NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
చిరుధాన్య వంటకాలపై శిక్షణ !!
ఈనెల 30, 31, ఏప్రిల్ 1 తేదీలలో ఉ. 10-5 గంటల వరకు చిరుధాన్యాలతో తయారుచేసే వివిధ రకాల వంటకాలపై శిక్షణ కార్యక్రమం గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంట దగ్గరలోని కొర్నెపాడు లోని రైతునేస్తం ఫౌండేషన్ రైతు శిక్షణా కేంద్రంలో జరుగుతుంది. మిల్లెట్స్ రాంబాబు తదితరులు ప్రత్యక్షంగా చిరుధాన్యాలతో అనేక వంటకాల తయారీ విధానాన్ని తెలియజేస్తారు. వసతి, మిల్లెట్ భోజనం సదుపాయం ఉంది. పాల్గొనదలచినవారు 97053 83666/95538 25532 ఫోన్ చేసి తప్పనిసరిగా ముందుగా పేర్లు నమోదు. చేసుకోవాలని రైతునేస్తం ఫౌండేషన్ చెర్మన్ వై. వేంకటేశ్వరరావు గారు తెలిపారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
క్యాన్సర్ నివారణకు దివ్య ఔషధం !!
క్యాన్సర్ నివారించుటకు దివ్య ఔషధంలా పనిచేస్తుంది లక్ష్మణ ఫలం పనిచేస్తుంది. ఈ పండు చూడడానికి కొంచెం పనస పండులా, కట్ చేసి లోపల చూస్తే సీతాఫలం కనిపిస్తుంది. ఈ లక్ష్మణ చెట్లు గాలిలో తేమ, వర్షపాతం ఎక్కువ ఉండే దట్టమైన అడవుల్లో పెరుగుతాయి. బాగా పక్వానికి వచ్చి మగ్గిన కాయలను తినవచ్చు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, పోషక విలువలు అధికంగా ఉంటాయి. టీబీ, క్యాన్సర్, ఎయిడ్స్ వంటి వ్యాధులు ఉన్నవారికి ఈ పండు మేలు చేస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. దీనిని క్యాన్సర్ పేషెంట్లకు దివ్య ఔషధంగా 12 రకాల కేన్సర్ కారక కణాలను నిర్మూలించే ఔషధగుణాలు ఉన్నట్లు పలు పరిశోధనల ద్వారా తెలిసింది. పెద్ద ప్రేగు కేన్సర్, రొమ్ము కేన్సర్, ప్రొస్టేట్ కేన్సర్, శ్వాసకోస కేన్సర్, క్లోమ గ్రంధి కేన్సర్ వంటి ప్రాణాంతక క్యాన్సర్ కు ఈ లక్షణ ఫలం, చెట్లు మంచి ఔషధమని సైంటిస్టులు చెబుతున్నారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
వర్షాలకు నష్టపోయిన రైతులకు ప్రభుత్వసాయం !!
యాసంగి పంటలు చేతికొచ్చే దశలో హఠాత్తుగా వర్షాలు పడటంతో రైతులను తీవ్రంగా దెబ్బకొట్టింది. మూడు రోజులుగా ఊదురు గాలులు, వడగళ్లతో కూడిన వర్షాల కారణంగా కామారెడ్డి, నిజామాబాద్, సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్, కరీంనగర్, నిర్మల్ జిల్లాలో దాదాపు 38 వేల ఎకరాల్లో వరి, జొన్న, మొక్కజోన్న, మిర్చి, పొగాకు తదితర పంటలు దెబ్బతిన్నాయని రైతులు చెబుతున్నారు. కోతకు వచ్చిన పంట నేలరాలిపోవడంతో అన్నదాతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పంట నష్టపోయిన రైతులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుభవార్త చెప్పారు. ధాన్యానికి మద్దతు ధర చెల్లించాలని వ్యాపారులకు సూచించారు. అవసరమైతే రైతుల నుంచి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని అన్నారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
తెనేటిగల పెంపకంపై ఉచిత శిక్షణ !!
తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా ములుగులోని ఫారెస్ట్ కాలేజ్ అండ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూ ట్{FCRI} లో తెనేటిగల పెంపకం నుండి తేనే సేకరణ గురించి శాస్రియ పద్దతుల్లో మరియు సేంద్రియ పంటల ద్వారా సహజ సిద్దమైన తేనే ఉత్పత్తి ద్వారా ఆదాయ అభివృద్ధిపై ఉచిత భోదన చేస్తున్నారు. తెనేటిగల పెంపకం తక్కువ ఖర్చుతో, ఎక్కువ దిగుబడులు సాదించడం గురించి శాస్రవేత్తలు యువతకు మరియు రైతులకు శిక్షణఇస్తున్నారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
వరి విత్తన సాగు విస్తీర్ణం తగ్గుముఖం
ఉత్తర తెలంగాణలోనే విత్తనోత్పత్తికి అనుకూలమైన కరీంనగర్ జిల్లాలో ఈసారి వరి విత్తన సాగు తగ్గిపోయింది. జిల్లాలో అత్యధిక శాతం హుజూరాబాద్ వ్యవసాయ డివిజన్లోనే విత్తన సాగు అవుతోంది. కానీ గతేడాది విత్తన సాగు చేసిన రైతులకు సీడ్ ప్లాంట్ల యజమానులు, విత్తన కంపెనీలు ఆశించిన ధర చెల్లించకపోవడంతో పాటు ఈసారి సాగునీటి లభ్యత అనుకూలంగా లేకపోవడంతో రైతులు ఆసక్తిగా లేరు. దీంతో గతేడాది కంటే ఈసారి 10,992 ఎకరాల్లో విత్తన సాగు తగ్గింది.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
తెలంగాణకు వర్ష సూచన !!
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోని కొనసాగుతుండడంతో వాతావరణం చల్లబడింది. రానున్న నాలుగు రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్లోని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. హైదరాబాద్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే వడగండ్ల వాన కారణంగా మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో పంట నష్టం జరిగింది. సోమవారం వరకు గురువారం వరకు పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తున్నట్టు హెచ్చరించింది.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
రైతులు విత్తన కొనుగోళ్లలో మోసపోవద్దు....
మిరప రైతులు విత్తనాలు కొనుగోలు సమయంలో తొందరపడి యూ ట్యూబ్ ఛానల్స్ లేదా ఇతర రైతులతో 40క్వింటలు అదిగో 30క్వింటలు ఇవిగో అని మాట్లాడించి చెప్పే మాటలు నమ్మకండి. అడ్వాన్స్ డబ్బు ఇచ్చి మోసపోకుండా ఏ నేలలో ఏ రకం బాగా పండుతుందో అంచనా వేసుకొని తీసుకోవడం మంచిది. ఏ f1 వెరైటీలలో నైనా 2 లేదా 3క్వింటాల తేడా ఉంటుంది అన్నీ వెరైటీ లు బాగానే ఉంటాయి. ఇది మనకు తెలియని విషయం కాదు. మీరు తీసుకోవాలనుకున్న విత్తనాల కంపెనీ కి R&D సర్టిఫికెట్ ఉందా లేదా బిల్, బ్యాచ్ నెంబర్, డీలర్ సంతకం ఉండేటట్లు చూసుకొని తీసుకోండి. రైతులు వాతావరణ మరియు వారి నేల రకం ఆధారంగా గమనించి తొందర పడకుండా తొలకరి తర్వాతనే విత్తన కొనుగోలు చేసుకోవాలి.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
లక్ష్యానికి ఆమడ దూరంలో ఆయిల్ పామ్ సాగు
ఆయిల్ పామ్ సాగు తీరు ఒక అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి అన్న చందంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కనిపిస్తుంది. పామాయిల్ ను విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి నుంచి దేశంలోనే ఉత్పత్తి చేసే స్థాయికి చేరాలనే సంకల్పంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పంట సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. వంట నూనెల జాతీయ పథకం కింద కంపెనీలతో ఒప్పందాలు చేసుకొని జిల్లాల వారీగా సాగు లక్ష్యాలను నిర్ధేశించాయి. కంపెనీ ప్రతినిధులు, ఉద్యానవనశాఖ సహకారంతో పాత కరీంనగర్ జిల్లాలో నాలుగేళ్లలో 1.21 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రెండేళ్లలో ఇప్పటివరకు కేవలం 10. 4 వేల ఎకరాల్లో మాత్రమే నాటారు. రానున్న రోజుల్లో అయిన లక్ష్యాన్ని చేరుకుంటారో లేదో చూడాలి.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
వ్యవసాయ రంగంలో భారీగా పెరుగుతున్న డ్రోన్ పైలట్ డిమాండ్....
పెరుగుతున్న సాంకేతికత మరియు అధికమవుతున్న డ్రోన్ ఉత్పత్తి అనేక రంగాల్లో డ్రోన్ల వినియోగం విరివిగా జరుగుతుంది. డ్రోన్లకు పెరుగుతున్న క్రేజ్ తో పాటు వాటిని నడిపే డ్రోన్ పైలెట్లకు కూడా డిమాండ్ పెరుగుతుంది. మార్కెట్లో అధిక డిమాండ్ ఉన్న డ్రోన్ పైలట్ శిక్షణ కోసం, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DCGA), కొన్ని రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజషన్స్(RPTO) కి డ్రోన్ పైలెట్స్ కు శిక్షణ ఇవ్వడానికి అనుమతిని ఇచ్చింది. ఇండియా లో మొత్తం 52 ట్రైనింగ్ సంస్థలు ఉన్నాయ్. ఈ సంస్థల్లో ట్రైనింగ్ పొందేందుకు, అభ్యర్థులు, కనీసం 10వ తరగతి పాస్ అయ్యి ఉండాలి. దీనితో పాటుగా ఆధారకార్డ్, మరియు పాస్పోర్ట్ అవసరం. కొన్ని అధ్యయనాల ప్రకారం, 2026 నాటికి డ్రోన్ మార్కెట్ 15,000 వేల కోట్లకు చేరుకుంటుంది అని అంచనా, తద్వారా ఈ రంగంలో ఎన్నో ఉపాధి అవకాశాలు ఉన్నాయ్.....
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
గుజరాత్ లో జరిగిన అంతర్జాతీయ మిల్లెట్స్ మహోత్సవం....
2023 ని అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. తగ్గుతున్న చిరు ధాన్యాల పంటల సాగును తిరిగి పెంచేందుకు, ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా పోయిన సంవత్సరం, చిరు ధాన్యాలయినా రాగులు, సజ్జలు, జొన్నలు మొదలగు పంటల ఉత్పత్తిని పెంచేందుకు మరియు వాటి వినియోగాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఇదే క్రమంలో, గుజరాత్ అహ్మదాబాద్ లో గల సబర్మతి రివర్ఫ్రంట్ గ్రౌండ్ లో 2024 మిల్లెట్ మహోత్సవ కార్యక్రమం మార్చ్ 1, 2 తేదిలలో జరిగింది. చిరు ధాన్యాలను అనేక దుకాణాలలో ముఖ్య ఆకర్షణగా, మిల్లెట్స్ తో తయారు చేసిన అనేక పిండి వంటలను ఫుడ్ స్టాల్స్ను ప్రదర్శనలో ఉంచారు.