28 Jul , 2025

ఆగస్టు నెలలోనైనా యూరియా కొరత తీరేనా

2025 వానాకాలని 9.80 లక్షల టన్నుల యూరియా కేటాయించగా నేటివరకు 2.37 లక్షల టన్నుల యూరియా తక్కువగా కేంద్రం సరఫరా చేసింది. ఈ లోటు సరఫరా వల్ల రైతులకు యూరియా కొరత ఏర్పడిందని, దీనికోసం ఇప్పటికే ఐదారుసార్లు కేంద్రఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాకు రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు వినతి పత్రాలు రాశామని, ఆగస్టు మాసం కేటాయింపులతో పాటు లోటు యూరియాని కూడా అందించే అవకాశం ఉందన్నారు. డీలర్లు ఎవరు కూడా ఎంఆర్పీ రేటుకు ఎక్కువ అమ్మకూడదని, అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.