NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
జలకళ చూసి సీఎం సంతోషం
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని మద్య మానేరు, దిగువ మానేరు జలాశయాల జలకలను చూసి ముఖ్యమంత్రి కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. కొండగట్టు ఆలయానికి వచ్చిన సీఎం తిరుగు ప్రయాణంలో హెలికాప్టర్లో వెళ్తూ కాలేశ్వర జలాలను ఎత్తిపోస్తున్న తీరు మధ్య మానేరు నిండుకుండం తలపిస్తుందని. ఎక్కడి నుంచి ఎటువైపునకు జల దారాలు వెళుతున్నాయని విషయాన్ని సీఎం వివరించాడు. ఒకప్పుడు ఎడారిని తలపించిన ఈ ప్రాంతం ఇప్పుడు కోనసీమను తలపిస్తుందని ముఖ్యమంత్రి ఆనందం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
అడుగంటుతున్న జలాశయాలు...
వరంగల్ జిల్లాలో యాసంగి వరి నాటు పూర్తయ్యాయి మరో రెండు మాసాలపాటు పొలాలకు నిత్యంతడులు అవసరం జిల్లాలో దేవాదుల ఎత్తిపోతల పథకంలో నిర్మించిన జలాశయాలు అడుగంటుతున్నాయి. భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టాయి ఊట బోర్లు రోజు విడిచి రోజు వినియోగించాల్సి వస్తుంది. ఈ పరిస్థితులలో జిల్లాలోని భారీ చిన్ననీటి జలాశయాల దిక్కు దేవాదుల జలాశయాల్లో నీరు నిండుకుంటుంది. మరోపక్షం రోజుల్లో ధర్మసాగర్ నుంచి నీటి సరఫరా జరగని పక్షంలో ఇవి పూర్తిగా అడుగంటే పరిస్థితులు ఉన్నాయి. ధర్మసాగర్ కు వచ్చే పైపులైను పులకుర్తి చలివాగు తదితర ప్రాంతాల్లో గత వర్షాకాలం పలుచోట్ల పైకి తేలడంతో ఎత్తిపోతల నిలిచిపోయింది. ఏడాదిలో 170 రోజులు ఎత్తిపోతల జరగాల్సి ఉంటుంది. సాంకేతిక కారణాలతో ఎత్తిపోతల్లో అంతరాయం ఏర్పడింది ములుగు, ధర్మసాగర్, చలివాగు ధర్మసాగర్ మధ్యలో పైప్ లైన్ మరమత్తులు పూర్తిచేసి నాలుగున ధర్మసాగర్ కు నీటిని విడుదల చేశారు. వరంగల్ మహానగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు చర్యలు చేపట్టారు ఇదే సమయంలో అటు గండి రామవరం ఇటు ఆర్ఎస్ ఘన్పూర్ జలాశలకు నీటి సరఫరా ప్రారంభం కోసం రైతులు ఎదురు చూస్తున్నారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
ఆయిల్ పామ్ లో అదరహో....
ఆయిల్ పామ్ లో 19.32 నూనె ఉత్పత్తి శాతంతో తెలంగాణ నంబర్ వన్ ఉందని దేశంలో దాదాపు 9.25 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు అన్నారు. దేశంలో, సాలీనా100 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా పామ్ ఆయిల్ డిమాండ్ ఉండగా, వార్షిక ముడి పామ్ఆయిల్ ఉత్పత్తి ఏడాదికి 2.90 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉన్నది. ఈ లోటును దేశం దిగుమతుల ద్వారా సమకూర్చుకుంటున్నదని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు తెలిపారు. దేశంలో పామ్ ఆయిల్ స్వయం సమృద్ధి సాధించాలంటే అదనంగా 70 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు అవసరం. తెలంగాణ రాష్ట్రానికి సుమారు 3.66 లక్షల టన్నుల పామ్ ఆయిల్ అవసరం కాగా ప్రస్తుతం 52,666టన్నుల ఉత్పత్తి మాత్రమే