22 Jun , 2023

కొత్త లబ్దిదారులకు రైతుబంధు

జూన్ 16 నాటికి కొత్తగా పట్టాదార్ పాస్ బుక్ వచ్చిన ప్రతి రైతులకు ఈ వానాకాలం రైతుబంధు పెట్టుబడి సాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పథకం పొందడానికి కొత్త పట్టాదారు పాస్ బుక్, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకం జిరాక్సు కాపీలను స్థానిక ఏఈవోలకు అందజేయాల్సి ఉంటుంది. బుధవారం నుంచే ఏఈవోలకు రైతుబంధు పోర్టల్లో ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి తెచ్చారు. రైతు పట్టాదారు పాస్బుక్ వివరాలను రైతుబంధు పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. ఈ నెల 26 నుండి రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణి చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది.