NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
రెండవసారి రికార్డ్ స్థాయి ధరలో పసుపు
నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం పసుపు పంటకు రికార్డు స్థాయిలో ధర పలికింది. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలానికి చెందిన పన్నాల మహిత అనే మహిళా రైతుకు చెందిన 17 క్వింటాళ్ల కొమ్ముకు గరిష్ఠంగా క్వింటాకు రూ.14255 చొప్పున ధర పలికింది. ఇదే ఈ సీజన్ అత్య ధిక ధరగా మార్కెటింగ్ సెలక్షన్ గ్రేడ్ కార్య దర్శి వెంకటేశం వెల్లడించారు.2011లో క్వింటా ఆల్టైమ్ రికార్డు ధర రూ.16,166 పలికింది. ఆ తర్వాత రూ.6-7 వేల మధ్య మాత్రమే లభిస్తోంది.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
పొగాకు రైతులకు వడ్డీ లేని రుణాలు !!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్ నెలలో సంభవించిన మిచౌన్గ్ తుఫాను వలన తీరా ప్రాంత పొగాకు రైతులకు భారీ నష్ఠాన్నీ మిగిలించింది. మొత్తం 75,355 హెక్టార్ల పంటకు గాను 14,730 హెక్టార్ల పంట కోతకు గురి అయ్యింది. ఈ తుఫాను కారణంగా ఎంతో మంది ఫ్ల్యూ క్యూరెడ్ వర్జినియా (FLV ) పొగాకు రైతులు తీవ్రంగా నష్ట పోయారు. అధిక వర్షపాతం, మరియు పొలంలో నీళ్లు నిలిచిపోవడం కారణంగా మొక్కలు కుళ్లిపోయి ఎండిపోయాయి పొగాకు రైతులకు కలిగిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10,000 వడ్డీ రహిత లోన్లను రైతులకు అందచెయ్యాలి అని నిర్ణయయించింది.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
నిమ్మకాయ ధరలకు రెక్కలు
హైదరాబాద్:- ఉమ్మడి జిల్లాలో కొద్ది రోజులుగా నిమ్మకాయ ధరలు పెరుగుతున్నాయి.బహిరంగ మార్కెట్లో గతంలో ఒక్క కాయ రూ.2 ఉండగా ప్రస్తుతం రూ.10కి రెండు చొప్పున అమ్ముతున్నారు. చాలా మంది మార్కెట్లో ధర చూసి కొనకుండానే వెనుదిరుగుతున్నారు. వర్షాభావం, తోటల విస్తీర్ణం తగ్గించడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
అమాంతం పెరిగిన కోడి ధరలు!! కిలో ఎంతో తెలుసా !!
తెలుగు రాష్ట్రాల్లో మాంస ప్రియులకు చికెన్ ధరలు షాకిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కొన్నిచోట్ల కిలో చికెన్ ధర ఏకంగా రూ.300 పలుకుతోంది. పెరిగిన ఎండలతోపాటు కోళ్ల ఉత్పత్తి తగ్గడమే దీనికి ప్రధాన కారణమని వ్యాపారులు అంటున్నారు. మరో పక్క బర్డ్ ఫ్లూతో కోళ్లు చనిపోతున్నాయి. మార్చి వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.. ఇక గుడ్డు ధర కూడా ఒక్కోటి రూ.6 పైనే పలుకుతోంది.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
ఈరోజు 3 గంటలకు !!ఆన్ లైన్ డెమో!! అధునాతన వ్యవసాయ పరికరాలు!!
ఆన్ లైన్ డెమో అధునాతన వ్యవసాయ ఎద్దుల పరికరాలు | ఫిబ్రవరి 26, 2024 - మధ్యాహ్నం 3 గంటల నుండి.. ఇన్నోవేషన్ గిల్డ్ సంస్థ భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో CSOలు / NGOలు ,గ్రామ వ్యవస్థాపకులు, మరియు రైతుల కోసం ఆన్లైన్ ప్రదర్శన నిర్వహిస్తోంది. ఈ ఈవెంట్ వైవిధ్యమైన వ్యవసాయ కార్యకలాపాల కోసం రూపొందించిన అధునాతన మరియు మెరుగుపరచబడిన వ్యవసాయ జంతువుల పరికరాలను ప్రదర్శిస్తుంది. దీనికి ముఖ్య అతిధి డాక్టర్ M డిన్, జంతు శక్తి వినియోగంపై ఆల్ ఇండియా కోఆర్డినేషన్ రీసెర్చ్ ప్రాజెక్ట్కి మాజీ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ 🙏Kindly Join: Date: Monday, February 26th, 2024 Time: 3:00 – 5:00pm (Time zone: Asia/Kolkata) Zoom Webinar link: https://us06web.zoom.us/j/81949846790?pwd=bDF2VXrhcqYMx8GsAkFemzxfTisoat . వివరాలకు సంప్రదించండి Mr Malyaj Shrivastava (80855 38290)
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
రైతుబంధుకు పరిమితులు
రైతులకు అందించే పెట్టుబడి సాయం తగ్గించే యోచనలో రాష్ట్ర సర్కారు భావిస్తోంది. ఈ సాయాన్ని 5 ఎకరాలకు లేదా 10 ఎకరాల లోపు రైతులకు వర్తించేలా చేయాలని, ఇప్పటికే మార్గదర్శకాల రూపకల్పనపై వ్యవసాయశాఖ పనిచేస్తూ, త్వరలోనే రాష్ట్రప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది అలాగే ఐటీ రిటర్న్ చేసేవారికి, ప్రభుత్వ అధికారులకు చెందినా భూములకు కూడా చెల్లించకూడదని భావిస్తున్నారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
వెల్లులి పొలంలో దొంగల బెడద!!
