తెలంగాణకు వర్ష సూచన!
భారత వాతావరణ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ తీరాన్ని ఇప్పటికే తాకాయి. ప్రస్తుతం ఇవి చురుకుగా కదులుతున్నాయి. ఈ నెల 27వ తేదీ నాటికి కేరళ తీరాన్ని చేరే అవకాశం ఉంది. జూన్ 12వ తేదీ వరకు తెలంగాణలోకి ప్రవేశించే అవకాశముంది.ఈసారి తెలంగాణలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్రమైన ఉష్ణోగ్రతల ప్రభావం రాబోయే వారం రోజుల్లో తగ్గనుంది.
