15 Apr , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

కార్బైడ్ తో మగ్గించిన పండ్లతో క్యాన్సర్

ఎండాకాలం వచ్చిదంటే చాలు అందరికి గుర్తొచ్చేది మామిడి పండ్లు. ఈ మామిడిలను సహజసిద్దంగా పండించినవి తింటే రుచితో పాటు ఆరోగ్యంగా ఉంటారు. కార్బన్ తో పండించడం నిషేదమాని అందరికి తెలిసిందే. సహజసిద్దంగా పండించే పండ్ల రంగు, రుచి, వాసన బాగుంటుంది. వివిధ మార్కెట్లలోగాని, విక్రయకేంద్రాల్లో గాని కార్బైట్స్ ని గుర్తించినట్లయితే వెంటనే వ్యవసాయ అధికారులకు గానీ మార్కెటింగ్ శాఖకు తెలపండి.

15 Apr , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

తెలుగు గడ్డ పై జీ 20 వ్యవసాయ సమ్మిట్

హైదరాబాద్ లో మూడు రోజుల పాటు జూన్‌‌ 15 నుంచి 17 వరకు జీ20 అగ్రికల్చర్‌‌ సమ్మిట్ జరగబోతుంది. ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా 30 దేశాలకు చెందిన అగ్రికల్చర్‌‌ మినిస్టర్లు, ఇక్రిశాట్, ఓఈసీడీ, ఏడీబీతో పాటు ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్‌‌ అండ్‌‌ అగ్రికల్చర్‌‌ సంస్థలు, వరల్డ్‌‌బ్యాంక్‌‌ సంస్థల ప్రతినిధులు కానున్నారు. వ్యవసాయానికి సంభదించి ఇది నాల్గోవ సదస్సు. వ్యవసాయంలో మారుతున్న మార్పులు, రానున్న రోజుల్లో ప్రజల అవసరాలు తీర్చేలా సాగుబాగు వంటీ కార్యక్రమాలపై చర్చలు జరగనున్నాయి.

13 Apr , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

మిరప క్వింటాలుకు రూ.20 వేలు

ఈ ఏడాది ఆహార పంటలతో పొల్చితే వాణిజ్య పంటలు సాగుచేసే రైతులకు మార్కెట్ ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. పత్తి మార్కెట్ ఆరంభంలో 10 వేల వరకు పలుకగా, ఇప్పుడు మిరప పంటకు 20నుంచి 22 వేల వరకు క్వింటాకు పలుకుతుంది. మహారాష్ట్రలోని నాగపూర్ లో అత్యధికంగా పలుకుతుండటంతో వ్యయప్రయాసాలకు ఓర్చి పక్కనే ఉన్న ఖమ్మం, ఆదిలాబాద్ రైతులు అక్కడికి మిరప పంటను తీసుకేళ్తున్నారు. మన దగ్గరి వ్యవసాయ మార్కెట్లలోనూ ఇదే ధరలు పలికితే తమకి రవాణా ఛార్జీలు ఆదా అవుతాయని రైతుల భావిస్తున్నారు.

13 Apr , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

NABARD Student Internship Scheme (SIS) 2023-24

NABARD invites applications for Student Internship Scheme 2023-24 from students pursuing their post- graduate degree/PGDM (having completed 1" year) or 5 years integrated courses (having completed 4 year) from institute/university. 1. Applications are invited only online through NABARD website. 2. Opening date for registration and submission applications - April 07, 2023 3. Closing date for submission of applications - April 23, 2023 4. For more details, visit website (https://www.nabard.org/whats-new.aspx).


12 Apr , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

40 శాతం మేర పెరిగిన వ్యవసాయ ఎగుమతులు

రోజురోజుకు సాగురంగం కొత్తపుంతలు తోక్కుతున్న వేళ, నాణ్యమైన దిగుబడులతో ఎగుమతులు ఊపందుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 5 సంవత్సరాల్లో (2017-2022 ) ఎగుమతులు పెరిగాయని, ఇందులో తెలంగాణ మరియు మహారాష్ట్ర ముందజలో ఉన్నాయని వెల్లడించింది. వ్యవసాయ ఎగుమతులు 2020-21లో రూ. 6,337 కోట్లుగా ఉండగా, అవి 2021-22లోదాదాపు రూ. 10,000 కోట్లకు పెరిగాయి. ముఖ్యంగా సుగంధ ద్రవ్యాలు , తృణధాన్యాలు, పత్తి, మామిడి, ద్రాక్ష, నిమ్మ, బియ్యం, సొయాబిన్, మొక్కజొన్న వంటి పంటలతో పాటు కొద్ది మొత్తంలో మాంసాన్ని కూడా ఎగుమతులు చేస్తున్నారు. సాగుకు రాయితీలు,సబ్సిడీలు, అధునాతన సాంకేతిక విధానాలు రైతుల ధరి చేరితే రానున్న 5 ఏండ్లలో మరో 35 నుంచి 40 శాతానికి ఎగుమతులు పెరగవచ్చు.

11 Apr , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

నాపంట యాప్ తొ, ప్రతి రైతు అవుతాడు స్మార్ట్!!

