06 May , 2023

🌾యాసంగి వానతో నష్టం 8700 కోట్లు🌧

తెలంగాణ యాసంగిలో కురుస్తున్న అకాల వానల వలన వరి, మామిడి,మొక్కజొన్న వంటి ప్రధాన పంటలతోపాటు నిమ్మ, బొప్పాయి, మునగ వంటి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఈ ఏడాది యాసంగి సాగు విస్తీర్ణం 72.63 లక్షల ఎకరాలుగా రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాదే పెద్ద ఎత్తున సాగు జరిగిందని, ఇదే స్థాయిలో నష్టం వాటిల్లుతుందని వాపోతున్నారు. మామిడిలో దాదాపు 70 శాతం పంట నష్టపోయిందని దీని విలువ దాదాపు 8700 కోట్లుగా ఉంటుందన్నారు. వరి 12లక్షల ఎకరాల్లో నష్టం వాటిల్లింది. పెట్టుబడులన్నీ నష్టపోయాయని రైతులు వాపోతూ, సర్కారు సాయం కోసం ఎదురుచూస్తున్నారు.