04 May , 2023

తెలుగు రాష్ట్రాలకు మోచా తుఫాన్ ముప్పు !!

తెలుగు రాష్టాలకు వాతావరణ శాఖ మళ్లీ రెయిన్ అలెర్ట్ ప్రకటించింది. ఉపరతల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ఇదిలా ఉండగా.. తీర ప్రాంతంలో మోచా తుఫాన్ కలకలం రేపుతోంది. రానున్న 48 గంటల్లో బంగాళాఖాతం ఆగ్నేయ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం బలపడి అల్పపీడనంగా మారి ఆ తర్వాత వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని ఈ నెల 9వ తేదీ వరకు మరింత బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.