NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
ఆర్బీకేల ద్వారా పచ్చిరోట్ట విత్తన పంపిణి
రైతులకు ఖరీఫ్ సాగు సాఫీగా సాగాలన్నా.. అధిక దిగుబడులు సాధించాలన్నా, మరియు చీడ పీడల నుంచి రక్షణ పొందాలంటే పచ్చిరొట్ట సాగు అత్యంత కీలకం. పంట విత్తే ముందు వీటిని పొలాల్లో చల్లి సీజన్ సమీపించి వర్షాలు కురవగానే కలియదున్నడం ద్వారా భూములు సారవంతమవుతాయి. ఈ విదంగా రైతులను ప్రోత్సహించేందుకు జనుము, జీలుగ, పిల్లి పెసర వంటి విత్తనాలను మరియు ప్రకృతి వ్యవసాయ విధానంలో 30 రకాల విత్తనాలతో పచ్చిరొట్ట విత్తనాల కిట్ను రూపొందించి ఆర్బీకేల ద్వారా రైతులకు అందుబాటులోకి తెచ్చింది. రైతులు సద్వినియోగం చేసుకోగలరు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
నిమ్మకు ఫుల్ డిమాండ్
వేసవి తాపంతో నిమ్మకు డిమాండ్ భాగా పెరిగింది. ఈ ఏడాది అకాల వర్షాల కారణంగా నిమ్మ చెట్లకు ఉన్న పూత రాలిపోయి, దిగుబడులు తగ్గిపోయాయి. మార్కెట్లో ఒక్కో నిమ్మకాయను వ్యాపారులు 8 నుండి 10 రుపాయల వరకు అమ్ముతున్నారు. ఒక కిలో నిమ్మ 200 రూపాయలకు వరకు పలుకుతొంది. మరో రెండు నెలలు వరకు మార్కెట్ లో నిమ్మకు డిమాండ్ ఇలానే కొనసాగే అవకాశం ఉంది.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
ఆంధ్రప్రదేశ్ ఆర్బీకేల్లో చేపపిల్లలు
రాష్ట్రవ్యాప్తంగా 10,778 ఆర్బీకేల ద్వారా రైతులకు విత్తనాలు, ఎరువులు, సబ్సిడీ యంత్రాలు, బీమా, మార్కెటింగ్ వసతులు వంటి సేవలు అందిస్తుంది. వీటితో పాటు ఈ ఏడాది నుండి చేపల సీడ్ సరఫరా చేయడానికి సర్కారు ప్రణాళికలు చేసింది. దీనికోసం అని రాష్ట్రంలోని ఆర్బీకేలకు 54 ప్రభుత్వ ఫిష్ సీడ్ ఫామ్స్ ని ఈ - మత్స్యకార యాప్ ద్వారా అనుసంధానం చేసింది. రైతులు ఆర్బీకేల్లో బుకింగ్ చేసి రాష్ట్రంలో లైసెన్స్ పొందిన రిజర్వాయర్లకు జిల్లాల వారీగా ప్రభుత్వం అందించనుంది. రాష్ట్రవ్యాప్తంగా 1817 లైసెన్స్డ్ రిజర్వాయర్లు ఉన్నాయని, వీటికి 10.10 కోట్ల సీడ్ అవసరమవుతుందని ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఏడాది మరింత మత్స సంపద పెరగనుందని రైతులు అనందం వ్యక్తంచేస్తున్నారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
మక్కకు దిక్కేది
యాసంగి మక్క పంట చేతికొచ్చింది. ట్రక్కుల్లో ఎత్తుకొని మార్కెట్లోకి వెళ్లారు. కానీ కొనేవారు కానరాక ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. మద్ధతు ధర లేక అందినకాడికి దళారులు ఇచ్చి తీసుకెళ్తున్నారని నిర్మల్ రైతులు వాపోతున్నారు. క్వింటా 1700 కి మించి చెల్లించడంలేదని, మార్చి చివర్లో 2200 వరకు పలికిందని రైతులు తల్లడిల్లుతున్నారు. ప్రభుత్వం దృష్టీసారించి మద్ధతుధర చెల్లించి కొనుగోలు జరిగేటట్లు చూడాలని రైతులు కోరుకుంటున్నారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
మార్కెట్లోకి వస్తోంది నానో డీఏపీ
2021 సంవత్సరంలో నానో యూరియా ప్రపంచంలోనే మొదటి సారిగా రైతులకు అందించినా ఇఫ్కో కంపనీ ఈ ఏడాది నానో డీఏపీ ని కూడా అందించేందుకు సర్వం సిద్దం చేస్తుంది. నానో డీఏపీ ఆర లీటరుకు 600 రూపాయలని ప్రకటించింది. ఒక ఆర లీటరు బాటిల్ ఒక బస్తా ఎరువుతో సమానమని, అలాగే మొక్క ఆకులపై పడినప్పుడు కిరణజన్య సంయోగ క్రియ రేటుని పెంచి పంట దిగుబడులు పెరిగేలా చేస్తుందని ఇఫ్కో శాస్ర్తవేత్తలు చెబుతున్నారు. ఈ డీఏపీలో నత్రజని 8 శాతం, భాస్వరం 16 శాతంగా ఉన్నాయంటున్నారు. రానున్న రోజుల్లో నానోజింకు, నానో కాపర్ వంటి ఎరువులను కూడా మార్కెట్లోకి తీసుకొస్తామంటున్నారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
పెరుగుతున్న యాసంగీ పత్తి సాగు
