09 May , 2023

పంట నష్టానికి ప్రకృతి వ్యవసాయమే పరిష్కారమా....

మన దేశంలో ఇటివల కాలంలో కత్తెర పురుగు, నల్ల తామర, రుగోస్ తెల్లదోమ వంటి పురుగులు ఆశించి ఎక్కువ మొత్తంలో పంట నష్టానికి కారణం అవుతున్నాయి. అయితే రసాయన వ్యవసాయం వలన పురుగులు వలన 50 % పంట నష్టపోతె ప్రకృతి వ్యవసాయంలో 10 % మాత్రమే అవుతుంది, వ్యవసాయ సాగు మార్చుకుంటే వీటి తీవ్రత తగ్గే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ లో ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరిస్తున్న రైతు సాధికార సంస్థలు తెలియజేసారు. 30 రకాల పచ్చిరోట్ట పంటలను సాగు చేసిన తరువాత వాణిజ్య లేదా ఆహార పంటలను సాగు చేయడం వలన వాతావరణానికి నష్టం కలగకుండా, చీడపీడలను తట్టుకొని అధిక దిగుబడులతో పాటు ప్రకృతి వ్యవసాయం చేయడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయని లాభం పొందుతున్న రైతులు చెపుతున్నారు.