వెల్లులికి అధిక డిమాండ్ ఉండటం వల్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్న విషయం తెలిసినదే అయితే మధ్య ప్రదేశ్లోని చింద్వారాలో గత ఏడాది రైతులు నష్టపోయారు ఇప్పుడు కేజీ వెల్లుల్లి ధర రూ.500 పలుకుతుండటంతో సంతోషంగా ఉన్నారు మరియు దొంగల బెడద నుండి రక్షణకు అత్యాధునికంగా ఎనిమిది గ్రామాల రైతులు కలిసి తమ పొలాల్లో సీసీటీవీ కెమెరాలను అమర్చారు. దీనితో దొంగలను నిరోధించడంతోపాటు కూలీల పనితీరును కూడా పర్యవేక్షించగలుగుతున్నారు. పొలంలో అనుమానాస్పద పరిస్థితులు ఉంటే అలారం మోగుతుందని రైతులు తెలిపారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
తెలుగురాష్ట్రాలకు వాతావరణ శాఖ చల్లని కబురు !!
ప్రస్తుతం తెలంగాణలో విభిన్న వాతావరణం నెలకొంది. ఉదయం పూట చలి చంపేస్తుండగా... మధ్యాహ్న సమయంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అప్పుడే ఎండాకాలం వచ్చిందా అన్నట్లుగా ఎండలు మండిపోతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. నేటి నుండి 26 వరకు తెలుగు రాష్ట్రాలలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని, ఆకాశం పాక్షికంగా మేఘావృతమై మరియు ఉదయం వేళల్లో పొగమంచు పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
పత్తి కొనుగోళ్ళు వేగవంతం !!
కొన్ని జిల్లాల్లో మూడో విడత పత్తి కోతలు మరియు కొనుగోళ్ళు జరుగుతున్నాయి, ప్రపంచ మార్కెట్లో కూడా పత్తికి డిమాండ్ పెరిగింది ఈ తరుణంలోనే కొనుగోళ్ళు వేగవంతం చేయాలి. నాణ్యత ప్రమాణాలు అనుగుణంగా లేని పక్షంలో నిభందనల మేరకు ధరను నిర్ణయించి కొనుగోళ్ళు జరగాలని, సిసిఐ నుండి తప్పుకుంటే పత్తి ధరలు తగ్గే అవకాశాలున్నాయి కావున పత్తి కొనుగోళ్ళు నిరాటంకంగా వేగవంతం చేయాలని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు సిసిఐ ఎండికి లేఖ రాసారు,
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
🌾అత్యంత ఖరీదైన బియ్యం ఏది తెలుసా? .... కిలో ?
సాదారణంగా కిలో బియ్యానికి 60 -70 రూ. ఉంటుంది. కాని ఈ బియ్యం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది. దీని పేరు కిన్మీ ప్రీమియం. మార్కెట్లో ఈ బియ్యం కిలో ధర దాదాపు 12 వేల నుంచి 15 వేల రూపాయల వరకు పలుకుతోంది. కినెమై ప్రీమియం అనేది రుచి, ఆకృతి మరియు సువాసనకు ప్రసిద్ధి చెందిన అధిక-నాణ్యత కలిగిన చిన్న- ధాన్యం బియ్యం. సాధారణ ధర కంటే దాదాపు ఎనిమిది రెట్లు ఎక్కువ ధరతో ఉత్పత్తిదారుల నుండి కొనుగోలు చేసి పండిస్తారు. ఇది తరచుగా సుషీ మరియు ఇతర జపనీస్ వంటకాలకు ఉత్తమమైన బియ్యంగా పరిగణించబడుతుంది. ఈ ఖరీదైన బియ్యానికి అమెరికా, యూరప్ లలో డిమాండ్ ఎక్కువగా ఉంది. మీరు ఈ బియ్యాన్ని కొనుగోలు చేయాలనుకుంటే, ఈ-కామర్స్ వెబ్సైట్ల ద్వారా సులభంగా కొనుగోలు చేయవచ్చు.