05 May , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

అకాల వర్షాన్ని తట్టుకున్న దొడ్డు రకం వరి వంగడం జేజిఎల్ - 24423

జేజిఎల్ - 24423 వరి రకాన్ని జగిత్యాల రైస్ -1 అని కుడా అంటారు. జగిత్యాల పోసాలా శాస్రవేత్తలు దీనిని 2019 లో విడుదల చేస్తే 2022- 23 వానాకాలం మరియు యాసంగిలో లక్షల ఎకరాలలో సాగు చేసి అకాల వర్షాలకు, వడగళ్ళ వాన మరియు ఈదురు గాలులకు పడిపోకుండా 90 శాతం వరకు తట్టుకునే నిలిచిందని శాస్రవేత్తలు తెలిపారు. ఇది రెండు సిజన్లకు అనుకూలమైన స్వల్పరకం అంతేకాక తక్కువ ఎత్తుతో దృడంగా ఉండి వర్షాలను, చలిని, దోమను కొంతవరకు తట్టుకుని అధిక దిగుబడి కూడా ఎక్కువే. జేజిఎల్ - 24423 కాక మరికొన్ని రకాల వంగడాలు త్వరలో రానున్నాయని శాస్రవేత్తలు వెల్లడించారు.

04 May , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

తెలుగు రాష్ట్రాలకు మోచా తుఫాన్ ముప్పు !!

తెలుగు రాష్టాలకు వాతావరణ శాఖ మళ్లీ రెయిన్ అలెర్ట్ ప్రకటించింది. ఉపరతల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ఇదిలా ఉండగా.. తీర ప్రాంతంలో మోచా తుఫాన్ కలకలం రేపుతోంది. రానున్న 48 గంటల్లో బంగాళాఖాతం ఆగ్నేయ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం బలపడి అల్పపీడనంగా మారి ఆ తర్వాత వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని ఈ నెల 9వ తేదీ వరకు మరింత బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

03 May , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

🌾తడిసిన ధాన్యానికి అదే ధర

భారీ వర్షాలకు ఆగమవుతోన్న తెలంగాణ అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం మనసు కుదుటపడే వార్త చెప్పింది. వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలకు తడిసిన ధాన్యం గురించి తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకే కొంటామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. రైతులెవ్వరూ అధైర్యపడొద్దని.. పండిన ప్రతీ గింజా కొంటామని తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చింది.

03 May , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

మామిడి పండ్లను తింటున్నారా ?

మామిడి పండును కేవలం కడిగి తింటే సరిపోదు మామిడిలో ఫైటిక్ యాసిడ్‌ అనే కెమికల్ ఉంటుంది. ఫైటిక్ యాసిడ్ అనేది యాంటీ న్యూట్రియంట్ అంటే ఇది ఇనుము, జింక్, కాల్షియం మరియు మినరల్స్ లోపాలను కలిగించే గుణాన్ని కలిగి ఉంటుంది. ఇది ఇతర మినరల్స్ ను శరీరం గ్రహించకుండా నిరోధిస్తుంది. కావున 10-30 నిమిషాలు నీటిలో నానబెట్టి తినడం ఆరోగ్యానికి మంచిది.


02 May , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

తడిసినా ధాన్యంపై ఉప్పు నీళ్ల పిచికారీ

తడిసినా ధాన్యంపై ఉప్పు నీళ్ల పిచికారీ. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో పంట నష్టం అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు సుమారు ఐదు లక్షల ఎకరాల్లో వరి, ఇతర పంటలు దెబ్బతిన్నాయి. తేమ శాతం ఎక్కువుందంటూ సర్కారు కొనకపోవడంతో ఆయా కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన వేల క్వింటాళ్ల వడ్లు వాన నీటిలో కొట్టుకుపోయాయి. అయితే తడిసిన ధాన్యం పాడవకుండా ఉప్పు కలిపిన నీళ్లను పిచికారి చేయాలి. ఇలా చేయడం వల్ల ధాన్యం రంగు మారకుండా, మొలక రాకుండా ఉంటుంది. ఇంకా కోతలు కానీ రైతులు మరో కొన్ని రోజులు వాయిదా వేయడమే మేలు.

02 May , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

RBK ల ద్వారా ఒక్క రూపాయి కే ఫ్రూట్ కవర్

పంట దిగుబడిని నాశనం చేసే పండు ఈగలు ఆశించకుండా మామిడి ఇతర పండ్ల తోటలలో రక్షణకు ఫ్రూట్‌ కవర్లను స్వల్ప ధరలకే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. బయట ఒక కవర్‌ ధర రూ.3 ఉండగా సబ్సిడీ ద్వారా రైతు భరోసా కేంద్రాల్లో ఒక్క రూపాయికే రైతులకు అందచేస్తున్నారు..

