02 May , 2023

తడిసినా ధాన్యంపై ఉప్పు నీళ్ల పిచికారీ

తడిసినా ధాన్యంపై ఉప్పు నీళ్ల పిచికారీ. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో పంట నష్టం అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు సుమారు ఐదు లక్షల ఎకరాల్లో వరి, ఇతర పంటలు దెబ్బతిన్నాయి. తేమ శాతం ఎక్కువుందంటూ సర్కారు కొనకపోవడంతో ఆయా కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన వేల క్వింటాళ్ల వడ్లు వాన నీటిలో కొట్టుకుపోయాయి. అయితే తడిసిన ధాన్యం పాడవకుండా ఉప్పు కలిపిన నీళ్లను పిచికారి చేయాలి. ఇలా చేయడం వల్ల ధాన్యం రంగు మారకుండా, మొలక రాకుండా ఉంటుంది. ఇంకా కోతలు కానీ రైతులు మరో కొన్ని రోజులు వాయిదా వేయడమే మేలు.