21 Aug , 2023

ఉద్యాన పంట సాగులో అనంతపురం టాప్ తక్కువ ధరకే పండ్లు ,కూరగాయలు!!

అత్యల్ప వర్షపాతం తో నమోదయ్యే ప్రాంతంగా నిలిచింది అనంతపురం .ఈ ప్రాంతం లో బత్తాయి, డ్రాగన్ పండ్లు,అంజూర్,దానిమ్మ పండ్లు గ్రాండ్9 అరటి గెలలు మరియు ఖర్జూర పండ్లను పండిస్తున్నారు.తక్కువ నీటి తో అధిక దిగుబడినిచ్చే పంటలు రైతులకు మంచి ఆదాయ వనరుగా మారాయి.ఈ జిల్లా లో పండించే కూరగాయలు రుచికి నాణ్యతకు కూడా పేర్కొన్నవి.టమాట,పచ్చి మిరప,బెండకాయలు,ఎండు మిర్చి మొదలగు పంటలు సరసమైన ధరలకు లభిస్తుండటం తో కొనుగోలుదారులకు ,రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నాయి. ఈ ఉద్యాన పంట ఉత్పత్తులను విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు.రాష్ట్రం లో అన్ని పండ్లను పండించే జిల్లాల్లో మొదటిస్థానం లో నిలిచింది .ఈ తరహా పంటలు రైతులకు లాభదాయకంగా ఉంటుంది.