09 Nov , 2023

వరికి కనీస మద్దతు ధర నిర్ణయించిన ప్రభుత్వం..!

ఖరీఫ్ సీజన్లో కృష్ణా జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఈ మేరకు కామన్ రకం వరికి క్వింటాకు కనీస మద్దతు ధర రూ.2,183గా,గ్రేడ్-A రకానికి క్వింటాకు రూ.2,203గా నిర్ణయించామని JC అపరాజితాసింగ్ తెలిపారు. ఈ నెల 14 నుంచి ధాన్యం కొనుగోలుకై జిల్లాలోని 317 రైతు భరోసా కేంద్రాలను సిద్ధం చేశామని ఆమె స్పష్టం చేశారు.