27 Mar , 2023

క్వింటా ఎండు మిర్చి @ 48786/-

ఈ ఏడాది అతి, అనావృష్టితో చాలా పంటలు దెబ్బతిన్నప్పటికీ వచ్చిన అరకోర దిగుబడులకు మార్కెట్ ధరలు ఆశాజనకంగా ఉండటం రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాణిజ్య పంటైనా మిరపకి కర్నూలు మార్కెట్ యార్డులో రికార్డు ధరలు పలుకుతున్నాయి. శనివారం కర్నూలు మార్కెట్ యార్డులో క్వింటా ఎండు మిర్చికి 48 వేల 786 రూపాయలు పలకటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ధరతో మార్కెట్ యార్డులో శనివారం ఒక్కరోజే 295 క్వింటాళ్ల ఎండుమిర్చి బస్తాలను రైతులు విక్రయానికి తీసుకువచ్చారు.