జరుగుతున్నది. అన్ని నూనె గింజల పంటలకన్నా ఆయిల్ పామ్ లో ఎక్కువ దిగుబడినిస్తుంది (ఎకరానికి 10-12 టన్నులు ), 25 – 30 సం. వరకు సంవత్సరానికి సుమారు రూ.1,20,000/- నుండి రూ.1,50,000/- వరకు, ఆదాయం పొందవచ్చు. రాష్ట్రంలో వివిధ పధకాలకింద 2021-22 సం. వరకు 68,440 ఎకరాలు,(13,302 రైతులు) ఆయిల్ పామ్ సాగు కిందకు వస్తాయి. పంటల వైవిధ్యీకరణ నేపథ్యంలో సుమారు 20.00 లక్షల ఎకరాలలో పామ్ ఆయిల్ సాగుకు ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. 27 జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తరణ చేపట్టేందుకు 11 కంపెనీలకు ఫ్యాక్టరీ జోన్లను కేటాయింపు చేయడం జరిగింది. 2022-23 ఏడాదికి గాను ఇప్పటివరకు 61277 ఎకరాలలో ప్రగతి సాధించడం జరిగిందని 2023-24 సం. కి గాను,2.00 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేపట్టేందుకు మొక్కల పెంచేందుకు ప్రణాళిక రూపొందించడం జరిగింది.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
నిలువు-వ్యవసాయం
పెరుగుతున్న జనాభాకు ఆహారం అందించాలంటే అంత సులువు కాదు. నేల పై చేసే వ్యవసాయం సరిపోవడం లేదు. ప్రస్తుతం పట్టణాలలో ఇళ్ళ పైన చిన్న మొక్కలను ,కూరగాయ మొక్కలను, పులా మొక్కల పెంచడానికి మక్కువ చూపుతున్నారు. అయితే ఇళ్లలోనే ఎక్కువ దిగుబడి వచ్చేలా పండిస్తున్నారు. వ్యవసయలను టెర్రస్ గార్డెన్ ,కిచెన్ గార్డెన్ ,అక్వపోనిక్స్ ,హైడ్రోపోనిక్స్ అని వివిధ రకాలుగా పండిస్తున్నారు. నిలువు -వ్యవసాయం అనగా ఉన్న తక్కువ నేలలో ఎక్కువ పండించవచ్చు.ఇది సాంప్రదాయ వ్యవసాయాల కన్న పది రెట్లు ఎక్కువ దిగుబడిని ఇస్తుంది .ఇది ఇండోర్ వ్యవసాయం సంవత్సరం పొడవు పంటలను ,అన్ని కాలల్లో ,ఒకేసారి వివిధ పంటలను పండిచడానికి ఇది దోహదపడుతుంది.మన భారత్ లో మహారాష్టలో పసుపు పండిస్తున్నారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
దేశంలో అత్యధిక రుణభారం...
దేశంలో ఆంధ్రప్రదేశ్ రైతులపైనే అత్యధిక రుణమాల ఉంది జాతీయ స్థాయిలో సగటున ఒక్కో రైతు కుటుంబం పై రూ. 74 వేల రూపాయల రూపాయి ఉండగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అది రెండు రూ. 2,45,454 చొప్పున ఉంది. ఇది దేశంలో ఒక్కో రైతు కుటుంబం కోసం రుణభారం కంటే 231% అధికంగా ఉంది ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ ఖరాట్ సోమవారం లోక్సభలో తెలిపారు. రైతులు అత్యధికంగా రుణభారం మోస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, కేరళ, పంజాబ్ టాప్ లో నిలిచాయి. ఈ మూడు రాష్ట్రాల్లోనే రైతు కుటుంబాలపై సగటున రుణభారం రూ. రెండు లక్షలకు మించింది హర్యానా, తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్ మరియు తమిళనాడులో రైతు కుటుంబాలపై రూ. లక్షకు పైగా రుణభారం ఉంది. మిగతా రాష్ట్రాల్లో రైతులపై సగటుబారం రూపాయల లక్ష లోపే నమోదయింది.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
వ్యవసాయ ఎగుమతుల్లో.....
