06 Jun , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

ఏపీ మత్స్య విశ్వవిద్యాలయం డిప్లొమాలో ప్రవేశాలు

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్శిటీ, క్యాంప్ ఆఫీస్.. 2023-24 విద్యా సంవత్సరా నికి సంబంధించి డిప్లొమా(ఫిషరీస్ సైన్స్) లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోగలరు. » కోర్సు వ్యవధి: రెండేళ్లు. » బోధనా మాధ్యమం : ఇంగ్లీష్. » సీట్ల సంఖ్య: ప్రభుత్వ కళాశాలల్లో 55, అనుబంధ కళాశాలల్లో 440. » అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. » వయసు: 15 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. » ఎంపిక విధానం: పదో తరగతిలో సాధించిన మార్కులు, స్థానికత, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు. » ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 12.06.2023. » ఆలస్య రుసుముతో దరఖాస్తులకు చివరితేది: 15.06.2023. » వెబ్ ఆప్షన్ తేది: 19.06.2023, » వెబ్సైట్: www.apfu.ap.gov.in.

05 Jun , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

జూలై నెలలో రైతు బంధు

మరో వారం పది రోజుల్లో వానాకాలం ప్రారంభం కానుంది. ఇప్పటికే పలుచోట్ల రైతులు సాగుపనులు ముమ్మరం చేశారు. ముఖ్యంగా ఎరువులు చల్లుకొవడం, దుక్కులు దున్నుకొవడం, విత్తనాల సేకరణ వంటి పనుల్లో ఉన్నారు. అయితే పెట్టుబడి సాయంగా అందించే రైతు బంధు ఖాతాల్లో పడటానికి ఇంకా మాసం రోజులు పట్టొచ్చని, కొత్త పాసుపుస్తకాలు ఎంట్రీ వల్లే ఈ ఆలస్యం జరుగుతుందని సమాచారం. పెట్టుబడుల కొసం వడ్డి వ్యాపారులను ఆశ్రయించకుండా ఉండాలంటే పెట్టుబడి సాయం త్పరితగతినా అందించాలని రైతుల కొరుకుంటున్నారు.

03 Jun , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

భుసారానికి - పశువుల ఎరువు

ప్రస్తుతం ఖరిఫ్ పంట వేయడానికి సన్నద్దమవుతున్న రైతులు భూసారాన్ని పెంచడానికి సేంద్రియ ఎరువు భూ భౌతిక స్టితి మెరుగుపరచడానికి సరైనది. ఎకరాకు 10 టన్నులు (3ట్రాక్టర్లు) పశువుల ఎరువు వేస్తే ఫలితంగా సేంద్రియ పదార్ధం భూమిలో చేరి ఆరోగ్యంగా ఉండడమే కాక భూముల్లో నీటి నిల్వ సామర్థ్యం మెరుగుపడుతుంది. నేలలో సారం పెరిగి పంట దిగుబడి అధికంగా లభిస్తుంది. చీడపీడల సమస్య తగ్గి రసాయనిక ఎరువుల వినియోగం తగ్గుతుంది. ఎరువును చిమ్మించి మెట్ట దుక్కులు దున్నితే మరింత ప్రయోజనం ఉంటుంది. మెట్ట, మాగాణి భూములకు వర్షాలు కురవక ఒక ముందే పశువుల ఎరువు వేయాల్సి ఉంతుంది.

02 Jun , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

పొలాల్లో మిగిలిన వరి గడ్డిని కాల్చొద్దు

వరి కోతల తరువాత రెక్క నాగలి లేదా మల్చర్ సహాయంతో వరి గడ్డి పొలంలోనే కలియదున్నలి. గడ్డి తక్కువగా ఉన్నప్పుడు రోటోవేటర్ కూడా నడిపించే వీలుంటుంది. వరికొయ్యలను కాల్చితే నష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదని, కాల్చడం ద్వారా విపరీతమైన వేడితో భూమి సారాన్ని కోల్పోతుంది. ముఖ్యంగా నత్రజని, ఫాస్ఫరస్‌ లాంటి పోషక పదార్థాల శాతం తగ్గుతుంది, దిగుబడీ పోతుంది, భూమికి పీచు పదార్థంగా ఉపయోగపడే అవశేషాలు కాలిపోయి, పంటలకు అవసరమైన ఖనిజ లవణాలు దెబ్బతింటాయి. పొలాల్లో తిరిగే అనేక జీవరాసులు చనిపోయే ప్రమాదం ఉంది. దీంతో ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది. పొలాల గట్లు, మొరం గడ్డలపై ఉన్న పచ్చని చెట్లు కాలిపోవడంతో పర్యావరణానికి హాని కలుగుతుంది. ఆలస్యంగా కోతకు వచ్చే పంటలు, కల్లాల దగ్గరే ఉన్న ధాన్యం కాలిపోయి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని వ్యవసాయాధికారులు తెలుపుతున్నారు.


