01 Aug , 2025

20వ విడత : రేపే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ

ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జరిగే కార్యక్రమంలో ప్రధానమంత్రి రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 20వ విడత నిధులు శనివారం రిలీజ్ చేయనున్నారు.దేశ వ్యాప్తంగా 9.7 కోట్ల మంది రైతులకుగాను రూ. 20,500 కోట్లు జమ అవనున్నాయి. ఈ ప్రోగ్రాంలో కేంద్ర వ్యవసాయం మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొననున్నారు. ఈ స్కీమ్ ద్వారా ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం మూడు విడతలుగా రూ.6,000 ఆర్థిక సాయాన్ని(రూ.2,000 చొప్పున) అందజేసేది అందరికీ తెలిసిందే.