11 May , 2023

నాకు ఐదేండ్లు నిండాయి@ రైతుబంధు

నాపేరు రైతుబంధు. నేను మే 10 2018 గురవారం రోజున సీఎం చేతుల మీదుగా కరీంనగర్ జిల్లా శాలపల్లిలో నాకు పురుడు పోశారు. నేనంటే రాష్ట్రవ్యాప్తంగా తెలవని నానుడు లేడు. మొదట్లో ఎకరాకు 8 వేలు ఇచ్చినా నేను ఆ తర్వాత ఏడాదే 10 వేలను నాద్వారా నా రాష్ర్ట రైతులందరికి అందిస్తున్నాను. నాకు చిన్న, సన్నకారు, పెద్దరైతులు అనే విభేదాలు సైతం లేకుండా ప్రతి ఏడాది దాదాపు 65 వేల కోట్లను గత 5 సంవత్సరాలుగా నిరంతయంగా అందిస్తున్నేఉన్నాను. నేను మధ్యవర్తులు, బ్రోకర్లు లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లోనే పడిపోతాను. నాతో రైతులకు పెట్టబడి తిప్పలు పూర్తిగా తగ్గకపోయినా కాస్తో కూస్తో సాయంగా మారానని మనస్పూర్తిగా భావిస్తున్నాను.