ఖరీఫ్ సీజన్ అనగా జూన్ చివరి వారం లేదా జూలై మొదటి వారంలో పత్తి విత్తనాలు నాటడం అనావాయితి. అయితే ఇటివల నల్గొండ, ఖమ్మం జిల్లాకు చెందిన కొందరు రైతులు యాసంగీ పత్తి సాగు చేస్తున్నారు. ముందుగా పత్తి విత్తనాలు నాటడం కొద్దిగా కష్టమైనప్పటికి కలుపు సమస్య, తెగుళ్ల సమస్య తక్కువ ఉంటుందని రైతులు బావిస్తున్నారు. ఎకరాకు ఎక్కువ మోతాదులో విత్తనాలు నాటి ప్రతి చెట్టుకు 40 పైచీలుకు కాయలు కాసేలా ఉన్నాయని చెబుతున్నారు. ఇలా ప్రయోగత్మకంగా చేస్తున్న సాగు ఫలితాలనిస్తే రానున్న రోజుల్లో యాసంగీ పత్తి జోరందుకుంటుంది.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
తగ్గుతున్న పాల ఉత్పత్తి
పెరుగుతున్న పాడి ఖర్చులు, 40 డిగ్రీలు దాటుతున్న ఉష్టోగ్రతలు, విజృంభిస్తున్న వింత వ్యాధులతో పాలు ఉత్పత్తి తగ్గుతుంది. గతేడాది 221 మిలియన్ టన్నుల పాల ఉత్పత్తితో ప్రపంచంలో మొదటి స్ఖానంలో ఉన్నప్పటికి ఈ ఏడాది మొదటి ఉత్పత్తి భారీగా పడిపోయింది. మేత ఖర్చులు భారీగా పెరగడం, లాంఫీ వంటి చర్మ వ్యాధి సోకి దేశంలో చాల వరకు పశువులు మరణించాయి ఇదికూడా పాల ఉత్పత్తి తగ్గడానికి ఒక కారణంగా చెబుతున్నారు. అయినప్పటికి విదేశాల నుండి పాల దిగుమతి చేసుకోబోమని దేశంలోనే పాలకు సంబందించిన ఉపఉత్పత్తులను ఉత్పత్తి చేస్తామని కేంద్ర జంతు సంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల తెలిపారు .
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
మిరప విత్తన ధరలు పైపైకి
ఈ ఏడాది మిరప కాపు, మార్కెట్ ధరలతో రానున్న వర్షాకాలంలో సాగు విస్తీర్ణం పెరగనుందని అంచనా. దీంతో సీజన్ ఆరంభానికి ముందే మిరప విత్తనాలకు డిమాండ్ పెరుగుతుంది. నాణ్యమైన, మంచి విత్తన రకాలకు కిలో లక్ష ఇరవై వేల నుండి లక్షయాబై వేల వరకు పలుకుతుంది. వచ్చే నేలలో ఆరంభంలో మిరప విత్తన అమ్మకాలు జోరుకానున్నాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ పేరుతో విత్తన ధరల్ని రెట్టింపు చేశారు. ఇదే అదునుగా మోసాలకు తాపులేకుండా, నాసీ రకం విత్తనాలతో నష్టపోకుండా విత్తన ఎంపిక నుండే తగు జాగ్రత్తలు తీసుకొవాలి. విత్తన రకం, లెబుల్, లాట్ నెంబర్, జర్మినేషన్ శాతాలను తనికి చేసుకోని ఎంచుకొవాలి. నారు పోసుకునే ముందే రైతు స్థాయిలో విత్తన మొలక శాతాన్ని పరిక్షించుకుంటే మంచింది.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
7200 కేంద్రాల్లో వడ్లసేకరణ
ఈ యాసంగి వడ్ల సేకరణకై రాష్ట్రవ్యాప్తంగా 7200 కేంద్రాలను ప్రారభించారు. వరి సాగుచేసినా రైతులు దళారులకు విక్రయించి మోసపోవద్దు. వరికి మద్దతు ధరల వివరాలు గ్రేడ్ వన్కు రూ.2,060, సాధారణ రకానికి రూ.2,040 రూపాయలు చెల్లించనున్నారు. వాతావరణ మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, టార్పలిన్ కవర్లను అందుబాటులో ఉంచుకొవాలి. పెరిగన ఉష్టోగ్రతల దృష్యా కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు తగు జాగ్రత్తలు తీసుకొవాలి.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
కృషిదర్శన్ ఎక్స్ పో 2023
రైతులకు సాంకేతికతను ఎప్పటికప్పుడు అందించేందుకు అనంతపురంలోని ట్రాక్టర్ నగర్, గార్లదిన్నె లో ఉన్న దక్షిణ క్షేత్ర వ్యవసాయ యంత్రముల శిక్షణ మరియు పరీక్షణ సంస్థ నందు "కృషి దర్శన్ ఎక్స్ పో 2023" పేరుతో మే 6 వతేదిన ఒకరోజు ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఈ క్రార్యక్రమంలో యంత్రాల తయారీ దారులు, ఇంజనీర్లు, రైతులు పాల్గొన్నున్నారు. ఈ కార్యక్రమానికి రైతులు పెద్దఎత్తన పాల్గోని తమకు క్షేత్రస్థాయిల కావాల్సిన యంత్రాలు, పనిముట్లను ఎంచుకొని సాగును బాగుచేసుకొవాలనేదే మా భావన.