24 Apr , 2023

ఆంధ్రప్రదేశ్ ఆర్బీకేల్లో చేపపిల్లలు

రాష్ట్రవ్యాప్తంగా 10,778 ఆర్బీకేల ద్వారా రైతులకు విత్తనాలు, ఎరువులు, సబ్సిడీ యంత్రాలు, బీమా, మార్కెటింగ్ వసతులు వంటి సేవలు అందిస్తుంది. వీటితో పాటు ఈ ఏడాది నుండి చేపల సీడ్ సరఫరా చేయడానికి సర్కారు ప్రణాళికలు చేసింది. దీనికోసం అని రాష్ట్రంలోని ఆర్బీకేలకు 54 ప్రభుత్వ ఫిష్ సీడ్ ఫామ్స్ ని ఈ - మత్స్యకార యాప్ ద్వారా అనుసంధానం చేసింది. రైతులు ఆర్బీకేల్లో బుకింగ్ చేసి రాష్ట్రంలో లైసెన్స్ పొందిన రిజర్వాయర్లకు జిల్లాల వారీగా ప్రభుత్వం అందించనుంది. రాష్ట్రవ్యాప్తంగా 1817 లైసెన్స్డ్ రిజర్వాయర్లు ఉన్నాయని, వీటికి 10.10 కోట్ల సీడ్ అవసరమవుతుందని ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఏడాది మరింత మత్స సంపద పెరగనుందని రైతులు అనందం వ్యక్తంచేస్తున్నారు.