NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ !!
ఎకరం వరికి ఇకపై రూ.42-45వేల వరకు, పత్తికి రూ.44-46వేలు, మొక్కజొన్నకు రూ.32-34వేలు, పసుపుకు రూ.87వేల వరకు పంట రుణం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని సాంకేతిక కమిటీ బ్యాంకర్లకు సిఫార్సు చేసింది. మరియు ఆయిల్ పామ్ కు రూ42-44వేలకు, మిర్చికి రూ.82-84 వేలకు, టమాటాకు రూ.53-55వేలకు పెంచింది. అలాగే గొర్రెలు, మేకల యూనిట్లకూ రుణపరిమితి పెంచాలని సూచించింది.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
తెలంగాణకు వాతవరణ శాఖ చల్లని కబురు !!
తెలంగాణ రాష్ట్రంలో మార్చి నుండే ఎండలు మండిపోతున్నాయి. ఈ రెండు మూడు రోజుల్లో 43 డిగ్రీల పైగా ఎండ తీవ్రత పెరిగింది. దక్షిణాన ఎండలు దంచికొడుతుండడంతో ఇవ్వాలా రేపు వడ గాల్పులు ఉంటాయి. ఉత్తారాన రానున్న 4 రోజులు ఈదురుగాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురవనున్నాయి. ఆదివారం నుండి 13 జిల్లాలకు ఉత్తరాది జిల్లాల్లో మోస్తారు వర్షాలు పడనున్నాయని, కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
చెట్టు నుండి ఉప్పొంగి వస్తున్న జలధార !!
భారీగా ఉన్న చెట్ల చిటారు కొమ్మల వరకు ఎలా నీరు అందుతుందని ఆశ్చర్యంగా ఉంటుంది కదా.... అయితే ఒక చెట్టును కత్తితో నరికితే ఒక్కసారిగా జలధార బయటకు వస్తుంది. ఇది అల్లూరి జిల్లా దేవిపట్నం మండలం పాపికొండల నేషనల్ అటవీ ప్రాంతంలో నల్ల మద్ది చెట్టు నుంచి సుమారు 10 నుంచి 15 లీటర్ల వరకు నీరు రావడం గమనించామని అటవీ అధికారులు తెలిపారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
వ్యవసాయ మార్కెట్లకు వరుస సెలవులు !!
హోలీ, ఆదివారాల సందర్బంగా వ్యవసాయ మార్కెట్లకు వరుస సెలవులు వచ్చాయి. ఇప్పుడు మళ్ళి శుక్రవారం గుడ్ ఫ్రైడే మరియశని, ఆదివారాలలో వారాంతపు సెలవులు అయినందున వరుసగా సెలవులు ఉన్నాయి. నేడు ,రేపు మాత్రమే మార్కెట్ క్రయ విక్రయాలు జరుగుతాయి. కావున రైతులు ఈ విషయాన్ని తెలుసుకొని మార్కెట్ వెళ్లి ఇబ్బందులు పడకుండా ఇతర రైతులకు ఈ విషయాన్ని షేర్ చేయండి
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
ఆదివారం రైతు వెబినార్ సమావేశం !!
ఈ ఆదివారం 2024 మార్చి నెల 31వ తేదీన సాయంత్రం 6-55 గంటల నుంచి రైతు ఆన్లైన్ వెబినార్ సమావేశం జరగనుంది. ఇందులో భాగంగా రైతులకు బత్తాయి, చీనితోటల్లో వచ్చే తెగుళ్లు మరియు వాటి నివారణ పరిష్కార మార్గాల గురించి డాక్టర్. మధుసూదన్ రెడ్డి కూన్ రెడ్డి గారు మరియు సేంద్రియ వ్యవసాయ పద్ధతి ద్వారా వరిపంటను, కూరగాయలసాగును మిశ్రమంగా పండించే అనుభవాల గురించి అభ్యుదయ మహిళా రైతు తాడిపోయిన విజయలక్ష్మి గారు వివరిస్తారు. మీ పంట మరియు ఇతర వ్యవసాయ సందేహాలను అడిగి వివరంగా తెలుసుకోవచ్చు. ఈ https://meet.google.com/wph-iwki-nsy లింకు ద్వారా హాజరు కాగలరు. గూగుల్ లింక్ గురించి తెలియని వారు +91 70328 98114 కు ఫోన్ చేసి ఏలా జాయిన్ కావచ్చు అని తెలుసుకోవచ్చు. ఈ సమావేశం గురించి మీ వంతుగా ఇతర రైతులకు చెప్పడం ద్వారా వారికి సహాయపడవచ్చు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
చిరుధాన్య వంటకాలపై శిక్షణ !!
