02 Feb , 2024

🌱అతి పెద్ద జాతీయ నర్సరీ మేళా మొదలు !!

హైదరాబాద్‌ నెక్లెస్ రోడ్‌ పీపుల్స్ ప్లాజా ప్రాంగణంలో 15వ గ్రాండ్ నర్సరీ మేళా, భారత వ్యవసాయ, ఉద్యాన ప్రదర్శన - 2024 మొదలైంది. ఐదు రోజుల పాటు జరగనున్న ఈ గ్రాండ్‌ నర్సరీ మేళాను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రారంభించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి పేరుగాంచిన విత్తన, నర్సరీ, పనిముట్లు, యంత్రాలు, నగర సేద్యం సంబంధించి సాంకేతిక పరిజ్ఞానం, హైడ్రోపొనిక్స్ టెక్నాలజీ సంస్థలు, అందమైన పూల మొక్కలు, అలంకరణ స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఈ మేళాలో మొత్తం 160 పైగా స్టాళ్లు, ఐదు రోజుల పాటు జరిగే ఈ షోలో ఉదయం 9 నుండి రాత్రి 10 అందుబాటులో ఉంటుందని మేళా ఇంచార్జ్ తెలిపారు.