NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
రాష్ట్రానికి వర్ష సూచన
తమిళనాడులో ఏర్పడ్డ ఉపరితల ద్రోణి కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రాబోయే నాలుగు రోజుల్లో వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం గురువారం ప్రకటించింది. ఈదురు గాలులు, వడగండ్లు, ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే పంట కోతలు పూర్తైనా రైతులు నిల్వచేసే ప్రాంతాల్లో తగు చర్యలు తీసుకొవాలని సూచిస్తున్నారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
ఫసల్ బీమా యోజన (FBY)
ఈ పథకం కింద, రైతులు తమ పంటలకు కరువు, వరదలు, అగ్నిప్రమాదం, తుఫాను, తెగుళ్లు మరియు వ్యాధులు వంటి వివిధ నష్టాల పరిస్థితుల కారణంగా పంట నష్టపోయిన రైతులకు బీమా కవరేజీ మరియు ఆర్థిక సహాయం అందించడానికి భారత ప్రభుత్వం 2016లో ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా పంట నష్టపోయిన రైతులు బీమా పొందవచ్చు. దీనికి రైతులు కొంత ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మరికొంత ప్రీమియం చెల్లిస్తాయి. నష్టం జరిగినప్పుడు వెంటనే బీమా కంపెనీకి లేదా సంబంధిత అధికారులకు తెలియజేయండి. మీ పంటలలో సంభవించిన నష్టాన్ని సమయ వ్యవధిలోపు క్లెయిమ్ ఫైల్ చేయండి. క్లెయిమ్ ఆమోదించబడిన తర్వాత, బీమా కంపెనీ పరిహారం మొత్తాన్ని నేరుగా మీ బ్యాంక్ ఖాతాకు విడుదల చేస్తుంది. కావునా రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని పంట నష్టం నుండి బయటపడండి.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
ప్రతి ఎకరానికి రూ 10,000 నష్టపరిహారం!!
ప్రతి ఎకరానికి రూ. 10,000 నష్ట పరిహారం!! అకాల వర్షాల వల్ల నష్టపోయిన తెలంగాణ రైతుకి కొంత ఊరట. ఈరోజు క్షేత్ర స్థాయి పంటల పరిశీలన తరువాత, తెలంగాణ ముఖ్యమంత్రి ఇటీవల కురిసిన వడగండ్ల వానల వల్ల నష్టపోయిన పంటల రైతులకి అభయమిచ్చారు. పంటతో సంబంధం లేకుండా నష్టపోయిన ప్రతి ఎకరానికి రూ. 10,000/- (పది వేల రూపాయలు) నష్టపరిహారంగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అని, దానికోసం రూ. 228 కోట్లు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ నష్ట పరిహారం కౌలు రైతులకి కూడా వర్తిస్తుందని తెలుపడం, కౌలు రైతుల నష్టాలకి కూడా కొంత ఉపశమనం.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
రూ. 45000/- వరకు వరి పంట రుణ పరిమితి పెంపు!
ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన సోమవారం నాటి సమావేశంలో జిల్లాల వాతావరణ పరిస్థితులు, జిల్లా స్థాయి సాంకేతిక కమిటీలు తయారు చేసిన పంట రుణ పరిమితులను పరిగణనలోకి తీసుకుని 2023-24 సంవత్సరానికి సగటున రుణాలను 15% నుంచి 20% మేర పెంచాలని నిర్ణయించడం జరిగింది. ఇక నుంచి వరి సాగుకు పంట రుణ పరిమితిగా రానున్న ఖరిఫ్ లో 42 వేలు , రబీలో 45 వేల వరకు రుణ పరిమితి ని రైతులు పొందవచ్చు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
వ్యవసాయంలో రోబో
ఇతర రంగాలతో పోలిస్తే టెక్నోలజి వ్యవసాయ రంగలో వెనకబడి ఉన్నప్పటికి వ్యవసాయ రంగాల్లో ఏ మాత్రం వెనకంజా వేయకుండా శాస్రవేత్తలు, విద్యావంతులు పరిశోదిస్తున్నారు. పరిశోధకుల నిరంత కృషి వలెనే డ్రోన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు రిమోట్ కంట్రోల్ మరియు బ్యాటరి సాయంతో నడిచే రోబో ట్రాక్టర్ అందుబాటులోకి వచ్చింది. సరైన సమయంలో కూలిలు అందుబాటులో లేకపోవడం మరియు కూలి రేట్లు ఎక్కువ అవ్వకుండా ఖర్చు తగ్గిచుకోవడానికి ఈ రోబో ఎంతగానో సహాయపడుతుంది. ఇది బ్యాటరితో నడిచేది కావున తక్కువ ఖర్చు మరియు వేరే వారి పై ఆధారపడకుండా రైతు సొంతగా తానెగానే వాడవచ్చు. ఈ రోబో మూడు అంగుళాల లోతుకి దున్నడం, సాళ్ళ మధ్య కలుపు, పురుగు మందుల పిచికారి, విత్తనాలు మరియు నారు వేసుకోవడానికి ఉపయోగించవచ్చు. పవర్ టిల్లర్, ఎద్దుల అరక, బ్రష్ ట్రాక్టర్, స్ప్రేయర్ ద్వారా చేసే పనులన్నీ ఈ రోబో ట్రాక్టర్ చేస్తుంది. దినిని అన్ని పంటల్లోను వాడవచ్చు అని రోబో సృష్టికర్తలైన ధర్మేంద్ర మరియు త్రివిక్రం తెలియజేసారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
కొయ్యూరులో జ్యూస్, సోడా యూనిట్ ఏర్పాటుకు సన్నాహాలు !!
మండలంలో జీడి మామిడి సాగు ప్రధానమైంది. మండలంలోని 33 పంచాయతీల్లో సుమారు 40 వేల ఎకరాలకు పైగానే జీడిమామిడి తోటలు విస్తరించి ఉన్నాయి.. ఈ తోటల్లోని పండ్లను కొన్ని సార్లు వృథాగానే బయట పారే స్తుంటారు. ఈ పండ్లతో జీడి మామిడి జ్యూస్, సోడా తయారు చేయించే యూనిట్ని కొయ్యూరులో నెలకొల్పేందుకు వెలుగు అధికారులు అధ్యయనం చేస్తున్నారు. పాడేరు ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ అదే శాల మేరకు వెలుగు ఏపీఎం శ్రీనివాస రావు, సిబ్బంది గంగవరం మండలంలో ఏర్పాటు చేసిన యూనిట్ను ఇటీవల పరిశీలించారు. ఓ సంస్థ సుమారు 20 లక్షలతో జ్యూస్, సోడా తయారు చేసి యంత్రాలను అందించింది. వీటికి మంచి డిమాండ్ ఉన్నట్లు గుర్తించారు. ఇలా తయారు చేసిన సోడా ఆరు మాసాల పాటు నిల్వ చేసే అవకాశం ఉంది. రైతులకు సైతం ఆర్ధికంగా ఉపయోగం ఉంటుంది. కొంతమందికి ఉపాధి దొరుకుతుంది. ఈ ఏడాదిలోనే జీడిమామిడి పండ్ల జ్యూస్, సోడా యూనిట్ అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
వేల ఎకరాల పంట నష్టం
