02 Feb , 2024

🌾వ్యవసాయరంగానికి బడ్జెట్ 2024 !!

రైతుల ఆదాయాన్ని పెంచడానికి ప్రభుత్వం తన ప్రయత్నాలను వేగవంతం చేస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ (Union Budget 2024) ప్రసంగంలో ప్రకటించారు. ఈ విషయంలో ప్రభుత్వం కనీస మద్దతును పెంచింది. అన్నదాతల కోసం క్రమానుగతంగా ఆదాయం పెంపు కోసం వివిధ చర్యలు తీసుకుంటున్నామన్నారు. మొత్తం మీద వ్యవసాయం, రైతుల సంక్షేమశాఖకు రూ.1.27 లక్షల కోట్లు, మత్స్య, పశుపోషణ, పాడి మంత్రిత్వ శాఖకు రూ.7105 కోట్లు, ఆహార శుద్ధి పరిశ్రమల శాఖకు రూ.3,290 కోట్లు కేటాయించారు. వ్యవసాయ రంగంలో మరింత అభివృద్ధికి ప్రైవేట్ మరియు పబ్లిక్ పెట్టుబడుల ప్రోత్సహించనున్నట్లు ప్రకటించారు.