25 Jul , 2023

వర్షాకాలం - రైతన్నలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

1. రైతులు చెట్లకింద విద్యుత్ స్థంభాల, తీగలు మరియు చెరువుల వద్ద ఉండకుండా మరియు పశువులను సురక్షిత ప్రదేశంలో ఉండేలా చూసుకోవాలి. 2. పోలాల నుండి అధిక వాన నీటిని బయటకు పోవడానికి మురుగు కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. 3. పాములు, తేళ్లు, విషపు కీటకాలు ఎక్కువగా సంచరిస్తుంటాయి. అలాగే తెగిపడిపోయిన కరెంట్ వైర్లు ఉండే అవకాశం ఉంది కాబట్టి చెప్పులు, చేతిలో టార్చ్ తీసుకెళ్లాలి. 4. పురుగుల మందులు గాలికి కొట్టుకొస్తాయి కాబట్టి ముక్కు, నోటికి వస్త్రం కట్టుకుని రసాయనాలు పిచికారీ చేయాలి. 5. పిడుగులు పడే సమయంలో చెట్ల కింద ఉండొద్దు. ఫోన్ వాడొద్దు.