28 Jul , 2023

చెరకు సాగు రైతులకు ప్రభుత్వం తీపి కబురు !!

కేంద్ర ప్రభుత్వం 2023-2024 సంవత్సరానికి చెరకు ధర క్వింటాల్ కి రూ.315 ధరగా నిర్ణయించింది. దేశంలో చెరకు రైతులు ఇప్పటివరకు పొందుతున్న తమ చెరుకు పంటకు ఇదే అధిక ధర. అలాగే ప్రభుత్వం యూరియా సబ్సిడి పధకాన్ని "పీఎం ప్రణామ్" పథకం క్రింద మరో మూడేళ్లకు పెంచుతూ కూడా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇంకా రైతుల సంక్షేమానికి అనేక ఇతర కార్యక్రమాలు చేపట్టేందుకు కూడా కేంద్రం నిర్ణయించింది.