03 May , 2023

🌾తడిసిన ధాన్యానికి అదే ధర

భారీ వర్షాలకు ఆగమవుతోన్న తెలంగాణ అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం మనసు కుదుటపడే వార్త చెప్పింది. వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలకు తడిసిన ధాన్యం గురించి తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకే కొంటామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. రైతులెవ్వరూ అధైర్యపడొద్దని.. పండిన ప్రతీ గింజా కొంటామని తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చింది.