07 Feb , 2024

🌾కేంద్ర ప్రభుత్వం రాయితీతో చవగ్గా భారత్‌ బియ్యం !!

పెరిగిన బియ్యం ధరలతో అల్లాడిపోతున్న సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం రాయితీ ధరకు భారత్‌ బియ్యం విక్రయాలను మంగళవారం ఆహార శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ మంగళవారం ఢిల్లీలో ప్రారంభించారు. భారత్‌ రైస్‌ పేరుతో కిలో రూ.29 చొప్పున 5, 10 కిలోల సంచుల్లో ఇవి లభిస్తాయి.ఇవి ఈ-కామర్స్‌ వేదికలతో పాటు ఎంపిక చేసిన అవుట్ లెట్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. తొలి దశలో భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్‌ సమాఖ్య, భారత జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య, కేంద్రీయ భండార్‌ విక్రయ కేంద్రాల్లో భారత్‌ రైస్‌ను విక్రయిస్తారు. దీనికోసం 5 లక్షల టన్నుల బియ్యాన్ని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) సరఫరా చేయనుంది.