ఈనెల 30, 31, ఏప్రిల్ 1 తేదీలలో ఉ. 10-5 గంటల వరకు చిరుధాన్యాలతో తయారుచేసే వివిధ రకాల వంటకాలపై శిక్షణ కార్యక్రమం గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంట దగ్గరలోని కొర్నెపాడు లోని రైతునేస్తం ఫౌండేషన్ రైతు శిక్షణా కేంద్రంలో జరుగుతుంది. మిల్లెట్స్ రాంబాబు తదితరులు ప్రత్యక్షంగా చిరుధాన్యాలతో అనేక వంటకాల తయారీ విధానాన్ని తెలియజేస్తారు. వసతి, మిల్లెట్ భోజనం సదుపాయం ఉంది. పాల్గొనదలచినవారు 97053 83666/95538 25532 ఫోన్ చేసి తప్పనిసరిగా ముందుగా పేర్లు నమోదు. చేసుకోవాలని రైతునేస్తం ఫౌండేషన్ చెర్మన్ వై. వేంకటేశ్వరరావు గారు తెలిపారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
క్యాన్సర్ నివారణకు దివ్య ఔషధం !!
క్యాన్సర్ నివారించుటకు దివ్య ఔషధంలా పనిచేస్తుంది లక్ష్మణ ఫలం పనిచేస్తుంది. ఈ పండు చూడడానికి కొంచెం పనస పండులా, కట్ చేసి లోపల చూస్తే సీతాఫలం కనిపిస్తుంది. ఈ లక్ష్మణ చెట్లు గాలిలో తేమ, వర్షపాతం ఎక్కువ ఉండే దట్టమైన అడవుల్లో పెరుగుతాయి. బాగా పక్వానికి వచ్చి మగ్గిన కాయలను తినవచ్చు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, పోషక విలువలు అధికంగా ఉంటాయి. టీబీ, క్యాన్సర్, ఎయిడ్స్ వంటి వ్యాధులు ఉన్నవారికి ఈ పండు మేలు చేస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. దీనిని క్యాన్సర్ పేషెంట్లకు దివ్య ఔషధంగా 12 రకాల కేన్సర్ కారక కణాలను నిర్మూలించే ఔషధగుణాలు ఉన్నట్లు పలు పరిశోధనల ద్వారా తెలిసింది. పెద్ద ప్రేగు కేన్సర్, రొమ్ము కేన్సర్, ప్రొస్టేట్ కేన్సర్, శ్వాసకోస కేన్సర్, క్లోమ గ్రంధి కేన్సర్ వంటి ప్రాణాంతక క్యాన్సర్ కు ఈ లక్షణ ఫలం, చెట్లు మంచి ఔషధమని సైంటిస్టులు చెబుతున్నారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
వర్షాలకు నష్టపోయిన రైతులకు ప్రభుత్వసాయం !!
యాసంగి పంటలు చేతికొచ్చే దశలో హఠాత్తుగా వర్షాలు పడటంతో రైతులను తీవ్రంగా దెబ్బకొట్టింది. మూడు రోజులుగా ఊదురు గాలులు, వడగళ్లతో కూడిన వర్షాల కారణంగా కామారెడ్డి, నిజామాబాద్, సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్, కరీంనగర్, నిర్మల్ జిల్లాలో దాదాపు 38 వేల ఎకరాల్లో వరి, జొన్న, మొక్కజోన్న, మిర్చి, పొగాకు తదితర పంటలు దెబ్బతిన్నాయని రైతులు చెబుతున్నారు. కోతకు వచ్చిన పంట నేలరాలిపోవడంతో అన్నదాతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పంట నష్టపోయిన రైతులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుభవార్త చెప్పారు. ధాన్యానికి మద్దతు ధర చెల్లించాలని వ్యాపారులకు సూచించారు. అవసరమైతే రైతుల నుంచి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని అన్నారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
తెనేటిగల పెంపకంపై ఉచిత శిక్షణ !!
తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా ములుగులోని ఫారెస్ట్ కాలేజ్ అండ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూ ట్{FCRI} లో తెనేటిగల పెంపకం నుండి తేనే సేకరణ గురించి శాస్రియ పద్దతుల్లో మరియు సేంద్రియ పంటల ద్వారా సహజ సిద్దమైన తేనే ఉత్పత్తి ద్వారా ఆదాయ అభివృద్ధిపై ఉచిత భోదన చేస్తున్నారు. తెనేటిగల పెంపకం తక్కువ ఖర్చుతో, ఎక్కువ దిగుబడులు సాదించడం గురించి శాస్రవేత్తలు యువతకు మరియు రైతులకు శిక్షణఇస్తున్నారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
వరి విత్తన సాగు విస్తీర్ణం తగ్గుముఖం
ఉత్తర తెలంగాణలోనే విత్తనోత్పత్తికి అనుకూలమైన కరీంనగర్ జిల్లాలో ఈసారి వరి విత్తన సాగు తగ్గిపోయింది. జిల్లాలో అత్యధిక శాతం హుజూరాబాద్ వ్యవసాయ డివిజన్లోనే విత్తన సాగు అవుతోంది. కానీ గతేడాది విత్తన సాగు చేసిన రైతులకు సీడ్ ప్లాంట్ల యజమానులు, విత్తన కంపెనీలు ఆశించిన ధర చెల్లించకపోవడంతో పాటు ఈసారి సాగునీటి లభ్యత అనుకూలంగా లేకపోవడంతో రైతులు ఆసక్తిగా లేరు. దీంతో గతేడాది కంటే ఈసారి 10,992 ఎకరాల్లో విత్తన సాగు తగ్గింది.