తెలంగాణలో వ్యవసాయం దాని అనుబంధ రంగాల ఉత్పత్తుల ఎగుమతులు ఏటేటా పెరుగుతున్నాయి గత ఆర్థిక సంవత్సరంలో రూ.7737 కోట్లకు చేరాయి. రాష్ట్రంలో ఆహార శుద్ధి పరిశ్రమలకు ప్రోత్సాహంతో పాటు ఒక జిల్లా ఒక ఉత్పత్తి పథకం ద్వారా ఈ పురోగతి సాధించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. వ్యవసాయకంగా రాష్ట్రంలో ఉత్పత్తులు పెరుగుతున్నాయి వ్యవసాయం దాని అనుబంధ రంగాలలో స్థూల రాష్ట్ర విలువ గణనీయంగా పెరిగింది. పంట ఉత్పత్తుల శుద్ధి ద్వారా అదనపు విలువను కల్పించడం ద్వారా రైతుల ఆదాయం పెంచాలని ప్రభుత్వం భావించింది ఈ మేరకు ఆహార శుద్ధి పరిశ్రమలను ఏర్పాటును పెద్ద ఎత్తున చేపట్టింది ఎగుమతులకు అనువైన వనరులు మౌలిక సదుపాయాలను కల్పించింది గోదాములు, శీతల గిడ్డంగుల నిర్మాణం చేపట్టింది. ఆహార శుద్ధి పరిశ్రమల కోసం ప్రత్యేక విధానం చేపట్టింది దీంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఆహార శుద్ధి ప్రత్యేకంగా మండలను చేపట్టింది ప్రత్యేక మండలను. గత కొంతకాలంగా పత్తికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఏర్పడింది జౌలి ఉత్పత్తులతో పాటు ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల కోసం పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు దీంతో పత్తి ఎగుమతులకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆరోగ్య సంరక్షణలో భాగంగా బియ్యం జొన్నలు, గోధుమలు తదితర తృణధాన్యాలకు ఇతర దేశాల్లో ఆదరణ ఉంది కాఫీ, టీ, పసుపు, కారం, ఆవాలు, జీలకర్ర మిరియాలు ఎగుమతుల ఆర్డర్లు పెరుగుతున్నాయి,. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 33 జిల్లాలను ఆహార శుద్ధి ప్రత్యేక మండళ్లను ఏర్పాటు చేసిన పక్షంలో అక్కడి నుంచి ఎగుమతులు విస్తరిస్తాయని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
24గంటల కరెంట్ ఉత్తదే..!
-కరెంట్ కోతలతో రైతులకు తప్పని తిప్పలు - సమయపాలన లేకుండా ఇవ్వడంతో రైతుల అయోమయం రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేసవి కాలం ప్రారంభం కాక ముందే కరెంట్ కోతలు విధించడం భావ్యం కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో సరైన సమాచారం తెలియక రైతులు పొలాల వద్దనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వాపోతున్నారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
పెట్టుబడి కోసం ‘రైతుబంధు’
విత్తు ఎంత మంచిదైనా మట్టి తోడు లేకపోతే మొలవదు… విత్తు, మట్టి ఎంత మంచివైనా ఎంత సారవంతమైనవైనా.. ఆకాశం నుండి వర్షపు చుక్క ఆ మట్టికి తగలకపోతే మొలకెత్తదు… ఆకాశం నుండి వర్షపుధార మట్టి మీద పడ్డా… రైతన్న యొక్క చెమట చుక్క తోడు కాకుంటే మొలకెత్తదు. వాన చుక్క, చెమట చుక్క, విత్తనం, మట్టి అన్నీ కలిసి మొలకెత్తినా అది పంటగా మారాలంటే రైతుకు పెట్టుబడి కావాలి… ఆ పెట్టుబడి కోసం ‘రైతుబంధు’ పథకం వచ్చింది..!
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
మేకల మరియు గొర్రెల పెంపకం పైన సబ్సిడీలు
కోటి పెట్టుబడి 50 లక్షల సబ్సిడీ మాంసం ఉత్పత్తి పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా గొర్రెలు మేకలు, కోళ్ల పెంపకానికి చేయూత ఇస్తుంది. యూనిట్ విలువ రూపాయలు 12 లక్షల నుంచి కోటి కాగా అందులో సర్కారు 50% సబ్సిడీ అందిస్తుంది. కేవలం గొల్ల కురుమలే కాకుండా అన్ని సామాజిక వర్గాలు చెందినవారు అర్హులే పశుసంవర్ధక శాఖ ద్వారా ఈ స్కీమ్ ని అమలు చేస్తుంది ఈ పథకంపై అంతగా ప్రచారం అవగాహన లేకపోవడంతో ప్రోత్సహించిన స్పందన కొరవబడింది ఇప్పటివరకు మంచిర్యాల జిల్లాలోని 13 దరఖాస్తులు లాగా నాలుగు యూనిట్లు గ్రౌండింగ్ అయ్యాయి. ఎంపిక చేసుకున్న యూనిట్ బట్టి రెండు నుంచి పది ఎకరాల భూమి అవసరం ఉంటుంది సొంత భూమి లేకుంటే లీజు తీసుకోవచ్చు చుట్టూ ఫెన్సింగ్ వేసి షెడ్యూల్ నిర్మించి అందులోనే మేత ఏర్పాట్లు కూడా చేసుకోవాలి . బ్యాంకు లోన్ కోసం కాన్సెంట్ తీసుకోవాలి, అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్లు జత చేస్తూ ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. మరిన్ని వివరాల కొరకు nlm.udyamimitra.in వెబ్సైట్ సందర్శించండి.