10 Apr , 2024

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ !!

ఎకరం వరికి ఇకపై రూ.42-45వేల వరకు, పత్తికి రూ.44-46వేలు, మొక్కజొన్నకు రూ.32-34వేలు, పసుపుకు రూ.87వేల వరకు పంట రుణం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని సాంకేతిక కమిటీ బ్యాంకర్లకు సిఫార్సు చేసింది. మరియు ఆయిల్ పామ్ కు రూ42-44వేలకు, మిర్చికి రూ.82-84 వేలకు, టమాటాకు రూ.53-55వేలకు పెంచింది. అలాగే గొర్రెలు, మేకల యూనిట్లకూ రుణపరిమితి పెంచాలని సూచించింది.