03 Oct , 2023

తెలంగాణకు పసుపు బోర్డు !!

దేశంలో పండే పసుపులో సుమారు 70 శాతం నిజామాబాద్ ప్రాంతంలోనే పండుతుంది. అందుకే పసుపుకు ప్రత్యేకంగా బోర్డు కావాలని సుమారు నాలుగు దశబ్దాలుగా రైతులు వివిధ రూపాల్లో పోరాటాలు, నిరసనలు చేశారు. ఎట్టకేలకు తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోడీ గారు పసుపు బోర్డు (Turmeric Board) మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక్కడ బోర్డును ఏర్పాటు చేస్తే ఆ సంస్థ కేవలం పసుపుపైనే దృష్టి పెడుతుంది. లేదంటే సలహాలు, సూచనలు, పరిశోధనల కోసం రైతులు స్పైసెస్ బోర్డుపైనే ఆధారపడాల్సి ఉండేది అని, పసుపు బోర్డు ప్రకటనతో తెలంగాణ రైతులకు శుభవార్త తేలింది. దీంతో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పసుపు రైతుల సంబరాలు అంబారాన్ని అంటాయి.