28 Aug , 2023

విద్యుత్ ట్రాక్టర్ @ ఒకసారి ఛార్జ్ చేస్తే 4 గంటలు

సాగురంగంలో ఖర్చులు రోజురోజుకు పెరగటం, కూలీల లేమి సమస్యలతో రైతులు అవస్థలు పడుతున్నారు. అయితే పెద్దపల్లి జిల్లాకు చెందినా శసిరథ్ రెడ్డి డిజిల్ తో పనిచేసే ట్రాక్టర్ కి బదులు విద్యుత్ తో పనిచేసేలా పరిశోధనలు మొదలుపెట్టి నాలుగైదు లక్షల ఖర్చుతో 26 హెచ్ పి మోటారును బిగించి ట్రాక్టర్ ను తయారుచేశాడు. అయితే ఇందులో 32 లిథియం ఫాస్పేట్ బ్యాటరీలను అమర్చి, స్మార్ట్ కంట్రోలర్ ని బిగించాడు . ఈ బ్యాటరి పుల్ చార్జీ చేస్తే దాదాపు 4 గంటల పాటు పనిచేస్తుందని,డిజిల్ తో పోలిస్తే 10 రేట్లు ఖర్చును ఆధాన చేస్తుందంటున్నారు.