19 Jun , 2023

తొందరపడకు రైతన్నా...

జూన్ 3 వారం అవుతున్నా ఋతుపవనాల జాడ లేదు, నైరుతి ఋతుపవనాల రాక ఆలస్యమయ్యేలా ఉన్నందున పత్తి రైతులు తొందరపడి విత్తనాలను వేయొద్దు. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సమయంలో, ఈ వేడికి విత్తనాలు విత్తితే మొలకశాతం తగ్గుతుందని, దీంతో విత్తనాలు వృథా అయిపోయి సాగు ఖర్చు పెరుగుతుంది కావున వానలు పడిన తర్వాత భూమి చల్లబడి అనుకూలంగా ఉన్నాకే పత్తి విత్తుకోవాలంటున్నారు. జూలై 15 వరకు విత్తుకో వచ్చని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నారు.