17 Feb , 2023

జలకళ చూసి సీఎం సంతోషం

కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని మద్య మానేరు, దిగువ మానేరు జలాశయాల జలకలను చూసి ముఖ్యమంత్రి కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. కొండగట్టు ఆలయానికి వచ్చిన సీఎం తిరుగు ప్రయాణంలో హెలికాప్టర్లో వెళ్తూ కాలేశ్వర జలాలను ఎత్తిపోస్తున్న తీరు మధ్య మానేరు నిండుకుండం తలపిస్తుందని. ఎక్కడి నుంచి ఎటువైపునకు జల దారాలు వెళుతున్నాయని విషయాన్ని సీఎం వివరించాడు. ఒకప్పుడు ఎడారిని తలపించిన ఈ ప్రాంతం ఇప్పుడు కోనసీమను తలపిస్తుందని ముఖ్యమంత్రి ఆనందం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.