15 Jul , 2023

విజయవాడలో సీ-ఫుడ్ ఫెస్టివల్ !!

విజయవాడలో ఈనెల 28వ తేదీ నుంచి మూడు రోజుల పాటు సీ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర మత్స్య శాఖ తెలిపారు. దేశ వ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే రొయ్యల్లో 75 శాతం మన రాష్ట్రం నుంచే ఉత్పత్తి అవుతున్నా, మన రాష్ట్రంలో వినియోగం మాత్రం 5 శాతం లోపే ఉందని, ఈ పరిస్థితిని అధిగ మించాలంటే డొమెస్టిక్ మార్కెట్ను పెంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. స్థానిక వినియోగాన్ని పెంచడం, ప్రత్యా మ్నాయ మార్కెటింగ్ సౌకర్యాలను మరియు వినియోగదారుల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ సీ ఫుడ్ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నట్టు తెలిపారు.