వడగళ్ల వానతో మొక్కజొన్న, బీర, టమాట, బొబ్బర, మిరప, గులాబీ, ఉల్లి మరియు కొన్ని పొట్ట దశ వచ్చిన వరి నేల వాలింది. మామిడి పిందేలు, కాయలు రాలి తీవ్ర నష్టం వచ్చిందని రైతులు బాధపడుతున్నారు. ఆరు జిల్లాల్లో సుమారుగా 50 మండలాల్లోని 650 గ్రామాల్లో ముఖ్యంగా వికారాబాద్ జిల్లాలో వడగళ్లతో పంట పొలాలన్నీ మంచుతో నిండిపోయాయి. పంట చేతికొచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. దీనితోపాటు సంగారెడ్డి, కొత్తగూడెం, భూపాలపల్లి, ములుగురు జిల్లాలోనూ పలుచోట్ల వడగళ్ల వానతో పంట పొలాలు దెబ్బతిన్నాయి. రానున్న నాలుగు రోజులు తెలుగు రాష్ట్రాలలో అకాల వర్షాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి రైతులు అప్రమత్తంగా ఉండాలి.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
వేసవిలో పశువులు జాగ్రత్త
వేసవిలో గత ఏడాదికన్నా వేడి ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అధిక ఉషోగ్రతలు, వేడి గాలుల వలన పాడి పశువులు ఉష్ణతాపానికి గురవుతాయి. ఈ పరిస్తితులలో యజమానులు సస్యరక్షణ చర్యలు తీసుకోని కాపడుకోవాలని పశు వైద్యాధికారులు చెబుతున్నారు. అందుకని మేతలో భాగంగా వేసవిలో సులువుగా జీర్ణమయ్యే గంజి, జావ లాంటి పదార్థాలు ఇవ్వడంతో పాటు ఎక్కువ శాతం పచ్చిమేత ఇవ్వాలి. పచ్చిగడ్డి ఉద యం, ఎండు గడ్డి రాత్రి సమయాల్లో ఇస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. మినరల్ మిక్చర్, ఉప్పు కలిపిన ద్రావణం ఇవ్వడం మంచిది. పశువుల్ని మేపేందుకు ఉదయం 6 నుంచి 10గంటల వరకు సాయంత్రం 5 నుంచి 7గంటల వరకు బయటకు పంపడం మంచిది. పశువులకు వడదెబ్బ తగలకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మేత విషయంలో పచ్చి గడ్డికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం, చల్లని నీరు తాగించాలి. చల్లటి వాతావరణంలోనే మేతకు బయటకు పంపించాలి. ఈ రెండు నెలలు పశువులు, జీవాలని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉంది.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
ఈ ఏడాది చింతపండు గురించి మరిచిపోవల్సిందేనా!!
ఈ ఏడాది ఆశించిన స్థాయిలో కాపు లేదు. చింత పువ్వు దశలో ఈదురుగాలులు, వర్షాలు అధికంగా కురవడంతో ఆ ప్రభావం పంటపై పడింది. చాలాచోట్ల ఇదే పరిస్థితి. వాస్థవంగా ఏటా జిల్లాలో గుమ్మలక్ష్మీపురం, కురుపాం, సాలూరు, కొమరాడ, పాచిపెంట ప్రాంతాల్లో 5 వేల క్వింటాళ్ళు, సీతం పేట మన్యంలో ఏటా రెండు వేల క్వింటాల్ల వరకు చింతపండు దిగుబడి వస్తుంది.సాదారణంగా మన్యంలో చింతపండుకు మంచి డిమాండ్ ఉంది. గత ఏడాది చింతపండు నిల్వలు ఎక్కువగా ఉండడంతో కొనుగోలుకు మొగ్గు చూపలేదు. అయితే ఈ ఏడాది చింతపండు ధర మరింత ప్రియంగా ఉండే అవకాశం ఉంటుందని ఆశపడ్డారు.కానీ ఆశించిన దిగుబడి లేకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
ఆయిల్ పామ్ లో అంతర పంటగా మొక్కజొన్న
సిరులు కురిపిస్తున ఆయిల్ పామ్ పై రైతులు ఎంతగానో ఆసక్తి చూపుతున్న విషయం తెలిసిందే మరి పంట దిగుబడికి 3 నుండి 4 ఏళ్ళు వేచి చూడకుండా తోటలో మొక్కలు నాటినా నాలుగేళ్ల వరకు మొక్కజోన్న అంతర పంటగా సాగు చేసి ఎక్కువ ఆధాయం పొందవచ్చు. భుసారాన్ని బట్టి 8 వేల నుండి 10 వేల వరకు పెట్టుబడి అవుతుంది మరియు 90 రోజులకు 70 వేలకు పైగా ఆదాయాన్ని పొందవచ్చని అంతేకాక నీటి వినియోగం, ఎరువుల వాడకం తగ్గుతుందని అంతర పంటగా తీపి మొక్కజొన్న (sweet corn) సాగు చేసేందుకు ఖరిఫ్ లో జూన్- ఆగుస్ట్ మరియు రబీలో మర్చి- మే వరకు ఏడాదికి రెండుసార్ల వేసుకోడానికి అనుకులం అని సాగుచేసే రైతులు చెబుతున్నారు.