01 Jun , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

హైడ్రోపోనిక్ గ్రాసాలకు మస్త్ డిమాండ్

పౌల్ట్రీ, పాడి రంగాల్లో హైడ్రోపోనిక్ గ్రాసాల పై యజమానులు ఆసక్తీర చూపుతున్నారు. హైడ్రోపోనిక్ పశుగ్రాసం అంటే గోధుమ, మొక్క, జొన్న, బార్లీ వంటి గింజలను నేల లేకుండా, అవసరమైన పోషకాలతో సమృద్ధిగా ఉన్న నీటి ఆధారిత ద్రావణాలను ఉపయోగించి ఆకుపచ్చ గ్రాసంగా పెంచే పద్ధతి. నియంత్రిత వాతావరణంలో ధాన్యాలను మొలకెత్తించి, వారం లేదా అంతకంటే ఎక్కువ రోజుల్లో చిన్న మొక్కలుగా మారుతాయి. ఇందులో విటమిన్లు, ఖనిజాలు మరియు ఎంజైమ్‌ల అధిక మోతాదులో ఉంటాయి. అలాగే వాతావరణం లేదా సీజన్‌తో సంబంధం లేకుండా ఏడాది పొడవునా తాజా పచ్చి మేతను ఉత్పత్తి చేయగలవు. దీంతో పాడి రంగంలో పాల ఉత్పత్తి, పౌల్ట్రీ రంగంలో మాంసం ఉత్పత్తి పెరుగుతుంది.

31 May , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

జూన్ రెండో వారంలో నైరుతి ఋతుపవనాలు

వాతావరణ శాఖ ఋతుపవనాలు గమనం పై బులిటెన్ ను విడుదల చేసింది. జూన్ 4 వ తేదీన కేరళలోకి నైరుతి ఋతుపవనాల ప్రవేశించనున్నట్లు వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలో విస్తరించానికి దాదాపు వారం నుంచి 15 రోజుల సమయం పడుతుందన్నారు. ఋతుపవనాలు ప్రవేశించడం ద్వారా ఎండలు తగ్గు ముఖం పట్టే అవకాశం ఉంది. చిరుజల్లులను చూసి తొందర పడి రైతులు విత్తనాలు విత్తుకుంటే భూమిలో మొలకలు ఉడికిపోయే అవకాశం ఉంది కావున విత్తనం విత్తే తేమ కనబడినప్పుడే విత్తనాలు విత్తుకొవాలని రైతులకు విజ్తప్తీ.

31 May , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

good news for all

ఆసక్తి కల రైతులు మరియు agriculture products marketing చేస్తున్న ఎవరైనా సరే ఈ అవకాశం వినియోగించుకోవచ్చు. మరిన్ని పూర్తి సమాచారం కోసం 8247811789 నంబర్ లో WhatsApp ద్వారా సంప్రదించండి.


30 May , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

రాష్ట్రవ్యాప్తంగా ఆడపదడప వర్షాలు

తెలంగాణకు వ్యాప్తంగా ఇవాళ్టి నుంచి 5 రోజులపాటు వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తెలంగాణలోని కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని, కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు పడతాయన్నారు. గాలుల వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు ఉంటుందని అంచనా వేశారు. ఈ వర్షాలను దృష్టీలో ఉంటుకొని కాంటాలు కానీ వరి రైతులు తగు జాగ్రత్తలు తీసుకొవాలని, అలాగే లోతు దుక్కులు దున్నుకొవడం, పచ్చి రోట్ట పైర్ల వంటివి సాగు చేయడం వంటి పనులపై రైతులు దృష్టీ సారించాలి.

29 May , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

వరి పొలాల్లో ఇంటిగ్రేటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.

వరి సాగులో నీటి వాడకం అత్యధికం. నారు నాటిన తర్వాత నాలుగు నెలల వరకు నీరు తగ్గకుండా చూసుకోవాలి. అయితే సేంద్రియ పద్దతిలో సాగుచేసే వరి రైతులు చేపల సాగు చేసేలా ఇండోనేషియా రైతులు వినూత్న ప్రయత్నాలు సాగిస్తున్నారు. చేపలు, రొయ్యలు, బాతులను పెంచుతూ ఇంటిగ్రేటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. దీంతో వరి పొలాల్లో ఆక్సిజన్ బాగా లభించి దిగుబడి 10%శాతం పెరుగుతుంది అలాగే పొలంలోని కీటకాలను చేపలు తినడం వల్ల కీటకాల సంఖ్య తగ్గుతుందంటున్నారు.

27 May , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

5న ప్రకృతి రైతుల మహా సమ్మేళనం

జూన్ 5 - సోమవారంన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గో- ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో ప్రకృతి రైతుల మహా సమ్మేళనం నిర్వహించనున్నారు. పాలిక్లినిక్ రోడ్డులోని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ గ్రౌండ్లో ఉ. 10 గంటలకు సమ్మేళనం ప్రారంభమవుతుంది. “పాలాన్ని అమ్మే వ్యవసాయం మానేద్దాం, పాలాన్ని కొనుగోలు చేసే వ్యవసాయాన్నే చేద్దాం” అనే నినాదంతో ఈ మహా సమ్మేళనం నిర్వహించనున్నారు. దీనికి ప్రకృతి వ్యవసాయం చేస్తున్న 10 వేల మంది రైతులు, వినియోగదారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అందరూ పాల్గొని పర్యావరణ రక్షణ వ్యవసాయ విలువలను తెలుసుకోగలరు.