25 Jan , 2024

తెలంగాణలో ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహం !!

నూనె పంటలను పెంచడమే లక్ష్యంగా సాగుతున్న ఉద్యాన శాఖ, రాష్ట్ర వ్యాప్తంగా 25 జిల్లాల్లోని 8.14 లక్షల ఎకరాల్లో 1,62,800 మంది రైతులకు ఎకరానికి రూ. 1.20 లక్షల సాగుకు రుణసాయం అందించాలని కేంద్రం రాష్ట్రంలోని బ్యాంకులను ఆదేశించింది. రానున్న రోజుల్లో 80 లక్షల టన్నుల వరకు దిగుబడలు రాగా, వీటి నుంచి 14.80 లక్షల టన్నుల నూనె తయారవుతుందని, దీంతో దాదాపు 10,360 కోట్ల మేరకు ఆదాయం వస్తుందని వెల్లడించింది. రానున్న రోజుల్లో మరింత సాగు విస్తర్ణం కూడా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.