విరుగుడు లేని పారాక్వాట్ గడ్డి మందు పై అవగాహన పెంచాలి : కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ జిల్లాలోని పెస్టిసైడ్ డీలర్లు, వ్యవసాయ అధికారులు, టీఎస్ ఎంసీఈసీ, డిఎపిపి సభ్యులతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమావేశం నిర్వహించారు. పురుగు మందులు విక్రయించిన డీలర్ల వద్ద రైతు వివరాలు ఉండాలన్నారు. ముఖ్యంగా విరుగుడు లేని పారాక్వాట్ గడ్డి మందు దుష్పరిమణామాలను రైతులకు వివరించాలని సూచించారు. పిచికారి సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలను రైతులకు వ్యవసాయ అధికారులకు తెలియజేయాలన్నారు. డీలర్లు క్రయవిక్రయముల్లో నిబంధనలు పాటించాలని ఆదేశించారు.