నాపంట® స్మార్ట్ రైతు యాప్ అనేది రైతులు తమ వ్యవసాయ పనులను ఆధునీకరించడానికి, లాభదాయకతను పెంచడానికి రూపొందించబడినది. ఇందులో రైతులు 120కి పైగా పంటలకు సంబందించిన తెగుళ్లు, వ్యాధులు మరియు కలుపు నిర్వహణ పద్ధతులతో సహా, సమయానుకూల సమాచారం మరియు వ్యవసాయానికి కావలసిన అన్నిరకాల సూచనలను పొందవచ్చు. రైతులు తమ పంటల గురించి ఖచ్చితమైన సమాచారంతో నిర్ణయాలు తీసుకోవడంలో మరియు ఖర్చులను తగ్గించుకుంటూ దిగుబడిని మెరుగుపరచడంలో సహాపడుతుంది. నాపంట ప్లాట్‌ఫారమ్ ద్వారా 3,500 పైగా వ్యవసాయ మార్కెట్లలోని రోజువారీ ధరలతో పాటు 5,000 పైగా వివిధ కంపెనీల పురుగుమందుల ఉత్పత్తులు మరియు వాటి ప్రత్యామ్నాయాల వివరాలు కూడా సులువుగా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. నాపంట యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి : bit.ly/NaPanta

10 Apr , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

ఒక్కసారి నాటితే 8 పంట కాలల వరకు దిగుబడులు

వాణిజ్య పంటల సాగుతో పోలిస్తే వరి సాగు చేయడం కాస్త సుఖమైన పని. అట్లాగే ఈ పంటలో వచ్చే అదాయం కూడా తక్కువే. సొంత పొలం ఉన్నప్పటికి ఎకరాకు 20 నుంచి 25 వేలు మిగలటం గగనమే. ఇలా పెరిగుతున్న ఖర్చులను తగ్గించేందుకు డ్రమ్ము సీడ్ విధానం, నాట్లు వేసే యంత్రాలు వంటివి వచ్చినప్పటికి పెద్దగా ఖర్చులో మార్పులేమి లేవు. ప్రస్తుతం విత్తన ఖర్చు, నారుపోయటం, నాట్లేయడం వంటి భాదలు తోలిగేలా చైనాకు చెందిన యున్నాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఒకసారి నాటితే 4 సంవత్సరాల (8 పంటలు) వరకు పంట దిగుబడినిచ్చే పీఆర్-23 (Perennial Rice) పేరుతో వంగడాన్ని రూపొందించారు. ఇండియాలోనూ ఇలాంటి విత్తనాలు అభివృద్ది చెందితే వరి సాగు రైతులకు విత్తనం, నారు మడుల తయారు, నాట్ల ఖర్చులు తగ్గినట్టే.


08 Apr , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

ఒకే చెట్టుపై 250 రకాల యాపిల్స్

ఇంగ్లాడ్, పశ్చిమ ససెక్స్ లోని చిచెస్టర్ సమీపంలోని చిధామ్ లో నివసించే బార్నట్ తన ఇంటి అవరణంలోని యాపిల్ చెట్టుకు అంటుకడుతూ 250 వేరైటీలను ఒకే మొక్కకు అంటుకట్టి జాగ్రత్తగా అభివృద్ధి చేశాడు. తనకి మొక్కల పై మక్కువ తో పెద్ద మొత్తంలో మొక్కలు నాటాలకున్నప్పటికి స్థలభావం దృష్యా ఇలా ఒకే మొక్కకు అంటు కట్టే విధానాన్ని ఎంచుకున్నానని బార్నట్ హార్టికల్చరిస్ట్ వివరించాడు. కొత్త రకాలను ప్రతి సంవత్సరం వేసవిలో మొలకెత్తించి, శీతాకాలంలో అంటుకోవడం ఇతనికి పరిపాటి. సుమారు 20 అడుగుల ఎత్తులో ఉన్న చెట్టుపై పండ్ల బరువు కారణంగా విరగకుండా కర్రతో సపోర్టు ఇచ్చి పెంచుతున్నారు.

06 Apr , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

మళ్ళీ రైతులకి వడగండ్ల వాన!!

తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ నుండి ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుండి 40 కి మీ వేగంతో గాలితో పాటు వడగళ్ల వాన కూడా వచ్చే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం రాష్ట్రంలో వరి కోత సమయం కావడంతో రైతులు తీవ్ర ఆందోళకు గురువవుతున్నారు. రానున్న నాలుగు రోజుల పాటు మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి అని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇప్పటికే అకాల వర్షాల వలన పంట నష్టపోయిన రైతులను ఈ వాన భయపెడుతుంది, కోతకు సిద్ధంగా ఉన్న వరి మరియు మామిడి పంటల్లో నష్టం కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. కావున రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

05 Apr , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

పెరిగిన పత్తి విత్తన ధరలు

ఈ ఏడాది బిజి 2 పత్తి విత్తన ప్యాకెట్ పై 43 రూపాయలు పెంచుతున్నట్లు తెలంగాణ వ్యవసాయశాఖ గెజిట్ విడుదల చేసింది. గతేడాది పత్తి ప్యాకెట్ కి 810 రూపాయలు ఉండగా ఈ ఏడాది పెరిగిన ధరతో 853 రూపాయలకు చెరింది. రెండుమూడేళ్లుగా పత్తి పంటలో నాణ్యమైన దిగుబడులు రావటంలేదని, దీనికి తోడు విత్తన ధరలు పెంచడంపై రైతులు, రైతుసంఘాల నాయకులు విమర్శిస్తున్నారు.