PMకిసాన్ సంపద యోజన బడ్జెట్ రూ. 6520 కోట్లకు పెంపు
కేంద్ర కేబినెట్ గురవారం రైతులు మరియు కోఆపరేటివ్ సొసైటీలకు ఊరట కల్పించింది. PMKISAN కిసాన్ సంపద యోజన పథకం బడ్జెట్ రూ.4600 కోట్ల నుండి రూ.6520 కోట్లకు పెంచుతూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. 2025-26 నుంచి 2029-29 వరకు నాలుగేళ్లకు నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి రూ.2000 కోట్ల గ్రాంట్ మంజూరు చేసింది. దీంతో దేశవ్యాప్తంగా పాడి, పశువులు, మత్స్య, చక్కెర, వస్త్ర, ఆహార ప్రాసెసింగ్, నిల్వ మరియు శీతల గిడ్డంగి, కార్మిక మరియు మహిళా నేతృత్వంలోని సహకార సంఘాలు వంటి వివిధ రంగాలకు చెందిన 13,288 సహకార సంఘాలలోని సుమారు 2.9 కోట్ల మంది సభ్యులు ప్రయోజనం పొందే అవకాశం ఉంది.