28 Apr , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

ఆకాల వర్షాలు - రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

రాబోయే 5 రోజుల వరకు తెలంగాణాలో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో మరియు వడగళ్ళతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారి చేసింది. 1. రైతులు చెట్లకింద విద్యుత్ స్థంభాల, తీగలు మరియు చెరువుల వద్ద ఉండకుండా మరియు పశువులను సురక్షిత ప్రదేశంలో ఉండేలా చూసుకోవాలి. 2. పోలాల నుండి అధిక వాన నీటిని బయటకు పోవడానికి మురుగు కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. 3. కోసిన పంటను తొందరగా సురక్షిత ప్రదేశానికి తరలించాలి. మార్కెట్ కి తరలించిన ధాన్యాన్ని తడవకుండా టార్పాలిన్ తో కప్పి ఉంచాలి. 4. పంట కోతకు సిద్దంగా ఉన్నటువంటి రైతులు రాబోవు మూడు రోజుల వరకు కోతలను మరియు పంటలలో రసాయన మందులు పిచికారీ చేసుకోకుండా వాయిదా వేసుకోవాలి.


27 Apr , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

రైతు కోసం - నాపంట రైతు కమ్యూనిటి సేవలు

ప్రియమైన రైతు సోదరులకు నమస్కారం..! 👉🏻 గత కొన్ని సంవత్సరాలుగా మీరు *నాపంట స్మార్ట్ అగ్రి యాప్* సేవలను ఉపయోగిస్తూనందుకు ధన్యవాదాలు., 👉🏻 *నాపంట స్మార్ట్ అగ్రి యాప్* ద్వారా రైతులు రోజువారీ వ్యవసాయంలో బాగంగా, సరైన సమయంలో నమ్మకమైన సలహాలు & సూచనలు పొందుతూ, పంట సంరక్షణతో పాటు పంట ఖర్చూ తగ్గించుకుంటూ లాభాలు పొందుతున్నారు. 👉 *నాపంట స్మార్ట్ అగ్రి యాప్* పంటకు సంభందించిన సలహలు , మార్కెట్ ధరలు, పెస్టిసైడ్ వివరాలు,డీలర్స్ సమాచరమే కాకుండా *తోటి రైతులకు దగ్గర అవ్వడం కోసం అగ్రి ఫోరమ్ , రైతు కమ్యూనిటీ, న్యూస్ & ఈవెంట్స్ ద్వారా మారుతున్న కాలనికి అనుగుణంగా మీకు తోడ్బాటు అందిస్తుంది.* 👉 మీకు మరింత దగ్గర అవ్వడానికి మా ప్రతినిధులు కేవలం మొబైల్ యాప్ కాకుండా whatsapp ద్వారా కూడా పంటకు సంబంధించిన సూచనలు ఇవ్వడానికి అందుబాటులో ఉంటారు. *👉🏻నాపంట యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి : bit.ly/NaPanta* *https://chat.whatsapp.com/G0nRDl4oGqnE698Lf4ndky*

27 Apr , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

30న ఆర్గానిక్ మేళా

30న భారత సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో ఈ నెల 30(ఆదివారం) ఉ. 9.30-సా. 7.30 వరకు ఖమ్మంలోని కొత్త బస్టాండ్ పక్కన ఆర్గానిక్ మేళా జరగనుంది సేంద్రియ, ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఉత్పత్తులను విక్రయిస్తారు. చిరుధాన్యాల కూరగాయలు, పండ్ల తోటలు, మిద్దెతోటల సాగుపై సదస్సు నిర్వహిస్తారు. సదస్సులో పాల్గొనదలచిన వారు ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. గోకృపామృతం మరియు విత్తనాల ఉచిత పంపిణీ ఉంటుంది. అందరూ ఆహ్వానితులే.

26 Apr , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

పాత పంటల జాతర

విశాఖ జిల్లా అరకు ప్రాంతంలోని డుంబ్రిగుడ మండలం కిల్లోగూడలో సంజీవని సంస్థ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థ సహకారంతో ఈ నెల 28- 29 తేదిల్లో జరగనుంది.ప్రకృతి వ్యవసాయనికి పట్టుకొమ్మ అయిన పాత పంటల విత్తనాల వైవిధ్యాన్ని ప్రతి ఏటా వినియోగిస్తూ పరిరక్షించుకొవటమే ఈ 15 వ పాత పంటల జాతర ముఖ్య ఉద్దేశ్యమని సంజీవని వ్యవస్థాపకులు దివుళ్లు పచారి గారు తెలిపారు. రైతులు అనాదిగా సాగు చేస్తున్న చిరుధాన్యలు, పప్పు ధాన్యలు , నూనె గింజలు, కూరగాయలతో పాటు దేశీ వరి రకాలను ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమంలో రైతులు పెద్ద ఎత్తున్న పాల్గొని, సేంద్రియ సాగుకు ఎక్కువ మంది రైతులు మళ్లేలా ప్రోత్సహించాలి.