23 Feb , 2024

తెలుగురాష్ట్రాలకు వాతావరణ శాఖ చల్లని కబురు !!

ప్రస్తుతం తెలంగాణలో విభిన్న వాతావరణం నెలకొంది. ఉదయం పూట చలి చంపేస్తుండగా... మధ్యాహ్న సమయంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అప్పుడే ఎండాకాలం వచ్చిందా అన్నట్లుగా ఎండలు మండిపోతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. నేటి నుండి 26 వరకు తెలుగు రాష్ట్రాలలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని, ఆకాశం పాక్షికంగా మేఘావృతమై మరియు ఉదయం వేళల్లో పొగమంచు పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది