08 May , 2023

హెచ్‌టీ పత్తి అనుమతులకు అవకాశాలు

సాగులో ఖర్చు తగ్గిస్తూ, రాబడి పెంచి ఆదాయం రేట్టింపు చేసే దిశలో శాస్రవేత్తలు, ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అయితే జన్యుమార్పిడి విత్తనాలతో మానవజాతీకి ప్రమాదమని, అలాగే నేల, నీరు, వాతవరణం కలుషితం అవుతాయని మన ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నప్పటికి ఇప్పటికే పలు పంటలు అందుబాటులోకి వచ్చాయి. ఇదిలా ఉండగా వాణిజ్య పంటగా సాగుచేసే పత్తిలో హెర్బిసైడ్‌ టాలరెన్స్‌-హెచ్‌టీ బ్రీడ్ అందుబాటులోకి వచ్చింది. కలుపు మందు పిచికారీ చేసినప్పుడు పత్తి మొక్కకు ఎలాంటి నష్టం వాటల్లకుండా ఉండటమే దీని ప్రత్యేకత. ఈ విత్తనాలతో కలుపు పెట్టుబడులు, ఎరువుల ఖర్చు తగ్గుతుడటంతో రైతులు ఆసక్తీగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ విత్తనాలకై జెనిటిక్‌ ఇంజనీరింగ్‌ అప్రైజల్‌ కమిటీ పరిశీలిస్తోంది. మహికో,ర్యాలీస్‌, బయోసీడ్‌ కంపనీలు ఈ విత్తనాలను అభివృద్ది చేశాయి. రానున్న రోజుల్లో ఈ విత్తనాలకు అనుమతులు లభిస్తే పెట్టుబడుల ఖర్చు కాస్తోకూస్తో తగ్గినట్టే.