14 Mar , 2023

రైతులకు శుభవార్త - మార్కెట్ యార్డులో రూ.5 కే భోజన సౌకర్యం !

తెలంగాణ ప్రభుత్వం పట్టణానికి పనికోసం వచ్చే రైతులు సమీప పట్టణ మార్కెట్టుకు వెళ్ళినప్పుడు అధిక మొత్తంలో వారి భోజనానికి ఖర్చు చేయవసి వస్తుంది. వారికీ తక్కువ ధరకు భోజన సౌకర్యాన్ని అందిస్తున్న పథకం ‘అన్నపూర్ణ పథకాన్ని’ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం రైతులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు అన్నపూర్ణ పథకాన్ని హైదరాబాద్ సహా పలు నగరాల్లో, పట్టణాల్లో, ఆసుపత్రుల్లో అమలు చేస్తున్నారు. ఇక్కడ కేవలం రూ.5కే భోజనం అందజేస్తారు. రైతుల ఖర్చులను తగ్గించిన నాణ్యమైన ఆహారం అందించాలని ప్రభుత్వం కృషి చేస్తుందని అధికారులు తెలిపారు.