాములు, కార్బొహైడ్రేట్స్ 34 గ్రాములు, ప్రొటీన్ 16 గ్రాములు, విటమిన్ బీ12 88 శాతం ఉంటుంది, కుసుమ గింజల నుంచి తీసే మోనోశాచురేటెడ్, పాలీ అన్శాచురేటెడ్.. రెండు రకాల నూనెలను వంటల తయారీకి, కూరల వేపుళ్లకు వాడొచ్చు. ఇవీ ఆరోగ్య ప్రయోజనాలు.. మధుమేహ వ్యాధిగ్రస్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, కీళ్ల నొప్పులు తగ్గించడం, తలనొప్పి నుంచి ఉపశమనం కలిగించడం, చర్మం, జుట్టు నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కుసుమనూనెలో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె సంబంధిత వ్యాధుల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. స్ట్రోకులు రాకుండా నియంత్రిస్తుంది. ఈ నూనెలో యాంటిఆక్సిడెంట్స్ ఉండిగుండెకు మేలు చేకూరుస్తాయి. ఈ నూనె వాడటం వల్ల రక్తంలో చక్కెర శాతం తగ్గుతుంది
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
పురుగుమందుల పై నోటిఫికషన్ జారి చేసిన ప్రభుత్వం
పురుగు మందుల వినియోగం పై కేంద్ర ప్రభుత్వం అంక్షలను విదించాలని నిర్ణయిచింది. ఇందులో రైతులు తరచుగా వాడే కార్బోఫ్యురాన్, మోనోక్రోటఫాస్ ,మంకోజేబ్, క్వినాల్ఫాస్ , డైమీథేట్ , క్లోరోపైరిఫాస్ , ఆక్సిఫ్లోరోఫిన్,మాలాథియాన్ ,తాము నిర్దేశించిన పంటలకు ఉపయోగించకూడదు అని నిబందిచింది.ఈ మేరకు లేబుల్ ,లిఫెలేట్ లతో నిర్దేశించిన పంటలను తొలగించాలని , వీటి జీవ సామర్థ్యం ,అవశేషా సమచారాన్ని పరిగణలోకి తీసుకున్న తరువాత ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు కార్బోఫ్యురాన్: 3 % గుళికలు మినహా మిగతా అన్నిరకాల ఫోర్ములషన్ వినియోగాన్ని ఆపివేయాలని .క్రాప్ లేబుల్ నిలిపేయాలి . మోనోక్రోటఫాస్: నీటిలో కరిగే 15% గుళికలు మినహా ఈ పురుగుమందుకు సంబందిత మిగః అన్ని ఫోర్ములశాన్లను ఆపివేయాలి. డైమీథేట్: ముడి ఆహారంగా తీసుకునే పండ్ల ,కూరగాయలకు దిన్ని ఉపయోగించకూడదు . క్లోరోపైరిఫాస్: రేగు ,సిట్రస్ ,పొగాకు పంటలకు వాడవద్దు . ఆక్సిఫ్లోరోఫిన్:ఆలు, వేరుశనగకు వాడరాదు . మంకోజేబ్: జామ ,జొన్న ,కర్రేపెందల పంటల్లో వాడరాదు. మాలాథియాన్: జొన్నలు ,శనగ , సోయబిన్ , ఆముదం , వంగ ,బెండ ,ద్రాక్ష ,కాలిఫ్లోవర్ ,మామిడి ,ముల్లంగి ,యాపిల్ ,పొద్దుతిరుగుడు ,టమాటో,పంటలకు వాడవద్దు. క్వినాల్ఫాస్: జనపనార ,యాలకులు ,జోన్నలకు వాడకూడదు . ఈ మందుల తయారీదారులు ఇక పై పైన తెలిపిన పంటల వివరాలు లేబుల్ నుండి తొలగించాలి అని సెంట్రల్ ఇంసేక్టిసైడ్ బోర్డు అండ్ రిజిస్ట్రేషన్ కమిటీ సేక్రటరికి ఆరునెలలలోపు దరకాస్తు చేసుకోమని, లేదంటే లైసెన్సు రద్దు చేస్తామని హెచ్చరించింది. వీటి దిగుమతి, తయారి, ఫోర్ములషన్, రవాణా, అమ్మకాలన్నిటికీ తుది నోటిఫికషన్ నేటి నుండి నిలిపి వెయలన్నట్లు పేర్కొన్నది.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
జలకళ చూసి సీఎం సంతోషం
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని మద్య మానేరు, దిగువ మానేరు జలాశయాల జలకలను చూసి ముఖ్యమంత్రి కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. కొండగట్టు ఆలయానికి వచ్చిన సీఎం తిరుగు ప్రయాణంలో హెలికాప్టర్లో వెళ్తూ కాలేశ్వర జలాలను ఎత్తిపోస్తున్న తీరు మధ్య మానేరు నిండుకుండం తలపిస్తుందని. ఎక్కడి నుంచి ఎటువైపునకు జల దారాలు వెళుతున్నాయని విషయాన్ని సీఎం వివరించాడు. ఒకప్పుడు ఎడారిని తలపించిన ఈ ప్రాంతం ఇప్పుడు కోనసీమను తలపిస్తుందని ముఖ్యమంత్రి ఆనందం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.