30 Aug , 2023

ఉపాధితో ‘ఉద్యానా’నికి ఊతం

చిన్న, సన్నకారు రైతులను లాభాల బాటలో నడిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన పంటల దిశగా వారిని ప్రోత్సహిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది 50 వేల ఎకరాల్లో పండ్ల తోటలు సాగు చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకుని జూలైమాసంలో ఉపాధి హామి ఫథకం ద్వారా దరఖాస్తులు కొరింది. ఇందులో భాగంగా 33,6998 ఎకరాల్లో పండ్ల తోటలు వేసేందుకు 18640 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. అత్యధికంగా నల్గొండ జిల్లా నుండి 2978 మంది రైతులు ధరఖాస్తు చేసుకున్నారు. అలాగే ఆదిలాబాద్ జిల్లాలో 1005 ఎకరాలు లక్ష్యంగా పెట్టుకుంటే 1472 (147%) ఎకరాల్లో సాగుచేసేందుకు ముందుకు వచ్చారు. ముఖ్యంగా మామిడి, జామ, నిమ్మ, కొబ్బరి, డ్రాగన్ ప్రూట్ వంటి పంటలు పెంచేందుకు ఆసక్తీ కనబర్చారు. ఈ పథకానికి ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం, చిన్న,సన్నకారు రైతులకు 90 శాతం సబ్సీడితో అందించనున్నారు.